Israel Strikes: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు.. 24కు చేరిన మృతుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Strikes: రాకెట్ల దాడితో ప్రతీకారం తీర్చుకున్న పాలస్తీనా ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ బాంబు దాడులను విస్తరించడంతో గాజాలో వాతావరణం హింసాత్మకంగా మారింది. పాలస్తీనా ఉద్యమం ఇస్లామిక్ జిహాద్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ బ్రేకింగ్ డాన్ కింద గాజా స్ట్రిప్ను లక్ష్యంగా చేసుకున్న వైమానిక దాడుల కారణంగా 24 మంది మరణించగా.. మరో 203 మంది గాయపడ్డారు. “గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల ఫలితంగా, ఆరుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు సహా 24 మంది మరణించారు.203 మంది గాయపడ్డారు” అని పాలస్తీనా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
శుక్రవారం, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ గాజా స్ట్రిప్లో ఇస్లామిక్ జిహాద్ ఉద్యమానికి వ్యతిరేకంగా బ్రేకింగ్ డాన్ ఆపరేషన్ను ప్రారంభించింది. దీంతోపాటు క్షిపణి దాడులను చేపట్టింది. ప్రారంభంలో 10 మంది మరణించగా.. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. వైమానిక దాడుల తరువాత, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ నాయకుడు జియాద్ నఖలా.. టెల్ అవీవ్పై క్షిపణి దాడి చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంటానని బెదిరించాడు. ఇజ్రాయెల్ అత్యవసర పరిస్థితిని ప్రవేశపెట్టింది. గాజా స్ట్రిప్పై కొత్త దాడులను కొనసాగిస్తూనే క్షిపణి దాడులను తిప్పికొట్టింది.
Also Read
- POK Protest: అసిమ్ మునీర్ ఒక టెర్రరిస్ట్.. పీఓకేలో తిరుగుబాటు..
- POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
- POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
Lightning Strike: చమురు నిల్వ కేంద్రంలో పిడుగు.. 80 మందికి గాయాలు, 17మంది మిస్సింగ్
పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ గ్రూపు ఇచ్చిన బెదిరింపుల నేపథ్యంలో ఇజ్రాయిల్ దాడులు చేసినట్లు ప్రధాని యాయిర్ లాపిద్ తెలిపారు. తొలుత ఇజ్రాయిల్పై పీఐజే సుమారు వంద రాకెట్లను ప్రయోగించింది. అయితే ఇజ్రాయిల్కు చెందిన ఐరన్ డోమ్ ఆ క్షిపణులను అడ్డుకుంది. ఇజ్రాయిల్లోని అనేక పట్టణాల్లో సైరన్లు మోగాయి.పాలస్తీనా మిలిటెంట్ల దాడులకు ప్రతీకారంగా.. ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) శుక్రవారం దాడుల్ని ప్రారంభించింది. వివిధ మిలిటెంట్ల స్థావరాలను టార్గెట్ చేశారు. పీఐజేతో లింకు ఉన్న సైట్లను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.గాజా సిటీలో ఉన్న బహుళ అంతస్తుల పాలస్తీనా టవర్ను కూడా పేల్చేశారు. గాజాలో రోజువారీ జీవితం నిలిచిపోయింది. అయితే ఇజ్రాయెల్ సరిహద్దు క్రాసింగ్లను మూసివేసిన తర్వాత ఇంధన కొరత కారణంగా ఏకైక పవర్ స్టేషన్ మూసివేయబడిందని విద్యుత్ పంపిణీదారు తెలిపారు. రాబోయే కొన్ని గంటలు చాలా కష్టతరంగా మారనున్నాయని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విద్యుత్ కొరత ఫలితంగా 72 గంటల్లో కీలక సేవలను నిలిపివేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది
తాజావార్తలు
-
POK Protest: అసిమ్ మునీర్ ఒక టెర్రరిస్ట్.. పీఓకేలో తిరుగుబాటు..
-
Spicy Idli Chaat Recipe: మిగిలిన ఇడ్లీలతో సూపర్ స్పైసీ చాట్.. 5 నిమిషాల్లో రెడీ..!
-
Akash Goparaju: కోనసీమ బ్యాక్డ్రాప్లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’
-
Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్గా ప్రకటించిన డైరెక్టర్!
-
India Job Crisis: ఇంజనీరింగ్ చేసి స్వీపర్ పోస్టులకు అప్లై చేస్తున్నారు.. ఇక డిగ్రీలు దండగేనా?
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!