Iran Supreme Leader: యహ్యా సిన్వార్ లేకపోయినా హమాస్ ఉనికికి ఢోకా లేదు..
- సిన్వార్ను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చడంపై స్పందించిన ఇరాన్ సుప్రీం లీడర్..
- యహ్యా సిన్వార్ అమరుడు కావడంతో అంతా అయిపోయినట్లు కాదు..
- ఇజ్రాయెల్ దాడిలో సిన్వార్ చనిపోయినా హమాస్ ఇంకా ఉనికిలోనే ఉంది: అయతుల్లా అలీ ఖమేనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Supreme Leader: హమాస్ మిలిటెంట్ సంస్థ చీఫ్ యాహ్యా సిన్వార్ను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చడంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేశారు.. అందులో సిన్వార్ మృతి బాధ కలిగిస్తోంది.. అయినప్పటికీ అతడు అమరుడు కావడంతో అంతా అయిపోయినట్లు కాదన్నారు. ఇజ్రాయెల్ దాడిలో అతడు చనిపోయినా హమాస్ ఇంకా ఉనికిలోనే ఉంది.. ఎప్పటికీ ఉంటుందని వెల్లడించారు. శత్రువులు తమపై విపరీత దాడులకు పాల్పడుతున్నప్పటికి.. సిన్వార్ వారికి ఎదురు నిలబడ్డారని చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ వ్యూహాలకు దీటుగా ఆయన సమాధానం ఇచ్చారని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వెల్లడించారు.
Read Also: PCOS: స్త్రీల మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేసే ఈ వ్యాధితో డేంజరే
Also Read
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
ఇక, 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్పై జరిపిన దాడులకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించి సిన్వార్ దెబ్బ కొట్టిన తీరును ప్రపంచం ఎప్పటికీ మరిచిపోదని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తెలిపారు. ఇజ్రాయెల్- హెజ్బొల్లాల మధ్య జరుగుతున్న యుద్ధంలో హమాస్ చీఫ్ హసన్ నస్రల్లా చనిపోయిన తర్వాత లెబనాన్లోకి తన బలగాలను పంపేందుకు ఇరాన్ రెడీగా ఉందని ఆ దేశ ఉన్నతస్థాయి అధికారులు తెలిపారు.
Read Also: Bandi Sanjay: రేవంత్ తో మాకు దోస్తీ అవసరమేంది..? కేటీఆర్ ట్వీట్ పై బండి సంజయ్ ఆగ్రహం..
అయితే, ఇటీవల ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రత్యక్ష దాడి చేసింది. దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులతో ప్రయోగించగా.. ఆ తర్వాత దీనిపై అయతుల్లా అలీ ఖమేనీ స్పందిస్తూ హమాస్ అప్పటి అధినేత ఇస్మాయెల్ హనియా, హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా, నిల్పోరూషన్ చావులకు ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు వెల్లడించారు. అయితే, ఇరాన్ తమపై చేసిన క్షిపణుల దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఇజ్రాయెల్ తెలిపింది. అదే జరిగితే తమ స్పందన మరింత తీవ్రంగా ఉంటుందని ఖమేనీ హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతల మధ్య ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం.
I congratulate the family of Yahya #alSinwar, his comrades, and all those devoted to jihad on the path of God on the martyrdom of our brother, Yahya al-Sinwar, and I offer my condolences for this loss.
— Khamenei.ir (@khamenei_ir) October 19, 2024
తాజావార్తలు
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!