Israel: భారతీయులకు కలిసి వస్తున్న ఇజ్రాయిల్-గాజా యుద్ధం.. లక్ష మందికి పని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి చొరబడి 1400 మందిని దారుణంగా ఊచకోత కోశారు. మరో 200 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి గాజాస్ట్రిప్ పై ఇజ్రాయిల్ సైన్యం భీకరంగా దాడులు చేస్తోంది. వైమానిక దాడులతో పాటు భూతల దాడులు చేస్తోంది. ఇప్పటికే గాజాను పూర్తిగా దిగ్బంధించింది. మరోవైపు ఇజ్రాయిల్ లో ఉన్న పాలస్తీనియన్లను పంపించేంది.
Read Also: Uttar Pradesh: పెళ్లికి నిరాకరించిన వితంతువు.. నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం..
Also Read
- Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
- Trump Marine One: ట్రంప్కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
- Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
- Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భారతీయులకు కలిసి వస్తోంది. ముఖ్యంగా పాలస్తీనియన్లను పూర్తిగా ఇజ్రాయిల్ నుంచి పంపించేయడంతో కార్మికుల కొరత ఏర్పడింది. ప్రస్తుతం ఏర్పడిన కార్మికులు, ఉద్యోగాలను భారతీయులతో భర్తీ చేయాలని ఇజ్రాయిల్ భావిస్తోంది. వాయిస్ ఆఫ్ అమెరికా నివేదిక ప్రకారం.. 90,000 మంది పాలస్తీనియన్ల స్థానంలో లక్ష మంది భారతీయ కార్మికునలు నియమించుకోవడానికి అనుమతించాలని పలు ఇజ్రాయిల్ నిర్మాణ కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ విషయంలో తాము భారత్ తో చర్యలు జరుపుతున్నామని, తదుపరి ఆమోదం కోసం ఇజ్రాయిల్ అధికారుల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని ఇజ్రాయిల్ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. దేశంలో పనిచేయడానికి, సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇండియా నుంచి 50,000 నుంచి లక్ష మంది కార్మికులు అవసరం అవుతారని అంచనా వేస్తున్నారు. పాలస్తీనా కార్మికులు వెళ్లడంతో ముఖ్యంగా నిర్మాణ రంగం తీవ్రంగా ప్రభావితమైంది.
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధానికి నెల రోజులు పూర్తయ్యాయి. హమాస్ని పూర్తిగా నేలమట్టం చేసేదాకా తాము విశ్రమించబోమని ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ ప్రకటించారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ అమెరికాతో పాటు ఏ దేశం చెప్పిన వినే పరిస్థితిలో లేదు. గాజా స్ట్రిప్, ముఖ్యంగా ఉత్తర గాజాలోని హమాస్ స్థావరాలను నెలమట్టం చేస్తోంది. ఇప్పటికే గాజాలో కీలకంగా ఉన్న హమాస్ ఉగ్రవాదుల్లో చాలా మందిని చంపేసింది. ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 10 వేల మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు.
తాజావార్తలు
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
-
Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు… రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
-
India Post Recruitment 2026: 10th పాసయ్యారా?.. ఇండియా పోస్ట్లో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. మంచి జీతం
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!