Pakistan PM: ఊహకు అందని విధంగా ఐఎంఎఫ్ షరతులు.. తలొగ్గక తప్పని పరిస్థితి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Economic Crisis: తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది దాయాది దేశం పాకిస్తాన్. మిత్రదేశాలను అడిగినా అప్పు పుట్టడం లేదు. ఇప్పటికే చేసిన అప్పులు భారీగా ఉండటంతో అరబ్ దేశాలు, చైనా, ఇతర దేశాలు అప్పులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) సహకరిస్తే తప్పా ఈ సంక్షోభం నుంచి పాకిస్తాన్ బయటపడే అవకాశం లభించదు. అయితే ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ ఇవ్వాలంటే, షరతులకు అంగీకరించాల్సిందే అని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. అయితే ఈ షరతులకు అంగీకరిస్తే పాకిస్తాన్ ప్రజలు పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి పడిపోతుంది. ప్రజలపై మరింత భారం పడుతుంది. అయినా కూడా పాకిస్తాన్ షరతులకు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది.
Read Also: Viral Video: రోటీ చేసిన బిలియనీర్.. బ్లాగర్తో కలిసి బిల్గేట్స్ చెఫ్ అవతారం
Also Read
- Venezuela Earthquake: భూమ్మీద నూకలున్నయ్.. 8 రోజుల తర్వాత భూకంప శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన సెక్యూరిటీ గార్డు
- Imran Khan PTI: పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎన్నికలు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ సంచలన నిర్ణయం
- China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్కు ప్రణాళిక
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
ఇదిలా ఉంటే ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఎంఎఫ్ షరతులు ఊహకు అందనివిగా ఉన్నాయిని.. అయినా కూడా అంగీకరించాల్సిందే అని అన్నారు. ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. నెలల తరబడి నిలిచిపోయిన ఆర్థిక సాయాన్ని మళ్లీ ప్రారంభించేందుకు ఐఎంఎఫ్ బృందం మంగళవారం పాకిస్తాన్ చేరుకుంది. అయితే అక్టోబర్ లో పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఐఎంఎఫ్ షరతులకు అంగీకరిస్తే ఎదురుదెబ్బ తగులుతుందని, ఐఎంఎఫ్ సిఫారసు చేసిన పన్నుల పెంపుదల, సబ్సీడీ కోతలకు వ్యతిరేకంగా పాక్ ప్రభుత్వం పట్టుబట్టింది. అయితే ఐఎంఎఫ్ షరతులు అంగీకరించాల్సిందే లేకపోతే బెయిలౌట్ ప్యాకేజీ కష్టం అని తేల్చి చెప్పింది. విద్యుత్ టారిఫ్ పెంచాలనే కీలక ప్రతిపాదన చేసింది. ఇదే జరిగితే పాకిస్తాన్ ప్రజల్లో ఆక్రోశం కట్టలు తెంచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ కు 7 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ఐఎంఎఫ్ చర్చలు జరుపుతోంది.
ప్రస్తుతం విదేశీ మారకద్రవ్యం నిల్వలు కేవలం 3.1 బిలియన్ డాలర్లు ఉన్నాయి. ఇది కేవలం మూడు వారాల దిగుమతులకే సరిపోతాయి. బుధవారం పాకిస్తాన్ లో ద్రవ్యోల్భనం 48 ఏళ్ల గరిష్టస్థాయికి చేరుకుంది. ప్రజల కనీస అవసరాలు అయిన కూరగాయాలు, పిండి, వంటనూనె, నెయ్యి కొనుగోలు చేసేందుకు ప్రజలు కష్టపడుతున్నారు. విపరీతంగా రేట్లు పెరిగాయి. చెల్లింపులు చేయలేకపోవడంతో కరాచీ పోర్టులో వేలాది షిప్పింగ్ కంటైనర్లలో వస్తువులు అలాగే ఉన్నాయి.
తాజావార్తలు
-
Gold & Silver Prices Today: ఇలా అయితే కొనేదెట్టా.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు..
-
Sanju Samson: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం సంజూనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
-
TheParadise : నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రీమియర్స్ ఎప్పుడంటే?
-
AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం…
-
Siya Goyal: పూణే లోహగడ్ కోట హ*త్య కేసు.. మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయల్.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!