Kuwait-Iran: కువైట్పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి.. పశ్చిమాసియాలో టెన్షన్
- కువైట్పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి
- తిప్పికొట్టిన కువైట్ రక్షణ దళాలు
- పశ్చిమాసియాలో టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఆరోపించింది. బుధవారం రాత్రి కువైట్ లక్ష్యంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని.. అలాగే హార్ముజ్ జలసంధి సమీపంలో ఐదు వన్వే అటాక్ డ్రోన్లను మోహరించిందని వెల్లడించింది.
సెంట్కామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మే 27 రాత్రి 10:17 గంటలకు ఇరాన్ నుంచి కువైట్ వైపు బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిందని.. అయితే కువైట్ రక్షణ దళాలు దానిని విజయవంతంగా అడ్డుకున్నట్లు తెలిపింది.
Also Read
- Ajit Doval: ఉగ్ర పోరులో ద్వంద్వ వైఖరి ఉండకూడదు.. అలాంటి దేశాలను క్షమించకూడదన్న అజిత్ దోవల్
- BrahMos Missile: భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో గ్రీస్ ఒప్పందం..! టర్కీలో భయాందోళనలు
- Putin: కజకిస్థాన్లో పుతిన్ పర్యటన.. అణు విద్యుత్ శక్తిపై కీలక ఒప్పందం
- Japan-Mangoes: అన్నదాతలకు జపాన్ షాక్.. సీజన్లో భారత మామిడిపండ్లపై నిషేధం
అదే రోజు కొన్ని గంటల ముందు హార్ముజ్ జలసంధి పరిసరాల్లో అమెరికా, మిత్రదేశాల భద్రతకు ముప్పుగా మారేలా ఐదు వన్వే అటాక్ డ్రోన్లను ఇరాన్ ప్రయోగించినట్లు పేర్కొంది. వాటన్నింటినీ అమెరికా బలగాలు కూల్చివేశాయని వెల్లడించింది. అదనంగా ఇరాన్లోని బందర్ అబ్బాస్ ప్రాంతంలో ఉన్న గ్రౌండ్ కంట్రోల్ సైట్ దగ్గర మరో డ్రోన్ ప్రయోగాన్ని కూడా అమెరికా బలగాలు అడ్డుకున్నట్లు తెలిపింది.
“ఇరాన్ పాలకులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించారు. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో అమెరికా, భాగస్వామ్య దేశాలకు ముప్పుగా మారే చర్యలకు పాల్పడ్డారు” అని సెంట్కామ్ ఆరోపించింది. అమెరికా, ప్రాంతీయ భాగస్వామ్య దేశాల బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని.. ఇరాన్ దూకుడును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని ప్రకటనలో పేర్కొంది.
ఇక ఈ పరిణామాలు అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న దౌత్య చర్చల మధ్య చోటుచేసుకోవడం గమనార్హం. ఇరాన్ అణు కార్యక్రమం, హార్ముజ్ జలసంధిలో రాకపోకల భద్రత వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం అమలుపై ఇప్పటికే పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. తాజా దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం సంభవించలేదని అమెరికా అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Kuwait-Iran: కువైట్పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి.. పశ్చిమాసియాలో టెన్షన్
-
World Biggest Return: ప్రపంచంలోనే అతిపెద్ద రాబడి.. ఒకటి-రెండు శాతం కాదు.. ఏకంగా 100శాతం రిటర్న్స్ గ్యారెంటీ!
-
CM Chandrababu : పవన్ కల్యాణ్ మద్దతుతో సుస్థిరత వచ్చింది
-
Vaibhav Vs GT: వైభవ్ను బోల్తా కొట్టించే ప్లాన్స్ రెడీ.. అద్భుత ప్రణాళికతో బరిలోకి గుజరాత్ టైటాన్స్..
-
Uttam Kumar Reddy : రైతులకు శుభవార్త.. అధికారులకు మంత్రి ఉత్తమ్ అల్టిమేటం..!
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!