HIV-positive: “నిత్య పెళ్లికూతురి”కి హెచ్ఐవీ పాజిటివ్.. అధికారుల ఉరుకులు పరుగులు..
- నిత్య పెళ్లికూతురి అరెస్ట్..
- వైద్య పరీక్షల్లో హెచ్ఐవీ పాజిటివ్..
- వరుల కోసం అధికారుల ఉరుకులు పరుగులు..
- మొత్తం 5 పెళ్లిళ్లు చేసుకున్న మహిళ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HIV-positive: ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల పోలీసులకు, ఇతర అధికారులకు కొత్త కష్టం వచ్చిపడింది. యువకులను మోసం చేస్తూ పదుల సంఖ్యలో వివాహాలు చేసుకుంటున్న ఓ ‘‘నిత్య పెళ్లికూతురి’’ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువకుడు ఇచ్చిన ఫిర్యాదులో మహిళను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే ఇప్పుడు ఆమె పెళ్లిళ్ల గురించి అధికారులు పెద్దగా వర్రీ అవ్వడం లేదు, కానీ ఆమెకు పరీక్షల్లో ‘‘హెచ్ఐవీ’’ పాజిటివ్ అని తెలుసుకుని ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు.
జైలుకు తరలించే సమయంలో పరీక్షలు నిర్వహించడంతో మహిళకు హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది. ఈమె వలలో ఎంత మంది పురుషులు ఉన్నారు..? ఎంత మందితో శారీరక సంబంధం పెట్టుకుంది..? అనే వివరాల కోసం అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో నకిలీ వివాహాల ద్వారా అనేక మంది యువకులను మోసం చేసినట్లు విచారణలో తేలింది. పెళ్లి చేసుకుని నగదు, నగలతో పరారయ్యేది. ఈమెను పెళ్లి చేసుకున్న వారి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. మే 6న ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ, ఉత్తరాఖండ్ అంతటా ఇలా నకిలీ పెళ్లిళ్లు నిర్వహిస్తున్న గ్యాంగ్లో నిందితురాలు సభ్యురాలిగా తేలింది. ఇందులో మొత్తం ఆరుగులు సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం వీరందర్ని ముజఫర్నగర్ జైలులో ఖైదు చేశారు.
Also Read
- CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
- Delhi: ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా.. రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి చర్చలు..
- Supreme Court: భర్తల పొట్టకొట్టొద్దు.. భార్యల తీరుపై సుప్రీంకోర్టు కామెంట్స్..
- Delhi: ఢిల్లీలో హై టెన్షన్.. మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ భారీ నిరసన.. సంకెళ్లతో ఆందోళన
Read Also: UP: యూపీలో దారుణం.. కన్నబిడ్డల్ని కడతేర్చిన కసాయి తల్లి
జిల్లా ఆస్పత్రి వైద్య పరీక్షల్లో ఆమెకు హెచ్ఐవీగా తేలింది. ఈమెతో శారీరక సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను ఉత్తరాఖండ్లో గుర్తించారు. వీరందరికి కూడా హెచ్ఐవీ పాజిటివ్గా తేలింది. వ్యాధి సోకిన కుటుంబీకులను కూడా అధికారులు పరీక్షిస్తున్నారు. యూపీ లోని ముజఫర్నగర్ ఇతర ప్రాంతాల్లో ఈమె బారినపడిన వరుల కోసం అధికారులు వెతుకుతున్నారు. నిందితురాలు ఉత్తరాఖండ్ లోని యుఎస్ నగర్ జిల్లాలకు చెందిన వారిగా తేలింది. ఈ ముఠాలోని వ్యక్తులు మహిళ బంధువులుగా నటిస్తూ పెళ్లిళ్లు జరిపించేవారు. ఉత్తరాఖండ్లో మూడింటితో పాటు మొత్తం ఐదు వివాహాలు చేసుకున్నట్లు మహిళ విచారణలో అంగీకరించింది. ప్రస్తుతం ఈమెకు యాంటీరెట్రోవైరల్ థెరపీ(ఏఆర్టీ) చికిత్సని ఇస్తున్నారు.
తాజావార్తలు
-
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
-
CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్పై దర్యాప్తు
-
Murali Kishor: ‘లెనిన్’ డైరెక్టర్కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
-
Ramayana : బడ్జెట్ 4000 కోట్లు.. బిజినెస్ 250 కోట్లా?
-
Telangana Eco Tourism : తెలంగాణ ఎకో టూరిజం బూస్ట్.. కొత్త మాస్టర్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!