Hassan Nasrallah: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం.. ఇజ్రాయిల్ ఆర్మీ కన్ఫార్మ్..
- హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఖతం..
- ప్రకటించిన ఇజ్రాయిల్ ఆర్మీ..
- బీరూట్ వైమానిక దాడుల్లో చనిపోయినట్లు ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hassan Nasrallah: హిజ్బుల్లాను చావు దెబ్బ తీసింది ఇజ్రాయిల్. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా బీరూట్పై జరిగిన వైమానికి దాడుల్లో మరణించినట్లు ఇజ్రాయిల్ మిలిటరీ ఈ రోజు తెలిపింది. శుక్రవారం రాత్రి జరిగిన దాడుల తర్వాత నస్రల్లాలో కమ్యూనికేషన్ పూర్తిగా నిలిచిపోయినట్లు ఆ సంస్థ మూలాలు వెల్లడించాయి. “హసన్ నస్రల్లా చనిపోయాడు” అని మిలటరీ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నదవ్ శోషని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇజ్రాయిల్ నిర్వహించిన దాడులు దక్షిణ లెబనాన్లోని డజన్ల కొద్దీ హిజ్బుల్లా స్థావరాలనున లక్ష్యంగా చేసుకున్నాయి. హిజ్బుల్లాకు బలమైన కోటలుగా ఉన్న స్థావరాలపై ఇజ్రాయిల్ విరుచుకుపడింది.
Read Also: Firecracker Factory Blast: అక్రమ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
‘‘హసన్ నస్రల్లా ఇకపై ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేయలేరు’’ అని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఒక ప్రకటనలో వెల్లడించింది. “ఇది మా టూల్బాక్స్ ముగింపు కాదు. సందేశం చాలా సులభం, ఇజ్రాయెల్ పౌరులను బెదిరించే ఎవరైనా — వారిని ఎలా చేరుకోవాలో మాకు తెలుస్తుంది” అని లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి ఒక ప్రకటనలో తెలిపారు. అంతకుముందు దాడుల్లో నస్రల్లా కుమార్తె జైనాబ్ దక్షిణ బీరూట్లోని హిజ్బుల్లా స్థావరంలో ఉండగా, వైమానిక దాడుల్లో మరనించారని ఇజ్రాయిల్ మీడియా పేర్కొంది.
ఇదిలా ఉంటే, 2006లో కూడా లెబనాన్పై దాడుల్లో నస్రల్లా మరణించినట్లు పుకార్లు వచ్చాయి. అయితే కొన్ని రోజుల తర్వాత ఆయన మళ్లీ కనిపించారు. మరోవైపు హిజ్బుల్లా కీలక వ్యవస్థలను ఇజ్రాయిల్ దాదాపుగా దెబ్బతీసింది. నస్రల్లా తర్వాత కింది స్థాయిలో ఉన్న కమాండర్లను ఒక్కొక్కరిగా హతమార్చింది. ఫువాద్ షుక్ర్, ఇజ్రహీం అకిల్ వంటి వారిని చంపేసింది. ప్రస్తుతం నస్రల్లా చనిపోతే దాదాపుగా హిజ్బుల్లా అంతమైనట్లే. గత 10 రోజుల నుంచి ఇజ్రాయిల్ లెబనాన్పై జరిపిన దాడుల్లో దాదాపుగా 700 మంది మరణించారు. 118000 మంది నిరాశ్రయులయ్యారు.
తాజావార్తలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!