Imran Khan: భారత్ ఇచ్చిన బంగారు పతకాన్ని కూడా ఇమ్రాన్ అమ్మేశాడు.. పాక్ మంత్రి ఆరోపణలు
Imran Khan “Sold” Gold Medal Received From India: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఆ దేశ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ పై పలు కేసులు నమోదు చేసింది షహజాబ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం. తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఇమ్రాన్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇమ్రాన్ ఖాన్ భారతదేశం నుంచి అందుకున్న బంగారు పతకాన్ని కూడా అమ్మేశారని ఆరోపించారు. ఇప్పటికే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న తోషాఖానా నుంచి రాయితీపై ప్రధాని పొందిన పలు వస్తువులను అడ్డదారుల్లో అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆసిఫ్ ఖాన్ అమ్ముకున్న బంగార పతకం గురించిన వివారాలను పెద్దగా వెల్లడించలేదు.
Read Also: IT Layoffs: అమెజాన్, మెటా బాటలో మరో టాప్ టెక్ దిగ్గజం.. 10 వేల ఉద్యోగాలు ఊస్ట్..
Also Read
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- Putin - Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా 'ఫుల్' సపోర్ట్..!
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
ఇమ్రాన్ ఖాన్ చర్యలు చట్టవిరుద్ధం కాదు.. కానీ ఆయన మాట్లాడే మాటలు చేతలకు విరుద్ధంగా ఉన్నాయని మంత్రి అన్నారు. వివిధ దేశాల పర్యటన సమయంలో ప్రధానులకు వచ్చిన బహుమతులను పాకిస్తాన్ తోషాఖానాలో జమచేస్తుంటారు. ఇలా వచ్చిన వస్తువులను ఇమ్రాన్ ఖాన్ ఎక్కువ ధరకు అమ్ముకున్నారనే ఆరోపణలతో పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ ఆయన్ను అనర్హుడిగా ప్రకటించింది. తాను ప్రధానిగా ఉన్న సమయంలో నాలుగు బహుమతులను అమ్ముకున్నట్లు ఇమ్రాన్ ఖాన్ అంగీకరించినట్లు ఓ నివేదిక పేర్కొంది. ఇమ్రాన్ ఖాన్ పదవి కోసం పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని రక్షణ మంత్రి ఆసిఫ్ ఖాన్ విమర్శించారు. దేశంలోని సాయుధ బలగాలు రాజకీయాలకు దూరంగా ఉంటాయని ప్రకటించినప్పటికీ.. ఇమ్రాన్ ఖాన్ వారిపై నిందలు వేస్తున్నారని ఆయన అన్నారు.
అవిశ్వాసంతో ఈ ఏడాది ఇమ్రాన్ ఖాన్ పదవిని కోల్పోయాడు. పీఎంగా షహబాజ్ షరీఫ్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే అప్పటి నుంచి ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించారు ఇమ్రాన్ ఖాన్. పాక్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ.. ఇండియా విదేశాంగ విధానం, ఇండియా సైన్యంపై పలుమార్లు ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఆజాదీ మార్చ్ పెద్ద ఎత్తున చేపట్టారు. అయితే ఈ మార్చ్ లో ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. ఈ కాల్పుల నుంచి ఇమ్రాన్ ఖాన్ తృటిలో తప్పించుకున్నారు.
తాజావార్తలు
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!