భారత్-అమెరికా మధ్య కీలక రక్షణ ఒప్పందం జరిగింది. దశాబ్ద కాలం నాటి రక్షణ చట్టానికి భారతదేశం అమెరికా సంతకం చేశాయి. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. 10 ఏళ్ల పాటు ఉండే ఈ ఒప్పందం ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక, భద్రతా సహకారాన్ని బలోపేతం చేయనుంది.
ఇది కూడా చదవండి: JD Vance-Erika kirk: ఎరికా కిర్క్ను కౌగిలించుకున్న జేడీ వాన్స్.. ఇంటర్నెట్ షేక్
మలేసియా వేదికగా ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం జరిగింది. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రక్షణ ఒప్పందంపై ఇరువురు సంతకాలు చేశారు. 10 ఏళ్ల రక్షణ ఒప్పందంపై సంతకం చేసేందుకు రాజ్నాథ్ సింగ్తో భేటీ కావడం సంతోషంగా ఉందని పీట్ హెగ్సెత్ తెలిపారు. ఈ ఒప్పందం ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తుందని అభిప్రాయపడ్డారు. సమన్వయం, సమాచారంతో పాటు సహకారాన్ని పెంచుకుంటామని.. మా రక్షణ సంబంధాలు మరింత బలంగా ఉంటాయని పీట్ హెగ్సెత్ చెప్పారు.
ఇది కూడా చదవండి: Supreme Court: చీఫ్ సెక్రటరీలు ఫిజికల్గా హాజరు కావాల్సిందే.. వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టు ఆదేశాలు
India, US seal decade-long Defence Framework, usher in "new chapter" of ties
Read @ANI Story I https://t.co/Zhoeb2zKec#India #UnitedStates #DefenceFramework #IndiaUSTies #BilateralRelations pic.twitter.com/BINekvEsmD
— ANI Digital (@ani_digital) October 31, 2025
#WATCH | Raksha Mantri Rajnath Singh attends ASEAN-India defence ministers' informal meeting in Kuala Lumpur, Malaysia pic.twitter.com/nVtNHc2pg5
— ANI (@ANI) October 31, 2025