లెబనాన్లోని భారతీయ పౌరులందరూ జాగ్రత్తగా ఉండాలని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. లెబనాన్లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. బీరూట్లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరపాలని సూచించింది. ఈ మేరకు రాయబార కార్యాలయం తెలిపింది. లెబనాన్పై బాంబు దాడి చేసిన తర్వాత లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులు అప్రతమత్తంగా ఉండాలని సూచించింది.
ఇది కూడా చదవండి: Ponnam Prabhakar: జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్పై దాడిని ఖండించిన మంత్రి..
ఇప్పటికీ హమాస్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర యుద్ధం నడుస్తోంది. ఎప్పుడు ఏం జరగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు తాజాగా లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరుపక్షాలు కయ్యానికి సిద్ధంగా ఉన్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: HIV-positive: “నిత్య పెళ్లికూతురి”కి హెచ్ఐవీ పాజిటివ్.. అధికారుల ఉరుకులు పరుగులు..