Israel-Lebanon: శాంతి ఒప్పందానికి తూట్లు.. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు
- పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు
- శాంతి ఒప్పందానికి తూట్లు
- లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు
- ఏడుగురు లెబనీయులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్-హిజ్బుల్లా శాంతి ఒప్పందం జరిగినట్లుగా అంతర్జాతీయంగా వార్తలు వచ్చాయి. అమెరికాకు చెందిన ఒక సీనియర్ అధికారి కూడా ధృవీకరించారు. కానీ ఇంతలోనే ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. హిజ్బుల్లా లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. శుక్రవారం రాత్రి హిజ్బుల్లా తమ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నందుకే తాము దాడులు చేసినట్లుగా ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే లెబనాన్-ఇజ్రాయెల్ దాడులు తీవ్ర కావడంతో అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న శాంతి ఒప్పందానికి ఇక్కట్లు వచ్చి పడ్డాయి. హార్ముజ్ జలసంధిని మూసేసినట్లుగా అధికారికంగా ఇరాన్ ప్రకటించింది. దీంతో మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మరోసారి మధ్యప్రాచ్యం దాడులతో టెన్షన్ వాతావరణం నెలకొనేటట్టు కనిపిస్తోంది.
Also Read
- Pakistan Cargo Plane Missing: ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న పాకిస్తానీ కార్గో విమానం.. అరేబియా సముద్రంపై గల్లంతు
- Crude Oil: ఇరాన్పై అమెరికా వార్.. చమురు ధరలు క్రాష్! భారత్లో లీటర్ పెట్రోల్ రేట్ ఎంతంటే?
- US Airstrikes on Iran: ఆపండ్రోయ్.. ఖేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్పై అమెరికా బాంబులు, పేలుళ్లతో వణికిన ఇరాన్
- Hormuz Tank Attacks: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం.. 24 గంటల్లో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు!
తొలుత హిజ్బుల్లాతో ఒప్పందం కుదిరిందన్న వార్త వెలువడిన 24 గంటలలోపే.. ఇజ్రాయెల్ మరోసారి లెబనాన్లోని పలు ప్రాంతాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇద్దరు చిన్నారులతో సహా ఏడుగురు మరణించినట్లు సమాచారం. ఇజ్రాయెల్ చేపట్టిన ఈ చర్య ఇప్పుడు ఇరాన్-అమెరికాల మధ్య ఉన్న శాంతి ఒప్పందానికి ముప్పుగా పరిణమించింది . లెబనాన్ జాతీయ వార్తా సంస్థ ప్రకారం.. ఈ దాడులు దక్షిణ నగరమైన నబాటియే… దాని చుట్టుపక్కల గ్రామాలపై ప్రభావం చూపాయి. శిథిలాల కింద కనీసం ఏడుగురు పూడిపోయారు.
హిజ్బుల్లా ప్రకటన
ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటే.. తాము కూడా అలాగే చేస్తామని హిజ్బుల్లా తెలిపింది. కానీ వాస్తవానికి ఎలాంటి కాల్పుల విరమణ అమలు జరిగిందని మాత్రం చెప్పలేదు. ఇదిలా ఉండగా శుక్రవారం కాల్పుల విరమణ ఒప్పందం గురించిన వార్తలు వెలువడిన తర్వాత ఇజ్రాయెల్-హిజ్బుల్లా కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడానికి ఖతార్, యునైటెడ్ స్టేట్స్, ఇరాన్ ప్రయత్నిస్తున్నాయని ఒక హిజ్బుల్లా అధికారి చెప్పారు. కానీ ఒప్పందం కుదిరిందని మాత్రం ధృవీకరించలేదు.
తాజావార్తలు
-
Faiza Ali: భర్త ఉన్నాక మరో హీరో చేతుల్లో ఊగలేను.. నటి ఫైజా అలీ ఓపెన్ కామెంట్స్
-
Amarnath Yatra: అమర్నాథ్ యాత్రికులకు షాకింగ్ న్యూస్.. 5 రోజుల్లోనే! అసలు ఏం జరిగింది?
-
Minister Narayana: అమరావతి వర్సెస్ మావిగన్.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
-
Gautam Gambhir: ‘వీ వాంట్ సంజూ’.. కోచ్ కీలక వ్యాఖ్యలు.!
-
Dada FirstLook : సౌరవ్ గంగూలీ బయోపిక్ ‘దాదా’ ఫస్ట్ లుక్ రిలీజ్
ట్రెండింగ్
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!