Bandi Sanjay: రేవంత్ తో మాకు దోస్తీ అవసరమేంది..? కేటీఆర్ ట్వీట్ పై బండి సంజయ్ ఆగ్రహం..
- కాంగ్రెస్ తో దోస్తీ చేసేది మీ అయ్యే..
- చీకట్లో ఢిల్లీ పెద్దలను కలిసి డబ్బు సంచులు అప్పగించింది మీ అయ్యే..
- ఇతర రాష్ట్రాల ఎన్నికలకు డబ్బు మూటలు పంపింది కేసీఆరే..
- మీకు దోస్తీ లేకుంటే ఆ కేసులు సీబీఐకి అప్పగించమనండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. నాకు రేవంత్ రెడ్డితో దోస్తానా ఉంటే మీ ప్రభుత్వం పడిపోయే ప్రమాదముందని ఇట్ల మీడియా ముందు మాట్లాడతమా? అని ప్రశ్నించారు. నేనే కాదు… ఎవరితోనైనా దోస్తానా? ఉంటే ఫోన్ లో మాట్లాడుకుంటరే తప్ప మీడియాతో మాట్లాడరు కదా అని అన్నారు. అంతెందుకు మీ అయ్యకు కాంగ్రెస్ పెద్దలతో దోస్తానా ఉంది కాబట్టే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసుల్లో అరెస్ట్ కాకుండా తప్పించుకునేందుకే చీకట్లో ఢిల్లీకి పోయి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని డబ్బు సంచులు ఇచ్చి వచ్చింది వాస్తవం కాదా? అన్నారు.
ఆ కేసులు విచారణకు రాకుండా ఢిల్లీ పెద్దల మందు సాగిలపడ్డది నిజం కాదా?’’ అంటూ కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ ను కాపాడేందుకు బండి సంజయ్ తాపత్రయపడుతున్నారంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ కు తీవ్రస్థాయిలో ఘాటుగా బదులిచ్చారు. మీరు పదేళ్లు అధికారంలో ఉన్నరు కదా.. రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసు ఉన్నది కదా? ఎందుకు తేల్చలేకపోయారు? ఎందుకు ఆ కేసును నీరుగార్చారు? రేవంత్ తో దోస్తానా ఉన్నది మీకా? మాకా? అన్నారు.
Read also: Tummala Nageswara Rao: వారికి రైతు భరోసా ఇవ్వలేము.. తుమ్మల సంచలన వ్యాఖ్యలు
Also Read
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
కేటీఆర్ అహంకారంవల్లే బీఆర్ఎస్ పార్టీకి ఇయాళ ఈ గతి పట్టిందన్నారు. అయినా కేటీఆర్ కు అహంకారం తగ్గలే అని కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగే పరిస్తితి కూడా లేదన్నారు. ఆయన బాధ భరించలేకే వాళ్ల అయ్య కేసీఆర్ ఫాంహౌజ్ కే పరిమితమై పండుకున్నడు. కేటీఆర్ వల్ల ఆ పార్టీ పూర్తిగా సర్వనాశనమవడం ఖాయమన్నారు. కేటీఆర్… ఏదో ఒక పేపర్ చూసి మొరుగుడు కాదు… నిరుద్యోగులను లాఠీఛార్జ్ చేయించింది మీ అయ్యే కదా? అని ప్రశ్నించారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయ, విద్యార్థి వర్గాలను లాఠీలతో కొట్టించింది మీరు కాదా? దానికి ముందు సమాధానం చెప్పు? అయ్యప్ప సొసైటీ విషయంలో పైసలు దండుకుంది మీరు కాదా? మా గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదన్నారు. మూసీలో స్టే చేయడానికి మాకేం పనిలేదా?… కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ పేరుంది. ఆయన చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని వాంగ్మూలం ఇచ్చారు కదా? ఎందుకు చర్యలు తీసుకోలేదు? వాళ్లకు దమ్ముంటే సీబీఐకి కేసు అప్పగించండి… మీ ఇద్దరి మధ్య లాలూచీ లేకుండా సీబీఐకి కేసు అప్పగించాలి. కేసీఆర్… ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో లాలూచీ పడలేదంటే.. మూటలు అప్పగించలేదనుకుంటే దమ్ముంటే సీబీఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు అప్పగించాలని సవాల్ విసిరారు.
MLC Kavitha: నేడు ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..
తాజావార్తలు
-
Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
-
West Bengal repolling: బెంగాల్లో మళ్లీ ఎన్నికల వేడి.. ఫల్తాలో రీ-పోలింగ్ షురూ! అసలు ట్విస్ట్ ఇదే..
-
Manish Pandey: వర్షం వచ్చినా, ఎండ ఉన్నా ఆగం.. కేకేఆర్ హీరో మనీష్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!