India vs Pakistan: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని పాకిస్థాన్ చెప్పడం హాస్యాస్పదం
- మరోసారి అంతర్జాతీయ వేదిక మీద భారత్పై అక్కసు వెళ్లగక్కిన పాకిస్థాన్..
- జమ్మూకశ్మీర్ తమదేనని ప్రకటించిన పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషక్ దార్..
- పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషక్ దార్ పై తీవ్రంగా మండిపడిన భారత ప్రతినిధి..
- జమ్మూకశ్మీర్ ఎప్పుడూ భారత్లో అంతర్భాగమే: భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: అంతర్జాతీయ వేదికలపై భారత్పై అక్కసు వెళ్లగక్కడం పాకిస్థాన్కు మొదటి నుంచి ఉన్న అలవాటు. అయితే, చైనా అధ్యక్షతన జరిగిన భద్రతా మండలి సమావేశంలో జమ్మూ కశ్మీర్ను ఉద్దేశించి పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషక్ దార్ హాట్ కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలకు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీస్ ఘాటుగా బదులిచ్చారు. యూఎన్ ఉగ్రవాద సంస్థల జాబితాలో ఉన్న 20 సంస్థలను దాయాది దేశం పాక్ పెంచి పోషిస్తోంది అని ఆరోపించారు. అలాగే, సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోయడంతో పాటు ఉగ్రవాద వ్యతిరేక పోరులో ముందు వరుసలో ఉందని పాకిస్థాన్ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. పాక్ చేసే ఉగ్ర కార్యకలాపాలకు మేం బాధితులం అయ్యామని పేర్కొన్నారు. అమాయక ప్రజలపై జరిగే ఉగ్రవాద చర్యలకు సమర్థించలేమన్నారు. ఉగ్రవాదుల్లో మంచి, చెడు అని తేడాలు ఉండవని చెప్పుకొచ్చారు. ఇలాంటి మాటలతో భద్రతా మండలి సమయాన్ని వృథా చేయొద్దని పాక్ మంత్రికి భారత ప్రతినిధి హరీస్ హితవు పలికారు.
Read Also: Komatireddy Venkat Reddy: ఓట్ల కోసం దేశాన్ని విడగొట్టే పార్టీ బీజేపీ
Also Read
- Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
అయితే, జమ్మూకశ్మీర్ ఎప్పుడూ భారత్లో అంతర్భాగమేనని భద్రతా మండిలిలో పర్వతనేని హరీస్ తేల్చి చెప్పారు. గత కొన్ని నెలల క్రితం జమ్మూకశ్మీర్లో జరిగిన ఎన్నికలతో పాటు కొత్త ప్రభుత్వం ఏర్పడటం గురించి తెలియజేశారు. కశ్మీర్ ప్రజల ఎంపిక చాలా క్లీయర్ గా ఉంది. పాకిస్థాన్ మాదిరిగా కాకుండా అక్కడ ప్రజాస్వామ్యం బలంగా పరిణవిల్లుతుంది అన్నారు. కశ్మీర్ అంశానికి సంబంధించి పాకిస్థాన్ తన మొండి వాదనను ఆపివేయాలని హెచ్చరించారు. కశ్మీరీలు తమ ప్రజాస్వామ్య హక్కులు వినియోగించుకోవడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను భారత్ అమలు చేయాలని పాకిస్థాన్ కోరింది. ఇందులో భాగంగానే, కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణకు అనుమతించాలని కోరుతూ పాక్ పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
తాజావార్తలు
-
NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
-
Kitchen Tips: వెల్లుల్లి తొక్క తీయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ ఈజీ టిఫ్తో సెకన్లలో పని పూర్తి!
-
UCC Bill: ‘ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది’.. సీఎం సంచలన ప్రకటన..
-
CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
-
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!