Iran-Israel: గురి చూసి ఇజ్రాయెల్ దాడి.. ఇరాన్ అణు పితామహుడు ఫక్రిజాదే మృతి.. గుర్తుచేసుకుంటున్న నిపుణులు!
- గురి చూసి ఇజ్రాయెల్ దాడి
- 2020లో ఇరాన్ అణు పితామహుడు ఫక్రిజాదే మృతి
- నాటి దుర్ఘటనను గుర్తుచేసుకుంటున్న నిపుణులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొహసిన్ ఫక్రిజాదే.. ఇరాన్ అణు పితామహుడు. ఇరాన్ అణు ఆశయాల వెనుక ఉన్నది ఇతడే. కానీ ఇతన్ని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ఎలా లక్ష్యంగా చేసుకుందో.. ఏమో తెలియదు గానీ.. అత్యంత రహస్యంగా టెహ్రాన్లో 2020లో గురి చేసి కాల్చి చంపేసింది. దీంతో ఇరాన్తో పాటు ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయి. తాజాగా ఆ నాటి ఘటనను నిపుణులు గుర్తు చేసుకుంటున్నారు. ఫక్రిజాదేను చంపింది ఇజ్రాయెలేనని అప్పట్లో ఇరాన్ ఆరోపించింది.

Also Read
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
ఇరాన్ అణు కార్యక్రమానికి పితామహుడుగా పిలువబడే ఫక్రిజాదేను ‘ఇరాన్ రాబర్ట్ ఓపెన్ హైమర్’గా ఇజ్రాయెల్ పిలుస్తుంది. 2018లో ఇతని పేరును ఇజ్రాయెల్ బహిరంగంగా బయటపెట్టింది. అంటే అప్పటికే అతన్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. 2000లో ఇరాన్ రహస్య అణ్వాయుధ ‘ప్రాజెక్ట్ అమద్’కు ఫక్రిజాదే ప్రధాని సూత్రధారి అని పాశ్చాత్య నిఘా వర్గాలు భావించాయి. 2015 అణు ఒప్పంద సమయంలో కూడా ఇతని పేరు కూడా ప్రస్తావనకు రాలేదు. ఇక బహిరంగంగా కూడా ఎప్పుడూ కనిపించలేదు. కానీ నిఘా వర్గాలు మాత్రం కచ్చితమైన లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఇది కూడా చదవండి: G7 Summit: జీ 7 సమ్మిట్లో మెలోని-మోడీ షేక్హ్యాండ్.. వీడియో వైరల్
2020, నవంబర్ 27న భార్య, భద్రతా సిబ్బందితో కలిసి కాన్వాయ్లో వెళ్తుండగా టెహ్రాన్కు తూర్పున ఉన్న అబ్సార్డ్లోని విల్లాకు వెళ్తుండగా స్పీడ్ బేకర్ దగ్గర కారు స్పీడ్ తగ్గింది. రోడ్డు పక్కన ఉన్న ట్రక్కు లోపల నుంచి వచ్చిన మెషిన్ గన్ ద్వారా బుల్లెట్లు దూసుకొచ్చాయి. కేవలం ఫక్రిజాదే టార్గెట్గా బుల్లెట్లు దూసుకొచ్చాయి. నిమిషం వ్యవధిలో 15 బుల్లెట్లు దిగడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కానీ భార్య, భద్రతా సిబ్బందికి మాత్రం ఏం కాలేదు. అయితే ఈ దాడిని ఇజ్రాయెల్ అధికారికంగా ఒప్పుకోకపోయినా.. ఇజ్రాయెలే కారణమని ఇరాన్ ఆరోపించింది.
ఇది కూడా చదవండి: Israel-Iran War: ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. తాజా దాడుల్లో 585 మంది మృతి
ఇక తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కూడా 14 మంది అణు శాస్త్రవేత్తలు చనిపోయారు. ఈ సందర్భంగా 2020లో జరిగిన ఫక్రిజాదే హత్యను నిపుణులు గుర్తుచేసుకుంటున్నారు. అప్పుడు అత్యంత రహస్యంగా దాడులు చేసి చంపేస్తే.. ఇప్పుడు కూడా అణు శాస్త్రవేత్తలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేసి చంపేసిందని గుర్తుచేసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..