Iran: ఖమేనీ అంత్యక్రియలకు ‘‘ట్రిపుల్ హెచ్’’.. ఇజ్రాయిల్కు ఇరాన్ వార్నింగ్..
- ఖమేనీ అంత్యక్రియలకు హౌతీలు, హమాస్, హిజ్బుల్లా ప్రతినిధుల హాజరు.
- 'ప్రతిఘటన కూటమి' ఇంకా బలంగా ఉందని ఇరాన్ సంకేతం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు నివాళులు అర్పిస్తున్నారు. కోట్లాదిగా ఇరాన్ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే, ఇరాన్ యుద్ధం తర్వాత కూడా తమ ‘‘కూటమి’’ బలంగా ఉందని నిరూపించుకుంటోంది. ముఖ్యంగా ‘‘ట్రిపుల్ హెచ్’’ అంటే హౌతీలు, హమాస్, హిజ్బుల్లాకు చెందిన కీలక ప్రతినిధులు కూడా ఈ అంత్యక్రియలకు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. తమ ‘‘ప్రతిఘటన కూటమి’’ ఇంకా ముగిసిపోలేదని మిడిల్ ఈస్ట్ రాజకీయాలకు మరోసారి గుర్తు చేసింది.
ముఖ్యంగా, ఇజ్రాయిల్కు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ యుద్ధం, గాజా యుద్ధాల తర్వాత ఈ మూడు శక్తులు నాశనమయ్యాయని అంతా భావించారు. కానీ ఇంకా కథ మిగిలే ఉందని ఇరాన్ ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ మిలిటెంట్ గ్రూపులు శనివారం ఖమేనీ అంత్యక్రియలకు హాజరైనట్లు అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఇదే కాకుండా హిజ్బుల్లా, హమాస్ ప్రతినిధులు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీతో సమావేశమయ్యారు. అమెరికా, వెస్ట్రన్ దేశాలు ఈ మూడు సంస్థల్ని ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించాయి.
Also Read
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
- Instagram Addiction: టీనేజర్లను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేందుకే ఇన్స్టా..?.. మెటాపై తీవ్ర ఆరోపణలు
పాలస్తీనా ముఖ్యంగా గాజాలో హమాస్, లెబనాన్ దక్షిణ భాగంలో హిజ్బుల్లా, యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులకు చాలా ఏళ్లుగా ఇరాన్ సహాయం చేస్తుందనేది బహిరంగ సత్యం. ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా ఈ మూడింటిని ఇరాన్ ప్రాక్సీలుగా వాడుకుంటోంది. 2023 అక్టోబర్ 7 నాటి ఇజ్రాయిల్ దాడి ఘటనలో హమాస్కు ఇరాన్ సహాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడి తర్వాత ఇజ్రాయిల్ హమాస్ హై లెవల్ లీడర్షిప్ను తుడిచిపెట్టేసింది. మరోవైపు, లెబనాన్ నుంచి ఇజ్రాయిల్పై హిజ్బుల్లా దాడులు చేస్తే, వారిని కూడా ఇజ్రాయిల్ చావు దెబ్బ కొట్టింది. అయినప్పటికీ, ఈ రెండు గ్రూపులు ఇంకా మిగిలే ఉన్నాయనే సందేశాన్ని ఇరాన్ ఇచ్చినట్లు అయింది.
తాజావార్తలు
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!