Hilarious Plan: కోహినూర్ వజ్రం భారత్కు రావాలంటే ఇదే దారి..! పీఎం కిడ్నాప్ ప్లాన్ చేసిన వ్యాపారవేత్త..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ సంపద కోహినూర్ డైమండ్ ఇప్పుడు యూకేలో ఉన్న విషయం తెలిసిందే.. కోహినూర్ను భారత్కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయనే వార్తలు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం.. అయితే, ఇంత కాలం ఓ లెక్క.. ఇప్పుడు ఒక లెక్క అంటున్నారు. ఎందుకంటే.. భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఈ సమయంలోనే అది సాధ్యం అంటున్నారు. అయితే, బ్రిటన్ పీఎం రిషి సునాక్.. టీమిండియా మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రాకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని.. ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది.. ఇద్దరి ఫొటోలను షేర్ చేస్తూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.. రిషి సునాక్- నెహ్రా దాదాపుగా ఒకేలా ఉండటం.. హావభావాలు, ఒడ్డు పొడుగు ముఖ కవళికలు.. దాదాపు ఒకేలా ఉండటం.. ఇద్దరి వయస్సు కూడా దగ్గరగానే ఉన్నాయి.. అయితే, కోహినూర్ను భారత్కు తప్పించేందుకు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా కిడ్నాప్ ప్లాన్ చేశారు..
Read Also: Elon Musk: ఎలాన్ మస్క్ ఇక ట్విట్టర్ చీఫ్..! ఆఫీసులోకి ఇలా ఎంట్రీ ఇచ్చాడేంటి..
Also Read
- Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
- Donald Trump: 'మీరు వైట్ హౌస్ యజమాని కాదు'.. ట్రంప్కు అమెరికా కోర్టు బిగ్ షాక్..
- Doctors Continue Surgery: హ్యాట్సాఫ్.. భూకంపం వణికించినా.. పేషెంట్ ప్రాణాల కోసం కదలని వైద్యులు! వీడియో వైరల్..
వ్యాపారవేత్త హర్ష గోయెంకా కిడ్నాప్ ప్లాన్ చేయడం ఏంటి? ఎవరిని కిడ్నాప్ చేస్తే కోహినూర్ వజ్రం భారత్కు వస్తుంది.. అనే విషయాల్లోకి వెళ్తే.. యూకే ప్రధాని రిషి సునాక్ను మొదట భారత్కు రప్పించాలి.. బెంగళూరులో తన మామగారైన (ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి) కుటుంబాన్ని చూసేందుకు వచ్చి ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు.. ఆయన్ను కిడ్నాప్ చేయాలని.. అప్పుడు బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ స్థానంలో ఆశిష్ నెహ్రాను పంపాలన్నారు.. ఆ తేడా ఎవరూ గమనించలేరు.. కోహినూర్ వజ్రాన్ని వెనక్కి రప్పించే బిల్లును వెంటనే ఆమోదించమని నెహ్రాకు సూచించాలని.. అలా కోహినూర్ వజ్రం భారత్కు తీసుకురావొచ్చు అనే కోణంలో ఎమోజీలను షేర్ చేశారు హర్ష గోయెంకా.. మొత్తంగా.. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారిపోయింది..
కోహినూర్ను తిరిగి పొందాలని నా స్నేహితుడి ఆలోచన అంటూ వరుసగా నాలుగు పాయింట్లను సూచించారు
1. రిషి సునాక్ని భారతదేశానికి ఆహ్వానించండి..
2. అతను తన అత్తమామల కోసం బెంగళూరు ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు అతన్ని కిడ్నాప్ చేయండి.
3. బదులుగా ఆశిష్ నెహ్రాను యూకే ప్రధానిగా పంపండి. దానిని ఎవరూ గ్రహించలేరు.
4. కోహినూర్ను తిరిగి ఇచ్చే బిల్లును పాస్ చేయమని నెహ్రాకు చెబుతారు. అంటూ పాయింట్లు రాసుకొచ్చారు.
My friend’s idea to get back #Kohinoor:
1. Invite #RishiSunak to India
2. Kidnap him when he is stuck in Bangalore traffic to visit his in-laws
3. Send instead Ashish Nehra as UK PM. No one will realise it.
4. Nehra will be told to pass the bill to return Kohinoor💎 in 🇮🇳! 😀😀
— Harsh Goenka (@hvgoenka) October 25, 2022
తాజావార్తలు
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
-
Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
-
Trivikram: త్రివిక్రమ్తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!