Iran vs USA War: పశ్చిమాసియాలో పరిస్థితులు రోజు రోజుకూ తీవ్ర రూపం దాలుస్తున్నాయి. అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ టార్గెట్ చేసుకుంటోంది. ఇందులో భాగంగా శుక్రవారం అమెరికా వైమానిక దళానికి చెందిన ఎఫ్-15ఈ స్టైక్ ఈగిల్ యుద్ధ విమానాన్ని ఆకాశంలోనే ఇరాన్ కూల్చేసింది. ఈ విమానంలోని పైలట్ ఆచూకీపై 36 గంటల మేర అనిశ్చితి నెలకొంది. తాజాగా గల్లంతైన పైలట్ను అమెరికా ఎట్టకేలకు గుర్తించింది. ఎఫ్-15ఈ (F-15E) ఈగిల్ యుద్ధ విమానానికి చెందిన వెపన్ సిస్టమ్స్…
అమెరికా యుద్ధ నౌకపై ఇరాన్ దాడికి ప్రయత్నించిందనే వార్త ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానెళ్ల సమాచారం ప్రకారం.. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌక ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ లక్ష్యంగా తాము ‘క్రూయిజ్ క్షిపణి’ని ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ తీర ప్రాంతం నుంచి ఈ క్షిపణులను అమెరికా నౌక ఉన్న దిశగా వదిలినట్లు ఇరాన్ సైన్యం పేర్కొంది. అయితే.. ఈ దాడిపై అమెరికా అధికారులు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక…
హిందూ మహాసముద్రంలోని అమెరికా, బ్రిటన్లకు చెందిన అత్యంత కీలకమైన ‘డియాగో గార్సియా’ సైనిక స్థావరంపై ఇరాన్ దాడికి ప్రయత్నించిందని ప్రముఖ వార్తా సంస్థ ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ వెల్లడించింది. అయితే.. ఈ దాడిలో ఆ స్థావరానికి ఎటువంటి నష్టం జరగలేదు. ఏం జరిగింది..? నివేదికల ప్రకారం.. ఇరాన్ రెండు శక్తివంతమైన క్షిపణులను ప్రయోగించింది. అందులో ఒకటి గాలిలోనే విఫలం కాగా.. మరొకటి లక్ష్యాన్ని చేరుకోకుండానే అమెరికా యుద్ధనౌక అడ్డుకుంది. అయితే.. ఈ దాడి ఎప్పుడు జరిగిందనే…
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త చర్యలకు ప్రతిస్పందనగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసిన తర్వాత, ప్రపంచంలోనే ఎత్తైన టవర్ అయిన దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాను ఖాళీ చేయించారు. దాడుల సమయంలో నగరంలో పేలుళ్ల శబ్దాలు వినిపించిన తర్వాత ఈ ముందు జాగ్రత్త చర్య తీసుకున్నారు. దుబాయ్లో ఉన్న బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం (828 మీటర్లు). దీనిని Emaar Properties అనే కంపెనీ నిర్మించింది. Also Read:Iran Political…
Iran-Israel : ఇజ్రాయెల్పై ఇరాన్ మరోసారి దాడికి దిగింది. జెరూసలేం, టెల్ అవీవ్ తదితర ప్రధాన ప్రాంతాలపై క్షిపణుల దాడులు జరిపినట్లు సమాచారం. ఈ దాడుల నేపథ్యంలో వెంటనే స్పందించిన ఇజ్రాయెల్ భద్రతా దళాలు, రెండు ఇరానియన్ డ్రోన్లను ఆకాశంలోనే తాకట్టు చేయగలిగాయి. ఇరాన్ నుంచి పెరుగుతున్న దాడుల ఉధృతిని దృష్టిలో ఉంచుకుని, అమెరికా కూడా అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా భద్రతను గట్టిచేసింది. ముఖ్యంగా న్యూయార్క్ నగరంలో ఉన్న మతపరమైన మరియు సాంస్కృతిక కేంద్రాలు, ఇరాన్ రాయబార కార్యాలయాల…
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వరుసగా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్.. ఇజ్రాయెల్పై క్షిపణి దాడులు చేస్తోంది. గురువారం ఇజ్రాయెల్లోని పెద్దాస్పత్రి ధ్వంసం అయింది. తాజాగా బీర్షెబాలో మైక్రోసాఫ్ట్ ఆఫీసు సమీపంలో ఇరాన్ క్షిపణి ఢీకొట్టింది. దీంతో ఆ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Israel Iran War: ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ యుద్ధం మూలంగా చమురు సరఫరాపై ప్రభావం పడుతుందని అన్ని దేశాలు భయపడుతున్నాయి. మరోవైపు, శుక్రవారం నుంచి ఇరు దేశాల మధ్య ఘర్షణ ఆరో రోజుకు చేరింది. ఇరాన్ అణు కార్యక్రమాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో వైమానిక దాడులు చేసింది.
మంగళవారం అర్థరాత్రి ఇరాన్ ఇజ్రాయెల్పై వందలాది క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ సైనిక స్థావరాలు, మొసాద్ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులను ప్రయోగించారు. చాలా క్షిపణులను కూల్చివేయడంలో ఇజ్రాయెల్ వైమానిక రక్షణ విజయం సాధించింది. ఇందులో జోర్డాన్తో పాటు అమెరికా నుంచి ఇజ్రాయెల్ సాయం పొందినట్లు తెలిసింది.
ఇరాన్ క్షిపణి దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయం పెరుగుతోంది. కాగా, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతపై అభివృద్ధి చెందిన దేశాల సమూహం జీ-7 అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ప్రస్తుత ఛైర్పర్సన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఈ సమావేశానికి పిలుపునిచ్చారు.
ఇజ్రాయెల్పై మంగళవారం ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. దాదాపు 180 క్షిపణులను ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. అయితే కొన్నింటిని గగనతలంలోనే ఇజ్రాయెల్ పేల్చేసింది. మరికొన్ని ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలను ధ్వంసం చేశాయి. అయితే మంగళవారం దాడి సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమన్ నెతన్యాహు భయంతో బంకర్లోకి పరిగెడుతున్నారంటూ ఇరాన్ అనుకూల సోషల్ మీడియాలో వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది.