Iran: ఖమేనీ అంత్యక్రియలకు ‘‘ట్రిపుల్ హెచ్’’.. ఇజ్రాయిల్కు ఇరాన్ వార్నింగ్..
- ఖమేనీ అంత్యక్రియలకు హౌతీలు, హమాస్, హిజ్బుల్లా ప్రతినిధుల హాజరు.
- 'ప్రతిఘటన కూటమి' ఇంకా బలంగా ఉందని ఇరాన్ సంకేతం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు నివాళులు అర్పిస్తున్నారు. కోట్లాదిగా ఇరాన్ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే, ఇరాన్ యుద్ధం తర్వాత కూడా తమ ‘‘కూటమి’’ బలంగా ఉందని నిరూపించుకుంటోంది. ముఖ్యంగా ‘‘ట్రిపుల్ హెచ్’’ అంటే హౌతీలు, హమాస్, హిజ్బుల్లాకు చెందిన కీలక ప్రతినిధులు కూడా ఈ అంత్యక్రియలకు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. తమ ‘‘ప్రతిఘటన కూటమి’’ ఇంకా ముగిసిపోలేదని మిడిల్ ఈస్ట్ రాజకీయాలకు మరోసారి గుర్తు చేసింది.
ముఖ్యంగా, ఇజ్రాయిల్కు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ యుద్ధం, గాజా యుద్ధాల తర్వాత ఈ మూడు శక్తులు నాశనమయ్యాయని అంతా భావించారు. కానీ ఇంకా కథ మిగిలే ఉందని ఇరాన్ ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ మిలిటెంట్ గ్రూపులు శనివారం ఖమేనీ అంత్యక్రియలకు హాజరైనట్లు అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఇదే కాకుండా హిజ్బుల్లా, హమాస్ ప్రతినిధులు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీతో సమావేశమయ్యారు. అమెరికా, వెస్ట్రన్ దేశాలు ఈ మూడు సంస్థల్ని ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించాయి.
Also Read
- PM Modi: మోడీకి అరుదైన ఘనత.. యుద్ధ విమానాలతో ఇండోనేషియా ఘన స్వాగతం
- Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొన్న ముగ్గురు కుమారులు.. మొజ్తబా గైర్హాజరుకు కారణమేంటి?
- Netanyahu: ఇజ్రాయెల్కు భారత్ అండ.. నెతన్యాహూ కామెంట్స్తో అమెరికా షాక్..
- PoK: జులై 9న ఫైనల్ వార్.. పాకిస్థాన్కు పీఓకే నేతల లాస్ట్ వార్నింగ్! ఆ రోజు ఏం జరగబోతోంది?
పాలస్తీనా ముఖ్యంగా గాజాలో హమాస్, లెబనాన్ దక్షిణ భాగంలో హిజ్బుల్లా, యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులకు చాలా ఏళ్లుగా ఇరాన్ సహాయం చేస్తుందనేది బహిరంగ సత్యం. ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా ఈ మూడింటిని ఇరాన్ ప్రాక్సీలుగా వాడుకుంటోంది. 2023 అక్టోబర్ 7 నాటి ఇజ్రాయిల్ దాడి ఘటనలో హమాస్కు ఇరాన్ సహాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడి తర్వాత ఇజ్రాయిల్ హమాస్ హై లెవల్ లీడర్షిప్ను తుడిచిపెట్టేసింది. మరోవైపు, లెబనాన్ నుంచి ఇజ్రాయిల్పై హిజ్బుల్లా దాడులు చేస్తే, వారిని కూడా ఇజ్రాయిల్ చావు దెబ్బ కొట్టింది. అయినప్పటికీ, ఈ రెండు గ్రూపులు ఇంకా మిగిలే ఉన్నాయనే సందేశాన్ని ఇరాన్ ఇచ్చినట్లు అయింది.
తాజావార్తలు
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ‘‘ట్రిపుల్ హెచ్’’.. ఇజ్రాయిల్కు ఇరాన్ వార్నింగ్..
-
Ram Temple donation theft: అఖిలేష్ యాదవ్తో రామ మందిర చోరీ నిందితుడికి సంబంధాలు.?
-
Mohammad Kaif: ప్రమాదంలో టీమిండియా బ్యాటింగ్.. ముందు ఆ ‘వైభవ్’ను తీసేయండి..
-
Naga Vamsi: పర్సంటేజ్ సిస్టమ్ వెనుక కుట్ర! థియేటర్ల మోసాలను బయటపెట్టిన నిర్మాత నాగవంశీ..
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!