Imran Khan: ‘‘పాకిస్తాన్లో ఈవీఎంలు ఉంటే’’.. ఎన్నికలపై ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: ఫిబ్రవరిలో దాయాది దేశం పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల ఓటమి కోసం చాలా చోట్ల రిగ్గింగ్కి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, తాజాగా వీటిపై ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం)లు ఉంటే రిగ్గింగ్ సమస్యల్నీ గంటలో పరిష్కారమయ్యేవని ఆయన అన్నారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ అడియాలా జైలులో మీడియాతో మాట్లాడుతూ ఈవ్యాఖ్యలు చేశారు.
Read Also: Afghanistan: ఆఫ్ఘాన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-ట్యాంకర్ ఢీ.. 21 మంది మృతి..
Also Read
- Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
- Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
- America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
- India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
పాకిస్తాన్ ఎన్నికల సంఘం, కొన్ని రాజకీయ పార్టీలు ఎలక్ట్రిక్ ఓటింగ్ యాత్రాలను తీసుకురావాలనుకున్న తన ప్రణాళికను నాశనం చేశాయని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల ఆదేశాన్ని దొంగిలించిన అధికారులపై దేశద్రోహ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీ ఎన్నికల్లో 30 మిలియన్ల ఓట్లను సాధించిందని, మిగిలిన 17 రాజకీయ పార్టీలు ఉమ్మడిగా ఇదే సంఖ్యలో ఓట్లు సాధించాయని ఆయన అన్నారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తోషఖానా, అల్-ఖాదిర్ ట్రస్ట్ వంటి అవినీతి కేసుల్లో జైలులో ఉన్నారు. ఎన్నికల ముందు సైన్యం ఇతడిని కావాలనే జైలులో పెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. పీటీఐ పార్టీ చిహ్నం ‘బ్యాట్’ని కుట్రతో తిరస్కరించారు, ప్రజలు ఇచ్చిన ఆదేశాన్ని దొంగిలించడం దేశద్రోహానికి సమానమని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ దేశాన్ని దివాళా అంచును ఉండాడని ఇతర పార్టీలు చేస్తున్న ఆరోపణల్ని కొట్టిపారేశారు. 2018లో నవాజ్ షరీఫ్ పార్టీ 20 బిలియన్ డాలర్ల లోటును మిగిల్చిందని, ఆ సమయంలో ఐఎంఎఫ్ని సంప్రదించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం లేదని, రుణాన్ని చెల్లించగలిగితే, మళ్లీ రుణాలను పొందాలని ఆయన సూచించారు.
తాజావార్తలు
-
Shavukaru Janaki : వెండితెర ‘షావుకారు’ జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
-
Vizag Job Fraud: విశాఖలో కిలాడీ లేడీ.. నిరుద్యోగులకు కుచ్చుటోపీ!
-
Arjun Reedy Ice Scene: ‘ఐస్ వేసుకునే సీన్’ రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
-
Spirit: ‘స్పిరిట్’లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
-
TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!