Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News How Pakistanis Are Kidnapping Indians For Ransom From Turkey To Cambodia

kidnapping: టర్కీ నుంచి కంబోడియా వరకు.. డబ్బు కోసం భారతీయులను కిడ్నాప్ చేస్తున్న పాకిస్తానీలు..

Published Date :May 22, 2024 , 8:24 pm
By Venu Goapl Reddy
kidnapping: టర్కీ నుంచి కంబోడియా వరకు.. డబ్బు కోసం భారతీయులను కిడ్నాప్ చేస్తున్న పాకిస్తానీలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

kidnapping: విదేశాల్లో భారతీయులే టార్గెట్‌గా పాకిస్తాన్ జాతీయులు కిడ్నాప్‌కి పాల్పడుతున్నారు. ఆ తర్వాత వారి కుటుంబాలకు ఫోన్ చేసి, విడుదల చేసేందుకు డబ్బును అడుగుతున్నారు. టర్కీ, కంబోడియాల్లో ఇలానే భారతీయులను కిడ్నాప్ చేసి, చివరకు పోలీసులకు చిక్కారు. ఇటీవల టర్కీలో ముగ్గురు పాకిస్తానీ శరణార్థులు భారత వ్యక్తిని కిడ్నాప్ చేసి, రూ. 20 లక్షలు డిమాండ్ చేశారు. ఇక కంబోడియాలో ఇద్దరు పాకిస్తానీయులు, ఇద్దరు భారతీయులను కిడ్నాప్ చేసి మూడు వారాల పాటు బందీలుగా ఉంచారు. ఈ రెండు కేసుల్లో ప్రమేయం ఉన్న పాకిస్తాన్ వ్యక్తుల్ని ఆయా దేశాల పోలీసులు అరెస్ట్ చేశారు.

టర్కీలోని ఎడిర్నే నగరంలో భారతీయుడిని కిడ్నాప్ చేసిన ఆరోపణలపై ముగ్గురు పాకిస్తానీయులను అరెస్ట్ చేసినట్లు టర్కీ పోలీసులు ఆదివారం తెలిపారు. ఇస్తాంబుల్‌లోని ఓ రెస్టారెంట్‌లో చెఫ్‌గా పనిచేస్తున్న రాధాకృష్ణన్‌ని పథకం ప్రకారం ఎడ్రిన్‌కి రప్పించి కిడ్నాప్ చేశారు. అతని కుటుంబం నుంచి రూ.20 లక్షల విమోచన ధనం డిమాండ్ చేశారు.

Also Read

  • Pakistan: ట్రంప్‌ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
  • Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్‌తో సమావేశం
  • Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!
  • Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్‌నకు ఇరాన్ వార్నింగ్

ఇక కంబోడియాలో ఇద్దరు భారతీయ పౌరులను కిడ్నాప్ చేసి మూడు వారాల పాటు నిర్భందించారు. కిడ్నాప్‌కి పాల్పడిన పాకిస్తానీ వ్యక్తులను రాజధాని నమ్ పెన్‌లో అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 25న పాకిస్తానీలు మహ్మద్ సాద్, సుదిత్ కుమార్‌లను కిడ్నాప్ చేయగా.. మే 16న పోలీసులు వీరిని విడిపించారు. వీరి కాళ్లు, చేతులు కట్టేసి దారుణంగా కొట్టారు. పాకిస్తానీలు సబ్‌టైన్ బిన్ నాసిర్, సయ్యద్ అలీ హుస్సేన్‌లు ఇండియన్ రెస్టారెంట్ కోసం స్థలాన్ని చూస్తామని చెప్పి బాధితులను రప్పించి కిడ్నాప్ చేశారు. వారి పాస్‌పోర్టులను కూడా ఎత్తుకెళ్లారు. కిడ్నాప్ తర్వాత వారి కుటుంబాల నుంచి 10 వేలు, 20 వేల డాలర్లను డిమాండ్ చేశారు.

Read Also: Calcutta: హైకోర్టు సంచలన నిర్ణయం.. 2010 తర్వాత నాటి ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు

విదేశాల్లో కిడ్నాపుల్లో పాకిస్తానీయులు:

భారతీయులనే కాకుండా ఇతర దేశాల వారిని కూడా పాకిస్తాన్ వ్యక్తుల డబ్బు కోసం కిడ్నాప్ చేస్తున్నారు. ఇటీవల పలు దేశాల్లో ఇలాంటి ఘటనలు పెరిగాయి. వీటిలో ఆ దేశస్తుల ప్రమేయం ఎక్కువగా ఉంటోంది. ఏప్రిల్ నెలలో ఉద్యోగాల కోసం యూరప్‌కు పంపుతామని ప్రలోభపెట్టి, నలుగురు శ్రీలంక పౌరులను కిడ్నాప్ చేసినందుకు నలుగురు పాకిస్తాన్ జాతీయులను నేపాల్‌లో అరెస్టు చేశారు. నలుగురు శ్రీలంక పౌరుల నుంచి పాకిస్థానీయులు లక్షలాది రూపాయలు వసూలు చేశారు. నేపాల్ పోలీసుల ఖాట్మండు వ్యాలీ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్‌మెంట్ నలుగురు పాకిస్తాన్ జాతీయులను అరెస్టు చేసింది.

2022లో నలుగురు నేపాల్ పౌరులుల్ని ఇస్తాంబుల్‌లో పాకిస్తాన్ ముఠా తుపాకీ చూపించి కిడ్నాప్ చేసింది. తర్వాత వీరిని టర్కీ పోలీసులు విడిపించారు. 2021లో తోటి పాకిస్తానీనే వారు కిడ్నాప్ చేసి విడుదల చేయడానికి 50 వేల యూరోలను డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ నుంచి వచ్చే వారి కోసం టర్కీ వీసా విధానాన్ని కఠినతరం చేసింది. పాకిస్తానీలు తమ దేశానికి రావద్దని ‘పాకిస్తాన్ గెట్ అవుట్’ వంటి హ్యాష్ ట్యాగ్‌లో టర్కీ యువత సోషల్ మీడియాలో ప్రచారం చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Cambodia
  • Indians
  • kidnapping Incidents
  • Pakistan
  • Ransom

తాజావార్తలు

  • UGC Net: యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..

  • Pakistan: ట్రంప్‌ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..

  • OTT Movies : థియేటర్స్‌లో చిన్న చిత్రాలు.. దెబ్బ కొడుతున్న ఓటీటీ సినిమాలు

  • Riyan Parag: బిగ్ షాక్.. రియాన్ పరాగ్‌పై తీవ్ర చర్యలు.. ఊహించని విధంగా..

  • Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions