Iran-US: అమెరికాకు బిగ్ షాక్.. శాంతి చర్చల వేళ ఇరాన్ ఝలక్.. ఉద్రిక్తతలు తప్పవా?
- అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్
- ఎలాంటి ఒప్పందం చేసుకోవడం లేదని వెల్లడి
- మరోసారి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం జరగొచ్చని ఇప్పటిదాకా వార్తలు వచ్చాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొనవచ్చని.. పరిస్థితులు తిరిగి నార్మల్ స్థితికి రావొచ్చని ప్రపంచ దేశాలు భావించాయి. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.. అందుకు భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలు అన్ని విఫలం కాబోతున్నట్లుగా అంతర్జాతీయంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా అమెరికాతో ఎలాంటి ఒప్పందానికి ఇప్పట్లో సంతకం చేయబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అంతేకాదు.. చర్చలను పూర్తిగా రద్దు చేసే దిశగా కూడా ఆలోచిస్తున్నట్లు ఇరాన్ అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో మరోసారి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తప్పవన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇరాన్ ప్రభుత్వ అనుబంధ టాస్నిమ్ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన సమాచారం ప్రకారం.. అమెరికాతో జరుగుతున్న అణు చర్చల్లో ఎలాంటి అణు రాయితీలు ఇవ్వలేదని, యురేనియం అప్పగింతకు కూడా అంగీకరించలేదని స్పష్టం చేసింది. “అమెరికాతో ఎలాంటి ఒప్పందం చేసుకోవడం లేదు. ఒప్పందం కుదిరే దశలో ఉన్నామని ఎవరూ చెప్పలేరు” అని ఇరాన్ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయ్ కూడా మాట్లాడుతూ.. “చర్చల్లో అనేక అంశాలపై పురోగతి సాధించాం. కానీ త్వరలోనే ఒప్పందం కుదురుతుందని చెప్పడం సరైంది కాదు” అని వ్యాఖ్యానించారు. అమెరికాతో కుదురనున్న ముసాయిదా ఒప్పందంలో ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన ఎలాంటి కొత్త నిబందనలు లేవని తెలిపారు. యురేనియం బదిలీ అంశం ఉందన్న వార్తలను పూర్తిగా అబద్ధంగా కొట్టిపారేశారు.
Also Read
- Explained: యుద్ధంలో ట్రంప్ ఘోర పరాజయం.. ప్రపంచం ముందు నవ్వులపాలైన అమెరికా!
- Hormuz Strait: ప్రపంచానికి ఊపిరి పోసిన అమెరికా-ఇరాన్ ఒప్పందం.. హర్మూజ్ గుండా చమురు రవాణా షురూ..
- Giorgia Meloni: జీ 7 సదస్సుకు కుమార్తెతో హాజరైన మెలోని.. ఫొటోలు వైరల్
- India-Bangladesh: ‘‘ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదు’’.. భారత్కు బంగ్లా ప్రధాని సలహాదారు ఘాటు సందేశం
మరోవైపు ట్రంప్ కూడా ఇటీవల ఇరాన్పై కఠిన వ్యాఖ్యలు చేశారు. “ఇరాన్తో ఒప్పందం కుదిరితే అది సరైన, బలమైన ఒప్పందమే అవుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో చర్చలు ముగియలేదు” అని ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. అలాగే ఒప్పందం కుదిరే వరకు హార్ముజ్లో అమెరికా నౌకాదళ దిగ్బంధం కొనసాగుతుందని హెచ్చరించారు. ఇదే అంశంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కూడా స్పందిస్తూ.. “ఇరాన్ అణు ముప్పును పూర్తిగా తొలగించే విధంగానే తుది ఒప్పందం ఉండాలి” అని ట్రంప్తో ఏకీభవించినట్లు తెలిపారు. ఇక యురేనియం శుద్ధి కార్యక్రమమే ప్రస్తుతం చర్చల్లో ప్రధాన అడ్డంకిగా మారింది. అణ్వాయుధాల తయారీకి అవకాశం లేకుండా ఇరాన్పై కఠిన పరిమితులు విధించాలని అమెరికా, ఇజ్రాయెల్ పట్టుబడుతున్నాయి. అయితే తమ రెడ్ లైన్స్ దాటే ఒప్పందాలకు అంగీకరించబోమని ఇరాన్ స్పష్టం చేస్తోంది.
ఇక హార్ముజ్ జలసంధి అంశం కూడా రెండు దేశాల మధ్య మరో వివాదంగా మారింది. ఆ ప్రాంతంలో నౌకాయాన సేవలకు సంబంధించి ఇరాన్ వసూలు చేస్తున్న రుసుములను అమెరికా వ్యతిరేకిస్తోంది. అయితే పర్యావరణ పరిరక్షణ, నౌకాయాన భద్రత కోసం ఆ రుసుములు అవసరమని ఇరాన్ సమర్థించుకుంది. ఇదిలా ఉండగా.. పాకిస్థాన్, చైనా కూడా ఈ చర్చల్లో మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ బీజింగ్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమయ్యారు. ప్రపంచం కీలక దశలో ఉందని, శాంతి దిశగా చైనా సహకారం కీలకమని షరీఫ్ వ్యాఖ్యానించారు.
అయితే ఇరాన్-అమెరికా చర్చలపై వస్తున్న ప్రతీ వార్తకు అంతర్జాతీయ చమురు మార్కెట్లు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఒప్పందం కుదిరే అవకాశాలపై వచ్చిన వార్తలతో చమురు ధరలు తగ్గినా.. తాజా ఇరాన్ వ్యాఖ్యలతో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలపై ఆందోళనలు మొదలయ్యాయి. ముఖ్యంగా ప్రపంచ ఇంధన రవాణాలో కీలక మార్గమైన హార్ముజ్ జలసంధి చుట్టూ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Pawan Kalyan: అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి ఇంటికే వెళ్లిన పవన్ కళ్యాణ్.. కుటుంబానికి భరోసా!
-
Obsession : ఇండియాలో అబ్సెషన్ కలెక్షన్ల సునామీ… కన్జ్యూరింగ్ రికార్డ్స్ బ్రేక్
-
RBI Young Professionals Recruitment 2026: ఆర్బీఐలో జాబ్స్.. నెలకు రూ.1.5 లక్షల స్టైపెండ్.. అర్హతలు, దరఖాస్తు వివరాలివే
-
Telangana Public School: విద్యా విప్లవానికి నాంది.. తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.!
-
Sairaj Bahutule: వైభవ్ మంచి బాలుడు.. శ్రీలంక ఆటగాళ్లు ఎంతలా రెచ్చగొట్టారో!
ట్రెండింగ్
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?