Hilarious Plan: కోహినూర్ వజ్రం భారత్కు రావాలంటే ఇదే దారి..! పీఎం కిడ్నాప్ ప్లాన్ చేసిన వ్యాపారవేత్త..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ సంపద కోహినూర్ డైమండ్ ఇప్పుడు యూకేలో ఉన్న విషయం తెలిసిందే.. కోహినూర్ను భారత్కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయనే వార్తలు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం.. అయితే, ఇంత కాలం ఓ లెక్క.. ఇప్పుడు ఒక లెక్క అంటున్నారు. ఎందుకంటే.. భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఈ సమయంలోనే అది సాధ్యం అంటున్నారు. అయితే, బ్రిటన్ పీఎం రిషి సునాక్.. టీమిండియా మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రాకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని.. ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది.. ఇద్దరి ఫొటోలను షేర్ చేస్తూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.. రిషి సునాక్- నెహ్రా దాదాపుగా ఒకేలా ఉండటం.. హావభావాలు, ఒడ్డు పొడుగు ముఖ కవళికలు.. దాదాపు ఒకేలా ఉండటం.. ఇద్దరి వయస్సు కూడా దగ్గరగానే ఉన్నాయి.. అయితే, కోహినూర్ను భారత్కు తప్పించేందుకు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా కిడ్నాప్ ప్లాన్ చేశారు..
Read Also: Elon Musk: ఎలాన్ మస్క్ ఇక ట్విట్టర్ చీఫ్..! ఆఫీసులోకి ఇలా ఎంట్రీ ఇచ్చాడేంటి..
Also Read
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
- US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
- PM Modi: కాశీ-రోమ్ శాశ్వతనగరాలు.. సంబంధాలు కూడా అంతే గొప్పవన్న మోడీ
- Iran Warning: ఇప్పటిదాకా పూర్తి శక్తిని ఉపయోగించలేదు.. ఈసారి వేరే లెవల్లో ఉంటుంది.. ఇరాన్ తాజా వార్నింగ్
వ్యాపారవేత్త హర్ష గోయెంకా కిడ్నాప్ ప్లాన్ చేయడం ఏంటి? ఎవరిని కిడ్నాప్ చేస్తే కోహినూర్ వజ్రం భారత్కు వస్తుంది.. అనే విషయాల్లోకి వెళ్తే.. యూకే ప్రధాని రిషి సునాక్ను మొదట భారత్కు రప్పించాలి.. బెంగళూరులో తన మామగారైన (ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి) కుటుంబాన్ని చూసేందుకు వచ్చి ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు.. ఆయన్ను కిడ్నాప్ చేయాలని.. అప్పుడు బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ స్థానంలో ఆశిష్ నెహ్రాను పంపాలన్నారు.. ఆ తేడా ఎవరూ గమనించలేరు.. కోహినూర్ వజ్రాన్ని వెనక్కి రప్పించే బిల్లును వెంటనే ఆమోదించమని నెహ్రాకు సూచించాలని.. అలా కోహినూర్ వజ్రం భారత్కు తీసుకురావొచ్చు అనే కోణంలో ఎమోజీలను షేర్ చేశారు హర్ష గోయెంకా.. మొత్తంగా.. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారిపోయింది..
కోహినూర్ను తిరిగి పొందాలని నా స్నేహితుడి ఆలోచన అంటూ వరుసగా నాలుగు పాయింట్లను సూచించారు
1. రిషి సునాక్ని భారతదేశానికి ఆహ్వానించండి..
2. అతను తన అత్తమామల కోసం బెంగళూరు ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు అతన్ని కిడ్నాప్ చేయండి.
3. బదులుగా ఆశిష్ నెహ్రాను యూకే ప్రధానిగా పంపండి. దానిని ఎవరూ గ్రహించలేరు.
4. కోహినూర్ను తిరిగి ఇచ్చే బిల్లును పాస్ చేయమని నెహ్రాకు చెబుతారు. అంటూ పాయింట్లు రాసుకొచ్చారు.
My friend’s idea to get back #Kohinoor:
1. Invite #RishiSunak to India
2. Kidnap him when he is stuck in Bangalore traffic to visit his in-laws
3. Send instead Ashish Nehra as UK PM. No one will realise it.
4. Nehra will be told to pass the bill to return Kohinoor💎 in 🇮🇳! 😀😀
— Harsh Goenka (@hvgoenka) October 25, 2022
తాజావార్తలు
-
Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
-
Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
-
Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
-
Lenovo Legion Y900: కొత్త టాబ్లెట్ లెనోవో లెజియన్ Y900 విడుదల..144Hz డిస్ప్లే, 12,700mAh బ్యాటరీ
-
US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!