Bangladesh Temple: బంగ్లాదేశ్లో ప్రధాని మోడీ బహుమతిగా ఇచ్చిన కాళీ దేవి కిరీటం చోరీ..
- బంగ్లాదేశ్ లో దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జెషోరేశ్వరి కాళీ ఆలయంలో చోరీ..
- చోరికి గురైన భారత ప్రధాని మోడీ బహుమతిగా ఇచ్చిన బంగారు కిరీటం..
- ఈ బంగారు కిరీటం కోసం గాలిస్తున్న బంగ్లాదేశ్ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Temple: బంగ్లాదేశ్ వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాల ఘనంగా కొనసాగుతున్నాయి. దుర్గాపూజ సందర్భంగా బంగ్లాలో 4 రోజుల పాటు అక్కడి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అయితే, మరోవైపు బంగ్లాదేశ్లోని సత్ఖిరా నగరంలోని శ్యామ్నగర్లో ఉన్న ప్రసిద్ధ జెషోరేశ్వరి కాళీ ఆలయంలోని బంగారు కిరీటం అపహరణకు గురైంది. ఈ ఘటన ఆలయంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అందులో ఓ యువకుడు బంగారు కిరీటం తీసుకెళ్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి.
Read Also: UBIT Coin Case: యూబిట్ కాయిన్ కేసు పై ఈడీ నజర్.. నిర్మల్ పోలీసులకు లేఖ..
Also Read
- US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
కాగా, బంగ్లాదేశ్లోని ఈ కాళీ ఆలయ కిరీటంతో ప్రధాని మోడీకి ప్రత్యేక అనుబంధం ఉంది. 2021లో ప్రధాని మోడీ బంగ్లాదేశ్లో పర్యటించినప్పుడు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అంతేకాదు, ఆలయంలోని కాళీమాతకు బంగారు కిరీటాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే, ఇప్పుడు ఆ కిరీటం దుర్గాపూజ ప్రత్యేక సందర్భంలో దొంగతనం చేశారు.
ఇక, ఈ ఆలయంలో దొంగతనం జరిగిన సంఘటన అక్టోబర్ 10వ తేదీ మధ్యాహ్నం 2:50 గంటల మధ్య చోటు చేసుకుంది. ఆలయ పూజారి దిలీప్ కుమార్ బెనర్జీ రోజువారీ పూజను పూర్తి చేసిన తర్వాత దేవాలయానికి తాళాలు దాని నిర్వహణ బాధ్యత రేఖ సర్కార్కు అప్పగించారు. అయితే, ఇతర పనుల్లో నిమగ్నమైన రేఖ సర్కార్.. తిరిగి వచ్చి చూసే వరకు కాళీ మాతకు ధరించిన బంగారు కిరీటం కనిపించలేదు. దీంతో ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు కొనసాగిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఫకర్ తైజుర్ రెహ్మాన్ మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి ఇచ్చిన బహుమతి దొంగిలించారని.. దానిని కనుగొనడానికి ట్రై చేస్తున్నామని తెలిపారు. నిందితుడిని గుర్తించడానికి సీసీటీవి ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం