Imran Khan: ‘‘పాకిస్తాన్లో ఈవీఎంలు ఉంటే’’.. ఎన్నికలపై ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: ఫిబ్రవరిలో దాయాది దేశం పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల ఓటమి కోసం చాలా చోట్ల రిగ్గింగ్కి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, తాజాగా వీటిపై ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం)లు ఉంటే రిగ్గింగ్ సమస్యల్నీ గంటలో పరిష్కారమయ్యేవని ఆయన అన్నారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ అడియాలా జైలులో మీడియాతో మాట్లాడుతూ ఈవ్యాఖ్యలు చేశారు.
Read Also: Afghanistan: ఆఫ్ఘాన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-ట్యాంకర్ ఢీ.. 21 మంది మృతి..
Also Read
- US Passport Ranking: అగ్రరాజ్యానికి ఊహించని దెబ్బ.. యూఎస్ పాస్పోర్ట్ పవర్ తగ్గిందా? భారత్ ర్యాంక్ చూస్తే ఆశ్చర్యపోతారు!
- Pakistan: పక్క దేశంలో అసలేం జరుగుతోంది? పాకిస్థాన్లో పాలకులకు ఆర్మీతో పడట్లేదా?
- Trump Immigration: ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికా నుంచి ఇప్పటి వరకు ఎంత మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యారంటే!
- PM Modi: యూకే కొత్త ప్రధానికి మోడీ ఫోన్.. ఏం మాట్లాడారంటే!
పాకిస్తాన్ ఎన్నికల సంఘం, కొన్ని రాజకీయ పార్టీలు ఎలక్ట్రిక్ ఓటింగ్ యాత్రాలను తీసుకురావాలనుకున్న తన ప్రణాళికను నాశనం చేశాయని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల ఆదేశాన్ని దొంగిలించిన అధికారులపై దేశద్రోహ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీ ఎన్నికల్లో 30 మిలియన్ల ఓట్లను సాధించిందని, మిగిలిన 17 రాజకీయ పార్టీలు ఉమ్మడిగా ఇదే సంఖ్యలో ఓట్లు సాధించాయని ఆయన అన్నారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తోషఖానా, అల్-ఖాదిర్ ట్రస్ట్ వంటి అవినీతి కేసుల్లో జైలులో ఉన్నారు. ఎన్నికల ముందు సైన్యం ఇతడిని కావాలనే జైలులో పెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. పీటీఐ పార్టీ చిహ్నం ‘బ్యాట్’ని కుట్రతో తిరస్కరించారు, ప్రజలు ఇచ్చిన ఆదేశాన్ని దొంగిలించడం దేశద్రోహానికి సమానమని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ దేశాన్ని దివాళా అంచును ఉండాడని ఇతర పార్టీలు చేస్తున్న ఆరోపణల్ని కొట్టిపారేశారు. 2018లో నవాజ్ షరీఫ్ పార్టీ 20 బిలియన్ డాలర్ల లోటును మిగిల్చిందని, ఆ సమయంలో ఐఎంఎఫ్ని సంప్రదించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం లేదని, రుణాన్ని చెల్లించగలిగితే, మళ్లీ రుణాలను పొందాలని ఆయన సూచించారు.
తాజావార్తలు
-
Nara Lokesh: భోగాపురం ఎయిర్పోర్ట్ ఏపీకి పవర్ ఇంజిన్.. ‘ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్పోర్టు వచ్చింది’
-
Varun Tej: జై జై బాబు.. కళ్యాణ్ బాబు అంటూ మార్మోగిన ఈవెంట్.. పవన్ కళ్యాణ్పై వరుణ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
Mega158: బర్త్డే స్పెషల్గా ‘మెగా158’ బీహైండ్ ది సీన్స్ వీడియో.. బాబీ కొల్లి విజన్పై మెగా టీమ్ ప్రశంసలు
-
Alluri Sitarama Raju International Airport: ‘ఎర్రబస్సులు కాదు.. ఇప్పుడు ఎయిర్బస్లు తిరుగుతున్నాయి’
-
Parliament protests: హుందాతనం నుంచి హంగామా వైపు.. పార్లమెంట్లో నిరసనల తీరు ఎలా మారింది?
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!