FIFA: అమెరికా చేతిలో ఓటమిని.. సెలబ్రేట్ చేసుకున్న వ్యక్తిని చంపిన ఇరాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iranian Killed For Celebrating FIFA World Cup Loss to United States: ఖతార్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ జరుగుతోంది. ఇటీవల అమెరికా చేతిలో ఇరాన్ ఓడిపోవడంతో అక్కడి ప్రజలు దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. సాధారణంగా తమ దేశం గెలిస్తే సంబరాలు చేసుకునే ప్రజలు, ఓడిపోయినందుకు సంబరాలు చేసుకున్నారు. మహ్సఅమిని పోలీస్ కస్టడీలో చనిపోవడంతో ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి. ఈ క్రమంలో దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న సమయంలో ఇరాన్ జట్టు ఫిఫాలో మ్యాచులు ఆడేందుకు వెళ్లడంపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోవడంతోనే ఇరాన్ ఓటమిని సెలబ్రేట్ చేసుకున్నారు ఇరాన్ ప్రజలు.
Read Also: Virat Kohli: విరాట్ కోహ్లీ సిక్స్పై పెదవి విప్పిన పాక్ బౌలర్ హారీస్ రౌఫ్..
Also Read
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
- Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
మంగళవారం రాత్రి ఖతార్లో జరిగిన ప్రపంచ కప్లో ఇరాన్ను యునైటెడ్ స్టేట్స్ ఓడించింది. ఇదిలా ఉంటే ఈ ఓటమిని సెలబ్రేట్ చేసుకుంటున్న ఓ వ్యక్తిని ఇరాన్ భద్రతా బలగాలు కాల్చి చంపాయని హక్కుల సంఘాలు బుధవారం తెలిపాయి. టెహ్రాన్కు వాయువ్యంగా కాస్పియన్ సముద్ర తీరంలో ఉన్న బందర్ అంజాలి అనే నగరంలో మెహ్రాన్ సమక్ (27) కాల్చిచంపినట్లు ఓస్లోలోని ఇరాన్ హ్యూమన్ రైట్స్ గ్రూప్ వెల్లడించింది. తలపై కాల్చి సమక్ ను చంపినట్లు తెలిపింది. హిజాబ్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటున్న నిరసనకారులు ఈ ఓటమిపై సంబరాలు చేసుకున్నారు. ఈ నిరసనలను అణచివేసే ప్రయత్నం చేస్తోంది ఇరాన్.
గత రెండు నెలలుగా ఇరాన్ వ్యాప్తంగా యాంటీ హిజాబ్ నిరసనలు జరుగుతున్నాయి. 22 ఏళ్ల మహ్సా అమిని అనే యువతిని అక్కడి మోరాలిటీ పోలీసులు హిజాబ్ ధరించలేదని అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆ యువతి చనిపోవడంతో అక్కడ ఉద్యమం ప్రారంభం అయింది. యువత, మహిళలు ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. మహిళలు హిజాబ్ విసిరేస్తూ, జట్టు కత్తిరించుకుని నిరసన తెలుపుతున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పటి వరకు ఇరాన్ వ్యాప్తంగా యాంటీ హిజాబ్ అల్లర్లలో 448 మంది చనిపోయారు.
తాజావార్తలు
-
Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
-
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
-
Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
-
El Nino : ఎల్నీనో ఎఫెక్ట్.. తెలంగాణలో డ్రౌట్ అలర్ట్.!
-
Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!