India-Srilanka: శ్రీలంకకు ఇండియా ఆపన్నహస్తం.. ఊరటనిచ్చేలా కీలక ఒప్పందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు ఆపన్నహస్తం అందించి అండగా నిలుస్తోంది భారత్. ప్రస్తుత సంక్షోభ సమయంలో భారత్తో మళ్లీ స్నేహ సంబంధాలకు హస్తం చాచింది కొలంబో. గతంలో కొలంబో పాలకులు భారత్ను కాదని ఇతర దేశాలకు దగ్గరయ్యేందుకు యత్నించారు. ప్రత్యేకించి డ్రాగన్తో కుదుర్చుకున్న ఒప్పందాలు శ్రీలంకను రుణ ఊబిలోకి నెట్టేశాయి. ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఆప్త మిత్రదేశం ఇండియాతో పలు ఒప్పందాలు కుదుర్చుకొంటూ కొలంబో వడిగా అడుగులు వేస్తోంది. భారత్ గతంలో వంద కోట్ల డాలర్ల రుణాన్ని ప్రకటించింది.
తాజాగా యూరియా కొనుగోలు కోసం పొరుగు దేశానికి 55 మిలియన్ డాలర్ల మేర క్రెడిట్ లైన్ అందించాలని భారత్ నిర్ణయించింది. అత్యవసరంగా సాయం చేయాలని శ్రీలంక ప్రభుత్వం అర్థించడంతో భారత్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రెడిట్ లైన్కు సంబంధించి శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింగే, వ్యవసాయ మంత్రి మహీంద్ర అమరవీర, భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే సమక్షంలో శ్రీలంక ప్రభుత్వం, ఎక్స్పోర్ట్- ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొలంబోలో శుక్రవారం ఒప్పందంపై సంతకాలు చేశాయి.
Also Read
- Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
- Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా 'రెంట్ ఫ్రీ' సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
శ్రీలంకలో వర్షకాల సీజన్ ప్రారంభమైంది. విత్తనాలు నాటేందుకు సరిపడా యూరియా నిల్వలు కూడా శ్రీలంకలో లేవు. దీంతో అత్యవసర వినియోగానికి 65 వేల టన్నుల యూరియా కొనుగోలు కోసం శ్రీలంక ప్రభుత్వం భారత్ను ఆశ్రయించింది. వెంటనే స్పందించిన ఇండియా.. శ్రీలంకకు తక్షణమే రుణం రూపంలో యూరియా పంపేందుకు ముందుకొచ్చింది. రసాయన ఎరువులును దిగుమతి చేసుకోకుండా సేంద్రీయ సాగు వైపు మళ్లాలని గతంలో అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో శ్రీలంకలో పంట దిగుబడులు 50 శాతం తగ్గాయి. ఫలితంగా ఆహార కొరత తలెత్తింది.
సంక్షోభ సమయంలో లంక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమ సింఘే ప్రజలకు ఆహార భద్రత కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఆపత్కాలంలో ఆదుకున్న భారత ప్రభుత్వానికి లంక ప్రధాని రణిల్ విక్రమ సింఘే ధన్యవాదాలు తెలిపారు. పొరుగు దేశాలకు ప్రాధాన్యం ఇస్తోన్న భారత్.. చిరకాల మిత్రుడు అయిన శ్రీలంకకు కూడా అనేక విధాలు సాయం అందిస్తోందని శ్రీలంకలోని భారత హైకమిషన్ వెల్లడించింది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కనీవిని ఎరగని రీతిలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు.. భారత్ ఇప్పటి వరకూ దాదాపు 3.5 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక సాయం చేసింది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!