Bangladesh MP Murder: సెప్టిప్ ట్యాంకులో బంగ్లాదేశ్ ఎంపీ మాంసం.. ఫోరెన్సిక్ విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh MP Murder: బంగ్లాదేశ్ అధికారి పార్టీ ఎంపీ అన్వరుల్ అజీమ్ కోల్కతాలో హత్యకు గురవ్వడం సంచలనంగా మారింది. వైద్య చికిత్స కోసం మే 12 వచ్చిన అతను మే 14 నుంచి కనిపించకుండా పోయారు. తాజాగా ఎక్కడైతే అతను హత్యకు గురయ్యాడని భావిస్తున్నారో, ఆ అపార్ట్మెంట్లోని సెప్టిప్ ట్యాంక్లో మూడున్నర కిలోల మాంసం లభించింది. అన్వరుల్ హసన్ని హత్య చేసి, అతని చర్మాన్ని ఒలిచి, ముక్కలుగా నరికి ప్యాక్ చేసి నగరంలోని పలు ప్రాంతాల్లో పారేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Israel Strike On Rafah: రఫా దాడిలో 21 మంది మృతి.. తమ పని కాదన్న ఇజ్రాయిల్..
Also Read
- PoK: పీఓకేలో రక్తపాతం.. పాక్ బలగాల కాల్పుల్లో ఆరుగురు మృతి
- Modi-Bear Grylls: మోడీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు.. బేర్ గ్రిల్స్ ప్రశంసలు
- Free Afghan Women: ఒక బుర్ఖా.. 1000 ప్రశ్నలు.. ప్రపంచాన్ని కదిలిస్తున్న ట్రెండ్ వెనుక అసలు కథ ఇదే!
- Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
సెప్టిక్ ట్యాంక్లో లభించిన మాంసం మానవుడిదా, అన్వరుల్ శరీర భాగమేనా అని నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ విచారణ చేపట్టినట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎంపీకి సంబంధించిన శరీర భాగాల జాడ కనుగొనబడలేదు. బంగ్లాదేశ్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ చీఫ్ హరున్-ఉర్-రషీద్ దీనిని “కోల్డ్ బ్లడెడ్, అనాగరిక హత్య”గా అభివర్ణించారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి ప్రస్తుతం ఆయన ఇండియాలోనే ఉన్నారు. అన్వరుల్ని హత్య చేసిన వ్యక్తిని బంగ్లాదేశ్కి చెందిన అక్రమ వలసదారుగా గుర్తించారు, కసాయి వృత్తి చేస్తున్నట్లు కనుగొన్నారు. ఈ కేసులో అతడిని విచారిస్తున్నారు. మిగిలిన శరీర భాగాలను కనుగొనేందుకు మురుగు నీటి పైప్ లైన్ని పరిశీలించామని, దీనికి పశ్చిమ బెంగాల్ సీఐడీ సహాయం తీసుకున్నామని రషీద్ చెప్పారు.
ఎంపీకి స్నేహితుడైన అక్తరుజ్జమాన్ అనే అమెరికా సిటిజన్ ఈ హత్య చేయించినట్లు తెలుస్తోంది. అక్తరుజ్జమాన్ దీని కోసం రూ. 5 కోట్లు ఖర్చు చేశాడని, ఇందులో కొంత భాగాన్ని తనకు ఇచ్చినట్లు హత్య చేసిన కసాయి వృత్తిలో ఉన్న జిహాద్ హవ్లాదార్ ఒప్పుకున్నాడు. కోల్కతాలోని న్యూ టౌన్ ప్రాంతంలోని ఒక ఫ్లాట్లో తాను, మరో నలుగురు కలిసి బంగ్లాదేశ్ ఎంపీని హతమార్చినట్లు హవ్లాదార్ ఒప్పుకున్నాడు. అక్తరుజ్జమాన్ ఆదేశాల మేరకే హత్య జరిగిందని వెల్లడించారు. బంగ్లాదేశ్ అధికార షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్ ఎంపీగా ఉన్న అన్వురల్ అజీమ్ అన్వర్ మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
తాజావార్తలు
-
PoK: పీఓకేలో రక్తపాతం.. పాక్ బలగాల కాల్పుల్లో ఆరుగురు మృతి
-
Viral Video: అమ్మ పెళ్లి చేస్తోందని గుండు చేయించుకున్న అమ్మాయి? వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనట!
-
Gas Burner Cleaning: గ్యాస్ బర్నర్ మంట పసుపు రంగులో వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో క్లీన్..
-
Nag Ashwin: కర్ణుడి పాత్రపై నాగి స్ట్రాంగ్ కౌంటర్లు ఇప్పుడెందుకు?
-
Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆస్తులెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే..!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!