Israel-Hezbollah: లెబనాన్ను ఖాళీ చేసి వెళ్లిపోండి.. ఇజ్రాయెల్ హెచ్చరిక
- హెజ్బొల్లా గ్రూప్ను నిర్వీర్యం చేసేందుకు సిద్ధమైన ఇజ్రాయెల్..
- సరిహద్దు ప్రాంతాల్లోని లెబనాన్ పౌరులు తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోండి..
- సరిహద్దు నుంచి 60 కి.మీ దూరంలోని పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి: ఇజ్రాయెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hezbollah: హెజ్బొల్లా గ్రూప్ ను నిర్వీర్యం చేసేందుకు ఇజ్రాయెల్ రెడీ అయింది. అందులో భాగంగానే లెబనాన్లో ఆ గ్రూప్పై వరుస దాడులతో ఇజ్రాయెల్ ఐడీఎఫ్ విరుచుకుపడుతుంది. భూతల దాడులు చేసేందుకు ఇప్పటికే ఇజ్రాయెల్ సేనలు ఆ దేశంలోకి ప్రవేశించాయి. ఈ తరుణంలో సరిహద్దు ప్రాంతాల్లోని లెబనాన్ పౌరులు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది ఇజ్రాయెల్ ఆర్మీ. దీనికి సంబంధించిన ప్రకటనను ఆ దేశ సైన్యం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది.
Read Also: Kakani Govardhan Reddy: తిరుపతి లడ్డూ వివాదంపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
Also Read
- Turkey-Netanyahu: నెతన్యాహును టార్గెట్ చేసిన టర్కీ.. ఇంటర్పోల్కు కీలక అభ్యర్థన
- India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
- Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
- Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
కాగా, సరిహద్దు నుంచి 60 కిలో మీటర్ల దూరంలో ఉంటున్న పౌరులంతా తమ ఇళ్లను ఖాళీ చేయాలని అందులో ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. 2006లో ఇజ్రాయెల్- హెజ్బొల్లా యుద్ధం తర్వాత రెండింటి మధ్య ఐక్యరాజ్య సమితికొంత ప్రాంతాన్ని బఫర్ జోన్గా ప్రకటించింది. దాని ఉత్తర భాగంలో లిటానీ నది ఉంది.. సరిహద్దు నుంచి అక్కడి వరకు 30 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఖాళీ చేయమన్న ప్రాంతం దానిని మించి ఉంది అన్నమాట.
Read Also: SEBI: మరింత ఈజీగా పాసివ్ ఫండ్స్.. రూల్స్ సులభతరం చేసిన సెబీ
అలాగే, ఇజ్రాయెల్ భూతల దాడుల గురించి ప్రకటన చేసిన తర్వాత తొలిసారి హెజ్బొల్లా రియాక్ట్ అయింది. ఆ గ్రూప్ ప్రతినిధి మహమ్మద్ ఆఫిఫి మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ బలగాలు లెబనాన్లోకి ప్రవేశించాయనేది అవాస్తవం.. శత్రువులతో నేరుగా పోరాడేందుకు తమ ఫైటర్స్ రెడీగా ఉన్నారని చెప్పారు. ఇజ్రాయెల్ వైపు మధ్యశ్రేణి క్షిపణులు ప్రయోగించాం.. అది ప్రారంభం మాత్రమే అని హెజ్బొల్లా హెచ్చరించింది.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!