Gurudwara Demolished: పాకిస్థాన్కి ఎంత బలుపు.. 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత! భారత్ రియాక్షన్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gurudwara Demolished: పాకిస్థాన్ తన వంకర బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. అక్కడ మైనారిటీల హక్కులను కాలరాస్తూ, వారి పవిత్ర స్థలాలను ధ్వంసం చేస్తూ దారుణమైన చర్యకు పాల్పడింది. పంజాబ్ ప్రాంతంలోని ఫారూఖాబాద్లో ఉన్న, సిక్కుల అత్యంత పవిత్రమైన 125 ఏళ్ల నాటి చారిత్రక ‘శ్రీ గురు సింగ్ సభా సాహిబ్’ గురుద్వారాను పాక్ అధికారులు, ల్యాండ్ మాఫియా కలిసి కూల్చివేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం రేపుతోంది. “పాకిస్థాన్కు ఎంత బలుపు ఉంటే ఇంతటి ఘోరానికి ఒడిగడుతుంది” అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతుండగా, భారత విదేశాంగ శాఖ పాక్కు గట్టి కౌంటర్ ఇచ్చింది. పాకిస్థాన్ చేసిన ఈ దుశ్చర్యపై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందించింది.
ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన దాడి
ఈ చారిత్రక గురుద్వారా కూల్చివేతపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ బుధవారం ప్రకటన విడుదల చేస్తూ పాకిస్థాన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇది ఒక పవిత్రమైన సిక్కు మత స్థలానికి వ్యతిరేకంగా అత్యంత ఖండించదగిన, ముందస్తు ప్రణాళికతో జరిపిన విధ్వంసం. గురుద్వారాను ధ్వంసం చేయడం తీవ్ర విచారకరం. ఈ ఘటనపై స్థానిక యంత్రాంగం కానీ, అక్కడ మైనారిటీల ఆస్తులను రక్షించాల్సిన ‘ఇవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు’ (ETPB) కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మరింత ఆందోళనకరం” అని రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు. ఈ పోస్ట్లో ఈ సంఘటన ఏదో అనుకోకుండా జరిగిన ఘటన కాదని, పాకిస్థాన్లో మైనారిటీలు, వారి పూజా స్థలాలపై నిరంతరం జరుగుతున్న వ్యవస్థీకృత దాడులకు ఇది ప్రత్యక్ష నిదర్శనమని భారత్ బల్లగుద్ది చెప్పింది. ఈ ఘటనపై తక్షణమే నిష్పక్షపాత విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని, అలాగే ధ్వంసమైన గురుద్వారాను వెంటనే పునర్నిర్మించాలని భారత్ డిమాండ్ చేసింది. మైనారిటీల రక్షణ విషయంలో పాక్ తన అంతర్జాతీయ, రాజ్యాంగ బాధ్యతలను నెరవేర్చాలని హితవు పలికింది.
Also Read
- Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
- Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
- Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
- China: గాల్వాన్ జనరల్పై జిన్పింగ్ వేటు.. భారత్కు ‘గుణపాఠం’ చెప్పాలనుకున్న ఆఫీసర్కు షాక్
తప్పు ఒప్పుకున్న పాక్ మంత్రి..
ఈ వివాదం అంతర్జాతీయంగా ముదరడంతో పాకిస్థాన్ పంజాబ్ ప్రాంత్ మైనారిటీ వ్యవహారాల మంత్రి రమేష్ సింగ్ అరోరా ఎట్టకేలకు స్పందించారు. 125 ఏళ్ల నాటి గురుద్వారా సింగ్ సభాలోని ఒక భాగాన్ని కూల్చివేసిన మాట నిజమేనని ఆయన అంగీకరించారు. మహారాజా రంజిత్ సింగ్ వర్ధంతి వేడుకల కోసం పాక్ వెళ్లి వచ్చిన 346 మంది భారత సిక్కు యాత్రికుల బృందానికి మంత్రి రమేష్ సింగ్ అరోరా ఒక హామీ ఇచ్చారు. గురుద్వారాను తక్షణమే ప్రభుత్వ ఖర్చులతో పునర్నిర్మించి, పునరుద్ధరిస్తామని చెప్పారు. ఈ కూల్చివేత వెనుక ఉన్న ‘ల్యాండ్ మాఫియా’ పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన సిక్కు జత్థా సభ్యులకు హామీ ఇచ్చారు. పాక్ ప్రభుత్వం ఈ ల్యాండ్ మాఫియాపై చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.
Our response to media queries regarding reported demolition of 125-year-old Gurdwara in Pakistan ⬇️
🔗 https://t.co/V7QUzNwuRm pic.twitter.com/WpWGONrnIp
— Randhir Jaiswal (@MEAIndia) July 1, 2026
తాజావార్తలు
-
Samantha : నా బిడ్డకు మీరే పేరు పెట్టండి అంటూ ఫ్యాన్స్కు సమంత బంపర్ ఆఫర్!
-
Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
-
Nepal Floods: భారత పౌరుల గురించి కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!