Iran-US: మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధం మొదలు కాబోతుందా? ఇరాన్ సైన్యం హై అలర్ట్!
- పశ్చిమాసియాలో మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు!
- అమెరికా, ఇజ్రాయెల్తో మళ్లీ ఘర్షణ!
- కొత్త సవాళ్లను ఎదుర్కొంటామన్న ఇరాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలు కాబోతుందా? మధ్యప్రాచ్యం బాంబు దాడులతో దద్దరిల్లనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్తో మళ్లీ ఘర్షణ మొదలయ్యే అవకాశముందని ఇరాన్ హెచ్చరించింది. దేశ సాయుధ దళాలు కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది.
ఇరాన్కు చెందిన సర్దార్ మహమ్మద్ జాఫర్ అసది (ఖాతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్క్వార్టర్స్ ఉప పరిశీలకుడు) మాట్లాడుతూ.. ఒప్పందాలను అమెరికా పాటించడం లేదని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఫార్స్ వార్తా సంస్థ (Fars News Agency) ప్రచురించింది. ‘‘అమెరికా అధికారుల ప్రకటనలు, చర్యలు చూస్తే ఒప్పందాల పట్ల కట్టుబాటు కనిపించడం లేదు. ఇవన్నీ ప్రధానంగా మీడియా కోసం చేస్తున్న ప్రకటనలే. చమురు ధరలు పడిపోకుండా చూడడం, తాము సృష్టించిన సమస్యల నుంచి బయటపడటమే వారి లక్ష్యం.’’ అని విమర్శించారు. ఇరాన్ సైన్యం అవసరమైతే మరింత తీవ్ర చర్యలకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు.
Also Read
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
- Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
- Elon Musk: మస్క్కు చైనా గూఢచారుల విందు?.. ట్రంప్ చైనా పర్యటనపై కొత్త వివాదం
మరోవైపు సీఎన్ఎన్ నిర్వహించిన విచారణలో గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలకు భారీ నష్టం జరిగినట్లు వెల్లడైంది. కువైట్లోని క్యాంప్ బ్యూరింగ్ దగ్గర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని… స్థావరంలోని కొన్ని భాగాలు పనికిరాకుండా పోయాయని నివేదిక పేర్కొంది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు.. గల్ఫ్, పరిసర ప్రాంతాల్లోని కనీసం 8 దేశాల్లో ఉన్న 16 అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. పశ్చిమాసియాలో అమెరికా సైనిక వ్యవస్థపై దీని ప్రభావం గణనీయంగా ఉందని నివేదికలో పేర్కొంది.
ఇదిలా ఉండగా.. ఆర్థికంగా కూడా ఇరాన్పై ఒత్తిడి పెరుగుతోంది. ఆక్సియోస్ నివేదిక ప్రకారం.. అమెరికా చర్యల కారణంగా హార్ముజ్ జలసంధి, ఒమన్ గల్ఫ్ ప్రాంతాల్లో చమురు రవాణాకు అంతరాయం కలిగి… ఇరాన్ దాదాపు 4.8 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయిందని అంచనా వేసింది. ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాలలో ఒకటైన హార్ముజ్ పరిసరాల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతుండగా.. సరుకు రవాణాపై ప్రభావం పడుతోంది.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?