UN-India: ఒకరిని జైల్లో పెట్టారు.. ఇంకొకరిని అందలం ఎక్కించారు.. పాక్పై భారత్ ధ్వజం
- ఒకరిని జైల్లో పెట్టారు.. ఇంకొకరిని అందలం ఎక్కించారు
- జమ్మూకాశ్మీర్, లడఖ్ భారత్లో అంతర్భాగాలు
- యూఎన్లో పాకిస్థాన్పై ధ్వజమెత్తిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి పాకిస్థాన్పై భారత్ ధ్వజమెత్తింది. ‘‘శాంతి కోసం నాయకత్వం’’ అనే అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి బహిరంగ చర్చ చేపట్టింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ అనవసరం విషయాలు ప్రస్తావించింది. జమ్మూ కాశ్మీర్, సింధు జలాలపై నోరుపారేసుకుంది. దీన్ని భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి హరీష్ పర్వతనేని తిప్పికొట్టారు.
ఇది కూడా చదవండి: Nitish Kumar Video: వైద్యురాలి హిజాబ్ను తొలగించిన నితీష్కుమార్.. విపక్షాలు ఆగ్రహం
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగం అని.. విడదీయరాని భాగం అని మరోసారి స్పష్టం చేశారు. ‘‘అవి ఉన్నాయి… ఉంటాయి.. ఎల్లప్పుడూ ఉంటాయి.’’ అని స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టారని.. అసిమ్ మునీర్ను మాత్రం అందలం ఎక్కించారని.. జీవితాంతం రోరనిరోధక శక్తిగా పెంచిపోషిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Trump: శాంతి దిశగా రష్యా-ఉక్రెయిన్ అడుగులు.. త్వరలోనే మంచి వార్త వింటారన్న ట్రంప్
సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం ఎందుకు రద్దు చేసిందో వివరిస్తూ … పాకిస్థాన్ ఉగ్రవాదానికి ప్రపంచ కేంద్రంగా మారిందని అభివర్ణించారు. 65 సంవత్సరాల క్రితం భారతదేశం మంచి విశ్వాసంతో, మంచి సంకల్పం, స్నేహ స్ఫూర్తితో సింధు జలాల ఒప్పందంలోకి ప్రవేశించిందన్నారు. కానీ ఈ ఆరున్నర దశాబ్దాల్లో భారతదేశంపై పాకిస్థాన్ మూడు యుద్ధాలు, వేలాది ఉగ్రవాద దాడులను ప్రేరేపించి ఒప్పందం యొక్క స్ఫూర్తిని ఉల్లంఘించిందని పర్వతనేని ధ్వజమెత్తారు. గత నాలుగు దశాబ్దాల్లో పాకిస్థాన్ స్పాన్సర్ చేసిన ఉగ్ర దాడులతో 10 వేల మంది భారతీయులు చనిపోయారని.. గత ఏప్రిల్లో పహల్గామ్ ఉగ్ర దాడిలో ఒక విదేశీయుడు సహా 26 మంది చనిపోయారని గుర్తుచేశారు. అందుకే సింధు జలాలు ఒప్పందాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ముగించేంత వరకు సింధు జలాల ఒప్పందం నిలిపివేస్తామని స్పష్టం చేశారు.
అంతకముందు పాకిస్థాన్ ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ మాట్లాడుతూ.. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని విమర్శించాడు. జమ్మూ కాశ్మీర్లో పరిష్కరించబడని వివాదం ఉందంటూ వ్యాఖ్యానించాడు. దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వాన్ని పాకిస్థాన్ కోరుకుంటుందని.. కానీ శాంతి ఏకపక్షంగా సాధించకూడదని జమ్మూ కాశ్మీర్ను ప్రస్తావిస్తూ అహ్మద్ అన్నాడు. సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం ఏకపక్షంగా నిలిపివేయడాన్ని అంతర్జాతీయ బాధ్యతలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని తెలిపాడు. పాకిస్థాన్ విమర్శలను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది.
PR @AmbHarishP delivered 🇮🇳’s statement at the Open Debate on ‘Leadership for Peace’ in the @UN Security Council.
Please watch.
Full statement here- https://t.co/8GWDDqz4JW @MEAIndia @IndianDiplomacy pic.twitter.com/PpWG2Q1kaU
— India at UN, NY (@IndiaUNNewYork) December 15, 2025
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!