JD Vance: త్వరలో భారత్లో అమెరికా ఉపాధ్యక్షుడి ఫ్యామిలీ పర్యటన
- త్వరలో భారత్లో అమెరికా ఉపాధ్యక్షుడి ఫ్యామిలీ పర్యటన
- మార్చి నెలాఖరుకి భారత్లో పర్యటించే అవకాశం ఉందని సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ త్వరలో భారత్లో పర్యటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెలలోనే జేడీ వాన్స్ ఫ్యామిలీ భారత్ను సందర్శించనున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి. గత నెలలో జేడీ వాన్స్.. ఫ్రాన్స్, జర్మనీలో తొలి విదేశీ పర్యటన చేశారు. రెండో విదేశీ పర్యటన భారత్లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Pranay Amrutha: ఇన్నాళ్ల నిరీక్షణ తర్వాత న్యాయం జరిగింది.. అమృత ఎమోషనల్ పోస్ట్
Also Read
- PM Modi: రోమ్లో మోదీ.. భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యంపై దృష్టి.!
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
ఉషా వాన్స్.. పూర్వీకులది ఆంధ్రప్రదేశ్. ఆమె తల్లిదండ్రులు భారత్ నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. ఉషా వాన్స్.. అమెరికాలో విద్యను అభ్యషించేటప్పుడు జేడీ వాన్స్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే తాజాగా జరిగిన అమెరికా ఎన్నికల్లో విజయం సాధించడంతో అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ బాధ్యతలు చేపట్టారు. మొత్తానికి మార్చి నెలాఖరుకి భారత్లో ఈ దంపతులు పర్యటించనున్నట్లు సమాచారం.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్పై భారీగా సుంకాలు పెంచేశారు. ఏప్రిల్ 2 నుంచి భారత్పై సుంకాలు అమలవుతాయిని పేర్కొ్న్నారు. ఈ నేపథ్యంలో జేడీ వాన్స్.. భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. జేడీ వాన్స్ భారత పర్యటన తర్వాతైన అమెరికాలో మార్పు వస్తుందేమో చూడాలి.
ఇది కూడా చదవండి: Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్లో రన్యారావు భర్త పాత్ర.. డీఆర్ఐ నెక్ట్స్ ప్లాన్ ఇదే!
ఇదిలా ఉంటే ట్రంప్ వాణిజ్య యుద్ధం ప్రకటించన దగ్గర నుంచి స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోతుంది. అంతేకాకుండా అమెరికా మార్కెట్ కూడా భారీగా దెబ్బతింది.
ఇటీవల ప్రధాని మోడీ ఫ్రాన్స్ పర్యటన చేశారు. అక్కడ జేడీ వాన్స్ కుటుంబంతో మోడీ భేటీ అయ్యారు. అలాగే జేడీ వాన్స్ పిల్లలకు మోడీ ప్రత్యేకమైన బహుమతులను కూడా అందజేశారు. జేడీ వాన్స్ కుమారుడు వివేక్ పుట్టినరోజు వేడుకల్లో కూడా మోడీ పాల్గొన్నారు. జేడీ వాన్స్ కుటుంబ సభ్యులతో అద్భుతమైన సమావేశం జరిగిందని.. వివిధ అంశాలపై గొప్ప సంభాషణ జరిగిందని మోడీ ఎక్స్ ట్విట్టర్లో పేర్కొన్నారు. మోడీకి ట్వీట్కు జేడీ వాన్స్ కూడా కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Sheikh Hasina: షేక్ హసీనాకు బంగ్లాదేశ్ భారీ షాక్.. బ్యాంక్ అకౌంట్లతో పాటు ఆస్తులు సీజ్
తాజావార్తలు
-
Rishabh Pant: మేం తోపులం, కానీ కలిసిరాలేదు.. రిషభ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
God of War Confirmed: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్..నాగవంశీ సాలిడ్ హింట్!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
-
Sunil Narang: ‘ఏకాభిప్రాయం లేదు.. ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి’ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ గుడ్ బై!
ట్రెండింగ్
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!