Imran Khan: భారత్ ఇచ్చిన బంగారు పతకాన్ని కూడా ఇమ్రాన్ అమ్మేశాడు.. పాక్ మంత్రి ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan “Sold” Gold Medal Received From India: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఆ దేశ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ పై పలు కేసులు నమోదు చేసింది షహజాబ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం. తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఇమ్రాన్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇమ్రాన్ ఖాన్ భారతదేశం నుంచి అందుకున్న బంగారు పతకాన్ని కూడా అమ్మేశారని ఆరోపించారు. ఇప్పటికే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న తోషాఖానా నుంచి రాయితీపై ప్రధాని పొందిన పలు వస్తువులను అడ్డదారుల్లో అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆసిఫ్ ఖాన్ అమ్ముకున్న బంగార పతకం గురించిన వివారాలను పెద్దగా వెల్లడించలేదు.
Read Also: IT Layoffs: అమెజాన్, మెటా బాటలో మరో టాప్ టెక్ దిగ్గజం.. 10 వేల ఉద్యోగాలు ఊస్ట్..
Also Read
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
- Elon Musk: చైనాలో మస్క్ మేనియా.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న షియోమీ బాస్తో సెల్ఫీ
ఇమ్రాన్ ఖాన్ చర్యలు చట్టవిరుద్ధం కాదు.. కానీ ఆయన మాట్లాడే మాటలు చేతలకు విరుద్ధంగా ఉన్నాయని మంత్రి అన్నారు. వివిధ దేశాల పర్యటన సమయంలో ప్రధానులకు వచ్చిన బహుమతులను పాకిస్తాన్ తోషాఖానాలో జమచేస్తుంటారు. ఇలా వచ్చిన వస్తువులను ఇమ్రాన్ ఖాన్ ఎక్కువ ధరకు అమ్ముకున్నారనే ఆరోపణలతో పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ ఆయన్ను అనర్హుడిగా ప్రకటించింది. తాను ప్రధానిగా ఉన్న సమయంలో నాలుగు బహుమతులను అమ్ముకున్నట్లు ఇమ్రాన్ ఖాన్ అంగీకరించినట్లు ఓ నివేదిక పేర్కొంది. ఇమ్రాన్ ఖాన్ పదవి కోసం పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని రక్షణ మంత్రి ఆసిఫ్ ఖాన్ విమర్శించారు. దేశంలోని సాయుధ బలగాలు రాజకీయాలకు దూరంగా ఉంటాయని ప్రకటించినప్పటికీ.. ఇమ్రాన్ ఖాన్ వారిపై నిందలు వేస్తున్నారని ఆయన అన్నారు.
అవిశ్వాసంతో ఈ ఏడాది ఇమ్రాన్ ఖాన్ పదవిని కోల్పోయాడు. పీఎంగా షహబాజ్ షరీఫ్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే అప్పటి నుంచి ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించారు ఇమ్రాన్ ఖాన్. పాక్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ.. ఇండియా విదేశాంగ విధానం, ఇండియా సైన్యంపై పలుమార్లు ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఆజాదీ మార్చ్ పెద్ద ఎత్తున చేపట్టారు. అయితే ఈ మార్చ్ లో ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. ఈ కాల్పుల నుంచి ఇమ్రాన్ ఖాన్ తృటిలో తప్పించుకున్నారు.
తాజావార్తలు
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!