Bangladesh: బంగ్లాదేశ్లో మరో హిందూ ఆటోడ్రైవర్ హత్య..
- బంగ్లాదేశ్లో మరో హిందువు హత్య..
- ఆటోడ్రైవర్ను కొట్టి చంపిదన దుండగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్లో హిందువుల హత్యలు ఆగడం లేదు. మరో హిందూ యువకుడిని కొట్టి చంపారు. ఆటోడ్రైవర్ అయిన 28 ఏళ్ల సమీర్ కుమార్ దాస్ను పథకం ప్రకారం కొట్టి చంపినట్లు తేలుస్తోంది. ఈ ఘటన ఆదివారం రాత్రి చిట్టగాంగ్లోని దగన్భూయాన్లో జరిగింది. దాడి చేసిన దుండగులు మొదట దాస్ను కొట్టి, ఆపై కత్తితో పొడిచి చంపారు. దీని తర్వా ఆతడి ఈ-ఆటో రిక్షాతో పారిపోయారు. ఇది ముందస్తు పథకం ప్రకారం జరిగిన హత్య అని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు నిందితుల్ని గుర్తించేందుకు ఆపరేషన్ ప్రారంభించారు.
Read Also: Municipal Elections: మున్సిపల్ ఓటర్లు 51,92,220 మంది.. తుది జాబితా విడుదల చేసిన ఈసీ..
Also Read
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
- H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- China: "మనం శత్రువులం కాము".. భారత్కు చైనా సందేశం..
దేశవ్యాప్తంగా మైనారిటీలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి హిందువులు, బౌద్ధులు, క్రిస్టియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైమన్సింగ్ నగరంలో దీపుచంద్ర దాస్ హత్యతో మొదలైన ఈ మారణకాండకు అడ్డుకట్టపడటం లేదు. గడిచిన 40 రోజుల్లో 10 మందికి పైగా హిందువుల హత్యలకు గురయ్యారు. బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్య మండలి, దేశవ్యాప్తంగా మైనారిటీ వర్గాలపై పెరుగుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న తరుణంలో మైనారిటీలపై హింసాత్మక దాడులు ఎక్కువయ్యాయి.
బంగ్లాదేశ్ పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మైనారిటీల పట్ల బంగ్లా తీరును భారత్ తీవ్రంగా విమర్శిస్తోంది. బంగ్లా తాత్కాలిక దేశాధినేత మహ్మద్ యూనస్ ఈ మారుణకాండను అడ్డుకోవడం లేదు. పైగా భారత్ వీటిని ఎక్కువ చేసి చూపిస్తోందని యూనస్ ఆరోపిస్తున్నాడు. “బంగ్లాదేశ్లోని తీవ్రవాదులు మైనారిటీలపై, వారి ఇళ్ళు, సంస్థలు, వ్యాపార సంస్థలపై ఆందోళనకరమైన దాడులను మేము చూస్తూనే ఉన్నాము. ఇటువంటి మత సంఘటనలను త్వరగా మరియు దృఢంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం అన్నారు.
తాజావార్తలు
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Vaibhav Sooryavanshi: అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్!
-
Peddi Collections : 300 కోట్లకు చేరువలో… వర్కింగ్ డేలో ‘పెద్ది’ కలెక్షన్ల ఊచకోత
-
NANI : ప్యారడైజ్ ఆగస్టు రిలీజ్ పోస్ట్ పోన్.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!