HIV-positive: “నిత్య పెళ్లికూతురి”కి హెచ్ఐవీ పాజిటివ్.. అధికారుల ఉరుకులు పరుగులు..
- నిత్య పెళ్లికూతురి అరెస్ట్..
- వైద్య పరీక్షల్లో హెచ్ఐవీ పాజిటివ్..
- వరుల కోసం అధికారుల ఉరుకులు పరుగులు..
- మొత్తం 5 పెళ్లిళ్లు చేసుకున్న మహిళ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HIV-positive: ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల పోలీసులకు, ఇతర అధికారులకు కొత్త కష్టం వచ్చిపడింది. యువకులను మోసం చేస్తూ పదుల సంఖ్యలో వివాహాలు చేసుకుంటున్న ఓ ‘‘నిత్య పెళ్లికూతురి’’ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువకుడు ఇచ్చిన ఫిర్యాదులో మహిళను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే ఇప్పుడు ఆమె పెళ్లిళ్ల గురించి అధికారులు పెద్దగా వర్రీ అవ్వడం లేదు, కానీ ఆమెకు పరీక్షల్లో ‘‘హెచ్ఐవీ’’ పాజిటివ్ అని తెలుసుకుని ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు.
జైలుకు తరలించే సమయంలో పరీక్షలు నిర్వహించడంతో మహిళకు హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది. ఈమె వలలో ఎంత మంది పురుషులు ఉన్నారు..? ఎంత మందితో శారీరక సంబంధం పెట్టుకుంది..? అనే వివరాల కోసం అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో నకిలీ వివాహాల ద్వారా అనేక మంది యువకులను మోసం చేసినట్లు విచారణలో తేలింది. పెళ్లి చేసుకుని నగదు, నగలతో పరారయ్యేది. ఈమెను పెళ్లి చేసుకున్న వారి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. మే 6న ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ, ఉత్తరాఖండ్ అంతటా ఇలా నకిలీ పెళ్లిళ్లు నిర్వహిస్తున్న గ్యాంగ్లో నిందితురాలు సభ్యురాలిగా తేలింది. ఇందులో మొత్తం ఆరుగులు సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం వీరందర్ని ముజఫర్నగర్ జైలులో ఖైదు చేశారు.
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
Read Also: UP: యూపీలో దారుణం.. కన్నబిడ్డల్ని కడతేర్చిన కసాయి తల్లి
జిల్లా ఆస్పత్రి వైద్య పరీక్షల్లో ఆమెకు హెచ్ఐవీగా తేలింది. ఈమెతో శారీరక సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను ఉత్తరాఖండ్లో గుర్తించారు. వీరందరికి కూడా హెచ్ఐవీ పాజిటివ్గా తేలింది. వ్యాధి సోకిన కుటుంబీకులను కూడా అధికారులు పరీక్షిస్తున్నారు. యూపీ లోని ముజఫర్నగర్ ఇతర ప్రాంతాల్లో ఈమె బారినపడిన వరుల కోసం అధికారులు వెతుకుతున్నారు. నిందితురాలు ఉత్తరాఖండ్ లోని యుఎస్ నగర్ జిల్లాలకు చెందిన వారిగా తేలింది. ఈ ముఠాలోని వ్యక్తులు మహిళ బంధువులుగా నటిస్తూ పెళ్లిళ్లు జరిపించేవారు. ఉత్తరాఖండ్లో మూడింటితో పాటు మొత్తం ఐదు వివాహాలు చేసుకున్నట్లు మహిళ విచారణలో అంగీకరించింది. ప్రస్తుతం ఈమెకు యాంటీరెట్రోవైరల్ థెరపీ(ఏఆర్టీ) చికిత్సని ఇస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..