JD Vance: త్వరలో భారత్లో అమెరికా ఉపాధ్యక్షుడి ఫ్యామిలీ పర్యటన
- త్వరలో భారత్లో అమెరికా ఉపాధ్యక్షుడి ఫ్యామిలీ పర్యటన
- మార్చి నెలాఖరుకి భారత్లో పర్యటించే అవకాశం ఉందని సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ త్వరలో భారత్లో పర్యటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెలలోనే జేడీ వాన్స్ ఫ్యామిలీ భారత్ను సందర్శించనున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి. గత నెలలో జేడీ వాన్స్.. ఫ్రాన్స్, జర్మనీలో తొలి విదేశీ పర్యటన చేశారు. రెండో విదేశీ పర్యటన భారత్లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Pranay Amrutha: ఇన్నాళ్ల నిరీక్షణ తర్వాత న్యాయం జరిగింది.. అమృత ఎమోషనల్ పోస్ట్
Also Read
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
- Pakistan: పాక్లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్ఖాన్పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
ఉషా వాన్స్.. పూర్వీకులది ఆంధ్రప్రదేశ్. ఆమె తల్లిదండ్రులు భారత్ నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. ఉషా వాన్స్.. అమెరికాలో విద్యను అభ్యషించేటప్పుడు జేడీ వాన్స్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే తాజాగా జరిగిన అమెరికా ఎన్నికల్లో విజయం సాధించడంతో అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ బాధ్యతలు చేపట్టారు. మొత్తానికి మార్చి నెలాఖరుకి భారత్లో ఈ దంపతులు పర్యటించనున్నట్లు సమాచారం.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్పై భారీగా సుంకాలు పెంచేశారు. ఏప్రిల్ 2 నుంచి భారత్పై సుంకాలు అమలవుతాయిని పేర్కొ్న్నారు. ఈ నేపథ్యంలో జేడీ వాన్స్.. భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. జేడీ వాన్స్ భారత పర్యటన తర్వాతైన అమెరికాలో మార్పు వస్తుందేమో చూడాలి.
ఇది కూడా చదవండి: Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్లో రన్యారావు భర్త పాత్ర.. డీఆర్ఐ నెక్ట్స్ ప్లాన్ ఇదే!
ఇదిలా ఉంటే ట్రంప్ వాణిజ్య యుద్ధం ప్రకటించన దగ్గర నుంచి స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోతుంది. అంతేకాకుండా అమెరికా మార్కెట్ కూడా భారీగా దెబ్బతింది.
ఇటీవల ప్రధాని మోడీ ఫ్రాన్స్ పర్యటన చేశారు. అక్కడ జేడీ వాన్స్ కుటుంబంతో మోడీ భేటీ అయ్యారు. అలాగే జేడీ వాన్స్ పిల్లలకు మోడీ ప్రత్యేకమైన బహుమతులను కూడా అందజేశారు. జేడీ వాన్స్ కుమారుడు వివేక్ పుట్టినరోజు వేడుకల్లో కూడా మోడీ పాల్గొన్నారు. జేడీ వాన్స్ కుటుంబ సభ్యులతో అద్భుతమైన సమావేశం జరిగిందని.. వివిధ అంశాలపై గొప్ప సంభాషణ జరిగిందని మోడీ ఎక్స్ ట్విట్టర్లో పేర్కొన్నారు. మోడీకి ట్వీట్కు జేడీ వాన్స్ కూడా కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Sheikh Hasina: షేక్ హసీనాకు బంగ్లాదేశ్ భారీ షాక్.. బ్యాంక్ అకౌంట్లతో పాటు ఆస్తులు సీజ్
తాజావార్తలు
-
Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్ను చూడలేకపోతున్నారు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
-
BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్పై బీజేపీ సెటైర్లు..
-
Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్లో దీని ధర ఎంతో తెలుసా..?
-
Danam Nagender : దానం నాగేందర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు అప్పీల్
-
Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!