Imran Khan: భారత్ ఇచ్చిన బంగారు పతకాన్ని కూడా ఇమ్రాన్ అమ్మేశాడు.. పాక్ మంత్రి ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan “Sold” Gold Medal Received From India: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఆ దేశ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ పై పలు కేసులు నమోదు చేసింది షహజాబ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం. తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఇమ్రాన్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇమ్రాన్ ఖాన్ భారతదేశం నుంచి అందుకున్న బంగారు పతకాన్ని కూడా అమ్మేశారని ఆరోపించారు. ఇప్పటికే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న తోషాఖానా నుంచి రాయితీపై ప్రధాని పొందిన పలు వస్తువులను అడ్డదారుల్లో అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆసిఫ్ ఖాన్ అమ్ముకున్న బంగార పతకం గురించిన వివారాలను పెద్దగా వెల్లడించలేదు.
Read Also: IT Layoffs: అమెజాన్, మెటా బాటలో మరో టాప్ టెక్ దిగ్గజం.. 10 వేల ఉద్యోగాలు ఊస్ట్..
Also Read
- America vs Iran: కాస్కో ఇరాన్..! మీకు రెండే ఆప్షన్స్.. వినకపోతే లేపి పడేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
- Tragedy: చూడ ముచ్చటైన జంట.. పెళ్లైన కొద్ది గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి
- Halloween: అర్థరాత్రి 12 దాటగానే వింత శబ్దాలు.. ఆ యూనివర్శిటీలో దెయ్యాలున్నాయా?
- US airstrikes on Iran: కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. ఇరాన్ రాడార్, డ్రోన్ స్థావరాలపై అమెరికా దాడులు..
ఇమ్రాన్ ఖాన్ చర్యలు చట్టవిరుద్ధం కాదు.. కానీ ఆయన మాట్లాడే మాటలు చేతలకు విరుద్ధంగా ఉన్నాయని మంత్రి అన్నారు. వివిధ దేశాల పర్యటన సమయంలో ప్రధానులకు వచ్చిన బహుమతులను పాకిస్తాన్ తోషాఖానాలో జమచేస్తుంటారు. ఇలా వచ్చిన వస్తువులను ఇమ్రాన్ ఖాన్ ఎక్కువ ధరకు అమ్ముకున్నారనే ఆరోపణలతో పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ ఆయన్ను అనర్హుడిగా ప్రకటించింది. తాను ప్రధానిగా ఉన్న సమయంలో నాలుగు బహుమతులను అమ్ముకున్నట్లు ఇమ్రాన్ ఖాన్ అంగీకరించినట్లు ఓ నివేదిక పేర్కొంది. ఇమ్రాన్ ఖాన్ పదవి కోసం పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని రక్షణ మంత్రి ఆసిఫ్ ఖాన్ విమర్శించారు. దేశంలోని సాయుధ బలగాలు రాజకీయాలకు దూరంగా ఉంటాయని ప్రకటించినప్పటికీ.. ఇమ్రాన్ ఖాన్ వారిపై నిందలు వేస్తున్నారని ఆయన అన్నారు.
అవిశ్వాసంతో ఈ ఏడాది ఇమ్రాన్ ఖాన్ పదవిని కోల్పోయాడు. పీఎంగా షహబాజ్ షరీఫ్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే అప్పటి నుంచి ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించారు ఇమ్రాన్ ఖాన్. పాక్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ.. ఇండియా విదేశాంగ విధానం, ఇండియా సైన్యంపై పలుమార్లు ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఆజాదీ మార్చ్ పెద్ద ఎత్తున చేపట్టారు. అయితే ఈ మార్చ్ లో ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. ఈ కాల్పుల నుంచి ఇమ్రాన్ ఖాన్ తృటిలో తప్పించుకున్నారు.
తాజావార్తలు
-
Chasemaster vs Hitman: కోహ్లీ, రోహిత్ కెరీర్లో ఇంతటి వ్యత్యాసమా.. రోహిత్ కెరీర్కు ఎండ్కార్డ్ పడినట్లేనా..?
-
Peddi : ‘పెద్ది’ ఆకలి తీరుస్తుందా?
-
Ram Charan Body Gaurd : రామ్ చరణ్ బాడీ గార్డుకు బాడీ గార్డులు.. ఇది కదా క్రేజ్ అంటే!
-
Suriya48 లోడింగ్.. ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తున్న క్రేజీ లైనప్!
-
Ram Charan : అందుకే నేను నాబాడీగార్డును అస్సలు బయట తిరగనివ్వట్లేదు.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!