India Pakistan War: భారత్, బీఎల్ఏ, తాలిబాన్లు.. పాకిస్తాన్పై ముప్పేట దాడి..
- ఓ వైపు భారత్, మరోవైపు బీఎల్ఏ, తాలిబాన్ దాడులు..
- అయినా పాకిస్తాన్కి బుద్ధి రావడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan War: పాకిస్తాన్, తాను ఎంత నాశనం అవుతున్నా భారత్ ఎదగకూడదు, భారత్ ప్రశాంతంగా ఉండకూడదు అనేదే దాని ఉద్దేశ్యం. భారత్ని చికాకు పరుస్తూ పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్ర సంస్థలకు మద్దతు ఇస్తోంది. ఇటీవల, పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి లష్కరే తోయిబా పనే. ఈ దాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ని ప్రారంభించి పాక్, పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భీకర దాడులు చేసింది. 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది.
Read Also: Pak Drone Attack: పౌర విమానాలను రక్షణగా వాడుకుంటూ పాకిస్తాన్ డ్రోన్ దాడులు..
Also Read
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
ఇదిలా ఉంటే, పాకిస్తాన్కి ఇప్పుడు ముప్పేట దాడి ఎదురవుతోంది. ఓ వైపు బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) యోధులు స్వాతంత్ర్యం కోసం పాక్ ఆర్మీపై దాడులు చేస్తుున్నారు. పాక్ సైనికులు, పంజాబ్ ప్రావిన్సుకు చెందిన వారు కనిపిస్తే కాల్చి చంపుతున్నారు. ప్రస్తుతం బలూచ్ రాజధాని క్వెట్టాతో సహా పలు ప్రముఖ పట్టణాలు బీఎల్ఏ ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా, తెహ్రీక్ ఏ తాలిబాన్(టీటీపీ) కూడా పాకిస్తాన్ పై విరుచుకుపడుతోంది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలో పాకిస్తాన్ ఆర్మీని లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేసింది. 30 మంది పాక్ సైనికుల్ని హతమార్చినట్లు తాలిబాన్ ప్రతినిధి ప్రకటించారు. పాకిస్తాన్ ఇప్పుడు మూడు వైపుల నుంచి దాడుల్ని ఎదుర్కొంటోంది. అయినప్పటికీ, పాక్ ఆర్మీ భారత్పై డ్రోన్ దాడికి తెగబడుతూనే ఉంది. వరసగా శుక్రవారం రెండో రోజు కూడా దాడికి పాల్పడింది.
- Tags
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..