Hezbollah: ఇజ్రాయిల్ 2 నిమిషాల్లో 5000 మందిని చంపాలనుకుంది.. ఈ దాడి మాకు ‘‘భారీ దెబ్బ’’..
- 2 నిమిషాల్లో 5 వేల మందిని చంపాలని ఇజ్రాయిల్ ప్లాన్..
- ఈ దాడులు మాకు ‘‘భారీ దెబ్బ’’..
- ఇజ్రాయిల్పై తప్పకుండా ప్రతీకారం ఉంటుంది..
- హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hezbollah: లెబనాన్లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దాడితో తమ హిజ్బుల్లా గ్రూప్ ‘‘అపూర్వమైన’’ దెబ్బకు గురైందని, హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా చివరకు అంగీకరించారు. రెండు రోజుల క్రితం లెబనాన్ వ్యాప్తంగా హిజ్బుల్లా కార్యకర్తలు, మద్దతుదారులు కమ్యూనికేషన్ కోసం వాడుతున్న పేజర్లు పెద్ద ఎత్తున పేలిపోయాయి. లెబనాన్ వ్యాప్తంగా 5000కి పైగా పేజర్లు పేలినట్లు తెలుస్తోంది. ఈ పేలుళ్లలో 37 మంది చనిపోవడంతో పాటు 3000 మంది గాయపడ్డారు. అయితే, ఈ దాడులు ఇజ్రాయిల్ పనే అని, దీని వెనక మొసాద్ హస్తం ఉందని హిజ్బుల్లాతో పాటు దానికి మద్దతు ఇచ్చే ఇరాన్ కూడా ఆరోపించింది. మరోవైపు ఈ దాడులు తామే చేసినట్లు ఇజ్రాయిల్ ఎక్కడా చెప్పుకోలేదు.
Read Also: Namo Drone Didi Scheme: మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.8 లక్షల ప్రయోజనం!
Also Read
- Hellfire Missile Explained: అమెరికా సీక్రెట్ వెపన్.. టార్గెట్ ఫిక్స్ చేసి కొడితే శత్రు నౌకల గుండెలు పేలాల్సిందే!
- Trump Tariff Cut: ట్రంప్ కీలక నిర్ణయం.. టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు.. ఈ రంగాలకు ప్రయోజనం
- Operation Checkmate: ‘ఆపరేషన్ చెక్మేట్’లో 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లు అరెస్ట్.. అమెరికా నుంచి బహిష్కరణకు సిద్ధం
- Bab el-Mandeb Strait: ప్రపంచానికి ఇంధన షాక్?.. హార్మూజ్ తర్వాత మరో కీలక జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిక
లెబనాన్ వ్యాప్తంగా మంగళవారం, బుధవారం జరిగిన దాడులు ఆ దేశ ప్రజల్లో భయాందోళన రేకెత్తించాయి. చివరకు ఏ ఎలక్ట్రానిక్ డివైజ్ని అయినా అనుమానంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ దాడుల హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మాట్లాడుతూ… ఇజ్రాయిల్పై తప్పకుండా ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు. ఈ దాడుల్ని ‘‘యుద్ధ చర్య’’గా అభివర్ణించారు. ఇజ్రాయిల్పై కఠినమైన ప్రతీకారం ఉంటుందని, న్యాయమైన శిక్షను ఎదుర్కొంటుందని ఆయన అన్నారు. ఈ దాడులు ఒక ‘‘ఊచకోత’’ అని యుద్ధ నేరమని లేదా యుద్ధ ప్రకటన కావచ్చని చెప్పాడు. ఇజ్రాయిల్ 2 నిమిషాల్లో 5 వేల మందిని చంపాలన ప్లాన్ చేసిందని ఆరోపించారు. గాజాలో కాల్పుల విరమణ కుదిరే వరకు ఇజ్రాయెల్పై హిజ్బుల్లా పోరాటాన్ని కొనసాగిస్తానని నస్రల్లా ప్రమాణం చేశాడు.
తాజావార్తలు
-
KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
-
Mystery Crime Thriller OTT : కంటైనర్లో ఒంటరి మహిళ.. ఓటీటీలోకి మైండ్ బెండ్ చేసే మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Congress: సంచలన నిర్ణయాలు దిశగా కాంగ్రెస్.. భారీ నాయకత్వ మార్పుల వైపు అడుగులు?
-
Housing Loan: అలెర్ట్..అలెర్ట్.. హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొంటున్నారా? ఆర్థిక నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!