Pakistan PM: ఊహకు అందని విధంగా ఐఎంఎఫ్ షరతులు.. తలొగ్గక తప్పని పరిస్థితి..
Pakistan Economic Crisis: తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది దాయాది దేశం పాకిస్తాన్. మిత్రదేశాలను అడిగినా అప్పు పుట్టడం లేదు. ఇప్పటికే చేసిన అప్పులు భారీగా ఉండటంతో అరబ్ దేశాలు, చైనా, ఇతర దేశాలు అప్పులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) సహకరిస్తే తప్పా ఈ సంక్షోభం నుంచి పాకిస్తాన్ బయటపడే అవకాశం లభించదు. అయితే ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ ఇవ్వాలంటే, షరతులకు అంగీకరించాల్సిందే అని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. అయితే ఈ షరతులకు అంగీకరిస్తే పాకిస్తాన్ ప్రజలు పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి పడిపోతుంది. ప్రజలపై మరింత భారం పడుతుంది. అయినా కూడా పాకిస్తాన్ షరతులకు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది.
Read Also: Viral Video: రోటీ చేసిన బిలియనీర్.. బ్లాగర్తో కలిసి బిల్గేట్స్ చెఫ్ అవతారం
Also Read
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
ఇదిలా ఉంటే ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఎంఎఫ్ షరతులు ఊహకు అందనివిగా ఉన్నాయిని.. అయినా కూడా అంగీకరించాల్సిందే అని అన్నారు. ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. నెలల తరబడి నిలిచిపోయిన ఆర్థిక సాయాన్ని మళ్లీ ప్రారంభించేందుకు ఐఎంఎఫ్ బృందం మంగళవారం పాకిస్తాన్ చేరుకుంది. అయితే అక్టోబర్ లో పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఐఎంఎఫ్ షరతులకు అంగీకరిస్తే ఎదురుదెబ్బ తగులుతుందని, ఐఎంఎఫ్ సిఫారసు చేసిన పన్నుల పెంపుదల, సబ్సీడీ కోతలకు వ్యతిరేకంగా పాక్ ప్రభుత్వం పట్టుబట్టింది. అయితే ఐఎంఎఫ్ షరతులు అంగీకరించాల్సిందే లేకపోతే బెయిలౌట్ ప్యాకేజీ కష్టం అని తేల్చి చెప్పింది. విద్యుత్ టారిఫ్ పెంచాలనే కీలక ప్రతిపాదన చేసింది. ఇదే జరిగితే పాకిస్తాన్ ప్రజల్లో ఆక్రోశం కట్టలు తెంచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ కు 7 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ఐఎంఎఫ్ చర్చలు జరుపుతోంది.
ప్రస్తుతం విదేశీ మారకద్రవ్యం నిల్వలు కేవలం 3.1 బిలియన్ డాలర్లు ఉన్నాయి. ఇది కేవలం మూడు వారాల దిగుమతులకే సరిపోతాయి. బుధవారం పాకిస్తాన్ లో ద్రవ్యోల్భనం 48 ఏళ్ల గరిష్టస్థాయికి చేరుకుంది. ప్రజల కనీస అవసరాలు అయిన కూరగాయాలు, పిండి, వంటనూనె, నెయ్యి కొనుగోలు చేసేందుకు ప్రజలు కష్టపడుతున్నారు. విపరీతంగా రేట్లు పెరిగాయి. చెల్లింపులు చేయలేకపోవడంతో కరాచీ పోర్టులో వేలాది షిప్పింగ్ కంటైనర్లలో వస్తువులు అలాగే ఉన్నాయి.
తాజావార్తలు
-
Toxic Effect: ‘మా ఇంటి బంగారం’ వాయిదా?
-
Ragi Sarva Pindi: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. తెలంగాణ స్పెషల్ ‘రాగి పిండి సర్వపిండి’.. ఇలా ట్రై చేయండి!
-
Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..
-
Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్పై బీసీసీఐ కఠిన చర్యలు.?
-
Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!