Bangladesh Violence: బంగ్లాదేశ్ నుంచి రాయబార అధికారులను ఖాళీ చేయించిన భారత్..
- బంగ్లాదేశ్లో కొనసాగుతున్న హింస..
- ఢాకా భారత రాయబార కార్యాలయం నుంచి అనవసర సిబ్బంది తరలింపు..
- ముఖ్య అధికారులు ఆ దేశంలోనే..
Bangladesh Violence: బంగ్లాదేశ్లో ఇంకా హింస చెలరేగుతూనే ఉంది. షేక్ హసీనా రాజీనామా చేసి, ఇండియాకి పారిపోయివచ్చినప్పటికీ అక్కడ పరిస్థితి చక్కబడటం లేదు. ముఖ్యంగా హసీనాకు చెందిన అవామీ లీడ్ పార్టీ నేతలతో పాటు హిందువులను టార్గెట్ చేస్తున్నారు. అక్కడి పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉండటంతో ఢాకాలోని భారత రాయబార కార్యాలయం నుంచి అనవసరమైన సిబ్బందిని, వారి కుటుంబాలను అక్కడ నుంచి ఖాళీ చేయించి, భారత్ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కీలకమైన రాయబారులు, ఉద్యోగులు మాత్రమే హైకమిషన్లో ఉండనున్నారు. ఢాకాలోని భారత హైకమిషనర్తో సహా ప్రిన్సిపల్ అధికారులు తమ పదవుల్లోనే ఉన్నారు.
Read Also: Bithiri Sathi: భగవద్గీతను అవమానించి, సారీ చెప్పమంటే బిత్తిరి సత్తి షాకింగ్ రియాక్షన్?
Also Read
- Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకరాం.. కమర్షియల్ ఫ్లైట్ ద్వారా వీరి తరలింపు జరిగినట్లు తెలుస్తోంది. హైకమిషన్ పనిచేస్తూనే ఉంది. ఈ ప్రాంతంలో అశాంతి మధ్య అవసరమైన కార్యకలాపాలను సిబ్బంది నిర్వహిస్తోంది. రాజధాని ఢాకాలోని హైకమిషన్తో పాటు చిట్టగాంగ్, రాజ్షాహీ, ఖుల్నా, సిల్హెట్లతో సహా అనేక ఇతర నగరాల్లో భారతదేశ సహాయక హైకమిషన్లు, కాన్సులేట్స్ ఉన్నాయి. బుధవారం ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానం, ప్రయాణికులు లేకుండా ఢిల్లీ నుండి బయలుదేరి, ఢాకా నుంచి 199 మంది పెద్దలు , ఆరుగురు శిశువులతో ఢిల్లీ తిరిగి వచ్చింది.
రిజర్వేషన్ కోటాపై మొదలైన విద్యార్థి ఉద్యమం తీవ్ర హింసాత్మక ఘటనలకు దారి తీసింది. చివరకు ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ ఆర్మీ కేవలం 45 నిమిషాల అల్టిమేటం ఇవ్వడంతో ఆమె రాజీనామా చేసి, ఇండియాకు వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీకి సమీపంలోని హిండన్ ఎయిర్బేస్లో భారత భద్రతా పర్యవేక్షణలో ఉన్నారు. దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చెలరేగడంతో 300కి పైగా ప్రజలు మరణించారు. హసీనా రాజీనామా తర్వాత ఆర్మీ దేశాన్ని అదుపులోకి తీసుకుంది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్, జనరల్ వాకర్-ఉజ్-జమాన్ మిలటరీ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. బంగ్లాదేశ్ మిలిటరీ ఢాకా దౌత్య పరిసర ప్రాంతాలను కాపాడే బాధ్యతను స్వీకరించింది. ఇంతకుముందు ఈ ప్రాంతాన్ని పోలీసులు పర్యవేక్షించే వారు.
తాజావార్తలు
-
TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
-
Cigarette Price Hike: సిగరెట్ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. మే నెలలో పెరగనున్న సిగరెట్ ధరలు?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై రూ.10 కోట్లు..! ఆ జట్టు కొనుగోలు చేసే అవకాశం..
-
Rohit Sharma గాయంపై కీలక అప్డేట్.. కెప్టెన్ Hardik Pandya ఏమన్నాడంటే.!
-
Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?