Israel-Lebanon: శాంతి ఒప్పందానికి తూట్లు.. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు
- పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు
- శాంతి ఒప్పందానికి తూట్లు
- లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు
- ఏడుగురు లెబనీయులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్-హిజ్బుల్లా శాంతి ఒప్పందం జరిగినట్లుగా అంతర్జాతీయంగా వార్తలు వచ్చాయి. అమెరికాకు చెందిన ఒక సీనియర్ అధికారి కూడా ధృవీకరించారు. కానీ ఇంతలోనే ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. హిజ్బుల్లా లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. శుక్రవారం రాత్రి హిజ్బుల్లా తమ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నందుకే తాము దాడులు చేసినట్లుగా ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే లెబనాన్-ఇజ్రాయెల్ దాడులు తీవ్ర కావడంతో అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న శాంతి ఒప్పందానికి ఇక్కట్లు వచ్చి పడ్డాయి. హార్ముజ్ జలసంధిని మూసేసినట్లుగా అధికారికంగా ఇరాన్ ప్రకటించింది. దీంతో మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మరోసారి మధ్యప్రాచ్యం దాడులతో టెన్షన్ వాతావరణం నెలకొనేటట్టు కనిపిస్తోంది.
Also Read
- Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
- China: మళ్లీ కరోనా కలకలం.. చైనాలో 79 వేల కొత్త కేసులు.. భారత్కు డేంజరేనా?
- Trump: ఇరాన్ దగ్గర ఎప్పటికీ అణ్వాయుధం ఉండదు.. నెతన్యాహుతో భేటీకి ముందు ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Trump-Netanyahu: ట్రంప్-నెతన్యాహు విభేదాలు.. దేనికోసమంటే..!
తొలుత హిజ్బుల్లాతో ఒప్పందం కుదిరిందన్న వార్త వెలువడిన 24 గంటలలోపే.. ఇజ్రాయెల్ మరోసారి లెబనాన్లోని పలు ప్రాంతాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇద్దరు చిన్నారులతో సహా ఏడుగురు మరణించినట్లు సమాచారం. ఇజ్రాయెల్ చేపట్టిన ఈ చర్య ఇప్పుడు ఇరాన్-అమెరికాల మధ్య ఉన్న శాంతి ఒప్పందానికి ముప్పుగా పరిణమించింది . లెబనాన్ జాతీయ వార్తా సంస్థ ప్రకారం.. ఈ దాడులు దక్షిణ నగరమైన నబాటియే… దాని చుట్టుపక్కల గ్రామాలపై ప్రభావం చూపాయి. శిథిలాల కింద కనీసం ఏడుగురు పూడిపోయారు.
హిజ్బుల్లా ప్రకటన
ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటే.. తాము కూడా అలాగే చేస్తామని హిజ్బుల్లా తెలిపింది. కానీ వాస్తవానికి ఎలాంటి కాల్పుల విరమణ అమలు జరిగిందని మాత్రం చెప్పలేదు. ఇదిలా ఉండగా శుక్రవారం కాల్పుల విరమణ ఒప్పందం గురించిన వార్తలు వెలువడిన తర్వాత ఇజ్రాయెల్-హిజ్బుల్లా కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడానికి ఖతార్, యునైటెడ్ స్టేట్స్, ఇరాన్ ప్రయత్నిస్తున్నాయని ఒక హిజ్బుల్లా అధికారి చెప్పారు. కానీ ఒప్పందం కుదిరిందని మాత్రం ధృవీకరించలేదు.
తాజావార్తలు
-
రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
-
AK47: వెంకీ కూతురిగా యువినా.. ‘AK47’ నుంచి మరో ఫన్ క్యారెక్టర్ రివీల్
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Kasturba Girls School: విద్యార్థినులతో మసాజ్ చేయించుకున్న టీచర్.. వైరల్ ఫోటోలతో కలకలం.. విచారణకు ఆదేశాలు!
-
Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఇక లైవ్ స్ట్రీమింగ్లో ఆ మాటలు వినిపించవు
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?