Iran: ప్రాణం మీదికి తెచ్చిన హిజాబ్.. మరో యువతికి మహ్సా అమిని పరిస్థితి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: ఇరాన్ దేశం పూర్తిగా మతాచారాలపై ఆధారపడిన రాజ్యం. అక్కడ అందరు విధిగా మత చట్టాను పాటించాల్సిందే. ముఖ్యంగా మహిళ హిజాబ్ అంశంపై అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. గతేడాది హిజాబ్ సరిగా ధరించలేదని చెబుతూ.. కుర్దిష్ మహిళ మహ్సా అమినిని ఇరాన్ మొరాలిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె మరణించింది. అమిని మరణం ఇరాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హిజాబ్ వ్యతిరేక ఉద్యమానికి నాంది పలికింది.
ఇదిలా ఉంటే తాజాగా మరో మహిళ మహ్సా అమిని లాగే చావుకు దగ్గరైంది. హిజాబ్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు మత అధికారులు దాడులు చేయడంతో మరో టీజేజర్ బ్రెయిన్ డెడ్ అయినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆదివారం నివేదించింది. 16 ఏళ్ల అర్మితా గెరావాండ్ను హిజాబ్ ధరించనునందుకు అధికారులు కొట్టారు. దీంతో ఆమె కోమాలోకి వెళ్లింది, ప్రస్తుతం బ్రెయిన్ డెడ్ అయింది.
Also Read
- Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
- US-Iran War: 'ట్రంప్ను చంపేస్తాం'.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
- Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
చివరిసారిగా గెరావాండ్ ఆస్పత్రిలో చేరడాన్ని కుర్దిష్-ఇరానియన్ హెంగావ్ వంటి హక్కుల సంఘాలు మొదటిసారిగా వెలుగులోకి తీసుకువచ్చాయి. 16 ఏళ్ల బాలిక ఫోటోను సోషల్ మీడియాలో పెట్టారు. ఆ సమయంలో ఆమె లైఫ్ సపోర్టుతో, తలకు కట్టుతో కనిపించింది. గెరావండ్ ఆరోగ్యంపై వైద్య సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆమె బ్రెయిన్ డెడ్ కావడం ఖాయమని తెలుస్తోందని ఆ దేశ మీడియా తెలిపింది.
Read Also: Shubhman Gill: 12 ఏళ్ల నాటి వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన టీమిండియా యువ ఓపెనర్
గతేడాది మహ్స అమిని ఎదుర్కొన్న విధినే తాజాగా గెరావాండ్ ఎదుర్కొంటుందని అక్కడి హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజా ఘటన ఇరాన్ లోని మతాధికార పాలకులకు సవాల్ గా నిలువబోతోంది. అక్టోబర్ 1న టెహ్రాన్ మెట్రోలో ఇస్లామిక్ డ్రెస్ కోడ్ అమలు పరుస్తున్న సమయంలో గెరావండ్ గాయపడ్డారు. అయితే దీనిని ఇరాన్ ఖండిస్తోంది.
1979 తర్వాత ఇరాన్ లో మతపాలన ప్రారంభమైంది. అప్పటి నుంచి మహిళలపై ఆంక్షలు, కఠినమైన డ్రెస్ కోడ్ ను అమలు చేస్తున్నారు. పాటించని వారికి మందలింపులు, జరిమానాలు విధిస్తున్నారు. గతేడాది మహ్సా అమిని మరణం తర్వాత ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తునలేసింది. ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం అణిచివేసింది. ఈ ఆందోళనల్లో 500 మందికి పైగా చనిపోయారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!