Pakistan PM: ఊహకు అందని విధంగా ఐఎంఎఫ్ షరతులు.. తలొగ్గక తప్పని పరిస్థితి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Economic Crisis: తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది దాయాది దేశం పాకిస్తాన్. మిత్రదేశాలను అడిగినా అప్పు పుట్టడం లేదు. ఇప్పటికే చేసిన అప్పులు భారీగా ఉండటంతో అరబ్ దేశాలు, చైనా, ఇతర దేశాలు అప్పులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) సహకరిస్తే తప్పా ఈ సంక్షోభం నుంచి పాకిస్తాన్ బయటపడే అవకాశం లభించదు. అయితే ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ ఇవ్వాలంటే, షరతులకు అంగీకరించాల్సిందే అని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. అయితే ఈ షరతులకు అంగీకరిస్తే పాకిస్తాన్ ప్రజలు పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి పడిపోతుంది. ప్రజలపై మరింత భారం పడుతుంది. అయినా కూడా పాకిస్తాన్ షరతులకు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది.
Read Also: Viral Video: రోటీ చేసిన బిలియనీర్.. బ్లాగర్తో కలిసి బిల్గేట్స్ చెఫ్ అవతారం
Also Read
- TulsiGabbard: అమెరికా ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా.. కారణం ఏంటంటే?
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
ఇదిలా ఉంటే ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఎంఎఫ్ షరతులు ఊహకు అందనివిగా ఉన్నాయిని.. అయినా కూడా అంగీకరించాల్సిందే అని అన్నారు. ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. నెలల తరబడి నిలిచిపోయిన ఆర్థిక సాయాన్ని మళ్లీ ప్రారంభించేందుకు ఐఎంఎఫ్ బృందం మంగళవారం పాకిస్తాన్ చేరుకుంది. అయితే అక్టోబర్ లో పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఐఎంఎఫ్ షరతులకు అంగీకరిస్తే ఎదురుదెబ్బ తగులుతుందని, ఐఎంఎఫ్ సిఫారసు చేసిన పన్నుల పెంపుదల, సబ్సీడీ కోతలకు వ్యతిరేకంగా పాక్ ప్రభుత్వం పట్టుబట్టింది. అయితే ఐఎంఎఫ్ షరతులు అంగీకరించాల్సిందే లేకపోతే బెయిలౌట్ ప్యాకేజీ కష్టం అని తేల్చి చెప్పింది. విద్యుత్ టారిఫ్ పెంచాలనే కీలక ప్రతిపాదన చేసింది. ఇదే జరిగితే పాకిస్తాన్ ప్రజల్లో ఆక్రోశం కట్టలు తెంచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ కు 7 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ఐఎంఎఫ్ చర్చలు జరుపుతోంది.
ప్రస్తుతం విదేశీ మారకద్రవ్యం నిల్వలు కేవలం 3.1 బిలియన్ డాలర్లు ఉన్నాయి. ఇది కేవలం మూడు వారాల దిగుమతులకే సరిపోతాయి. బుధవారం పాకిస్తాన్ లో ద్రవ్యోల్భనం 48 ఏళ్ల గరిష్టస్థాయికి చేరుకుంది. ప్రజల కనీస అవసరాలు అయిన కూరగాయాలు, పిండి, వంటనూనె, నెయ్యి కొనుగోలు చేసేందుకు ప్రజలు కష్టపడుతున్నారు. విపరీతంగా రేట్లు పెరిగాయి. చెల్లింపులు చేయలేకపోవడంతో కరాచీ పోర్టులో వేలాది షిప్పింగ్ కంటైనర్లలో వస్తువులు అలాగే ఉన్నాయి.
తాజావార్తలు
-
Tirumala Devotee Alert: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Pat Cummins: “అభిషేక్, ఇషాన్, క్లాసెన్ కాదు.. వాళ్ల వల్లే మ్యాచ్ గెలిచాం”.. SRH కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
TulsiGabbard: అమెరికా ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా.. కారణం ఏంటంటే?
-
Mega158: ‘మెగా158’ టైటిల్పై హింట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!