బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. కొత్త ఏడాదిలోనూ అదే దూకుడు కనిపిస్తోంది. గతేడాది మాదిరిగానే పెరగడంతో కొనుగోలుదారులు హడలెత్తిపోతున్నారు. శుభకార్యాలకు బంగారం కొనాలంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఈరోజు తులం గోల్డ్పై రూ.710 పెరగగా.. సిల్వర్ ధర ఉపశమనం కలిగింది. కిలో వెండిపై రూ.3,000 తగ్గింది.
ఇది కూడా చదవండి: Tulsi Gabbard: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసిని ట్రంప్ పక్కన పెట్టారా? ఆ ఫొటోలు ఏం చెబుతున్నాయి?
తులం గోల్డ్పై రూ.710 పెరగగా బులియన్ మార్కెట్లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,710 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.650 పెరగగా రూ.1,27,150 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.530 పెరగగా రూ.1,04,030 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Amit Shah: ఢిల్లీలో అమిత్ షా కార్యాలయం ఎదుట టీఎంసీ ఆందోళన
మొత్తానికి సిల్వర్ ధర శాంతించింది. ఈరోజు కిలో వెండిపై రూ.3,000 తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,49, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,68,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,49, 000 దగ్గర అమ్ముడవుతోంది.