Iran Warns Protests: ఇరాన్లో ఆందోళనకారులపై కఠిన ఆంక్షలు.. నిరసనల్లో పాల్గొంటే మరణశిక్షే!
- ఇరాన్లో కొనసాగుతున్న భారీ నిరసనలు..
- నిరసనల్లో పాల్గొన్న వారికి మరణశిక్ష విధిస్తామని హెచ్చరిక..
- ఇస్లామిక్ రిపబ్లిక్కు వ్యతిరేకంగా పోరాడిన వారిని చంపేస్తామని ప్రభుత్వం వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Warns Protests: ఇరాన్లో గత రెండు వారాలుగా కొనసాగుతున్న భారీ నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తుంది. ఇరాన్ అటార్నీ జనరల్ మొహమ్మద్ మొవాహెది అజాద్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. నిరసనల్లో పాల్గొనే వారిని ‘దేవుని శత్రువులు (మొహారెబ్)’గా పరిగణిస్తామని, అలాంటి నేరానికి మరణశిక్ష వర్తిస్తుందని స్పష్టం చేశారు. నిరసనల్లో పాల్గొన్న వారే కాకుండా ‘అల్లరిమూకలకు సహకరించిన వారు కూడా’ ఇదే నేరానికి బాధ్యులవుతారని పేర్కొన్నారు. ఇరాన్ చట్టంలోని ఆర్టికల్ 186 ప్రకారం, ఇస్లామిక్ రిపబ్లిక్కు వ్యతిరేకంగా ఆయుధాలతో పోరాడే ఏ సంస్థకైనా మద్దతు ఇచ్చిన వారు మొహారెబ్గా పరిగణించబడతారని తెలిపారు.
Read Also: PM Modi: సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు.. 72 గంటల పాటు ‘ఓం’ జపం
Also Read
- Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ 'అణు' బాంబ్.. 'సర్మాట్' క్షిపణితో సర్ప్రైజ్!
- Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
- Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. 'మాపై చేయి వేస్తే.. అణు విలయమే!'
- Israel-Hezbollah: హిజ్బుల్లా అండర్గ్రౌండ్ను గుర్తించిన ఐడీఎఫ్.. వీడియో విడుదల
మొహారెబ్ నేరానికి కఠిన శిక్షలు
ఇరాన్ శిక్షా నియమావళిలోని ఆర్టికల్ 190 ప్రకారం, ‘మొహారెబ్’ నేరానికి అత్యంత కఠిన శిక్షలు ఉన్నాయి. మరణశిక్ష, ఉరి, కుడి చేయి–ఎడమ కాలి తొలగింపు, శాశ్వత అంతర్గత నిర్బంధం (దేశంలోనే బహిష్కరణ) లాంటి శిక్షలు విధించే అవకాశం ఉందని చట్టం పేర్కొంటుంది.
ఎలాంటి సడలింపులు ఉండవు: ప్రాసిక్యూషన్
అమెరికా హెచ్చరికలను లెక్క చేయకుండా టెహ్రాన్ సర్కార్ ఈ కఠిన చర్యలకు సిద్ధమైంది. ప్రాసిక్యూటర్లకు జారీ చేసిన ఆదేశాల్లో దేశంలో అస్థిరత సృష్టించి, విదేశీ ఆధిపత్యానికి మార్గం వేయాలనుకునే వారిపై విచారణ ఆలస్యం చేయకుండా, ఎలాంటి కనికరం లేకుండా దర్యాప్తు చేయాలని తెలిపారు. ఇక, అమెరికా కేంద్రంగా పని చేస్తున్న మానవ హక్కుల కార్యకర్తల వార్తా సంస్థ ప్రకారం, ఇప్పటి వరకు ఈ నిరసనల్లో సుమారు 65 మంది మరణించారు, అలాగే 2,300 మందికిపైగా అరెస్టయ్యారు. పరిస్థితి మరింత తీవ్రంగా మారడంతో, టెహ్రాన్లో ఇంటర్నెట్ సేవలు, సెల్ ఫోన్ సిగ్నల్ నిలిపివేశారు.
Read Also: PM Modi: సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు.. 72 గంటల పాటు ‘ఓం’ జపం
ప్రవాస యువరాజు పిలుపుతో..
ఇక, ఇరాన్కు చెందిన ప్రవాస యువరాజు రెజా పహ్లవి ప్రజలను మరోసారి రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు. జనవరి 10, 11వ తేదీల్లో నిరసనల్లో పాల్గొని, షా పాలన కాలంలో వాడిన సింహం–సూర్యుడు జెండాతో పాటు జాతీయ చిహ్నాలను ప్రదర్శిస్తూ ప్రజా స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరారు. అయితే, ఈ నిరసనలు మొదటగా ఇస్లామిక్ రిపబ్లిక్పై ఉన్న అసంతృప్తితో ప్రారంభమయ్యాయి. 2025 డిసెంబర్ చివర్లో ఇరాన్ కరెన్సీ రియల్ ఒక్క అమెరికన్ డాలర్కు 14 లక్షల స్థాయికి పడిపోవడంతో పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఆర్థిక సంక్షోభం క్రమంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారింది. మొత్తంగా, ఇరాన్లో పరిస్థితి రోజు రోజుకీ ఉద్రిక్తంగా మారుతుండగా, ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది.
తాజావార్తలు
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
-
NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
-
Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ ‘అణు’ బాంబ్.. ‘సర్మాట్’ క్షిపణితో సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!