Floods: నేపాల్-చైనా బోర్డర్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన పోలీసులు, 200 వాహనాలు
- నేపాల్-చైనా బోర్డర్లో ఆకస్మిక వరదలు
- కొట్టుకుపోయిన పోలీసులు, 200 వాహనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేపాల్-చైనా సరిహద్దులో ఆకస్మిక వరదలు హడలెత్తించాయి. రసువా జిల్లాలో సరిహద్దుగా ఉన్న భోటేకోషి నది ఒక్కసారిగా ఉప్పొంగింది. దీంతో ఊహించని రీతిలో ప్రళయం సంభవించింది. మిటేరి వంతెన, డ్రై పోర్టు దగ్గర నిలిపి ఉన్న వందలాది వాహనాలు ఒక్కసారిగా కొట్టుకుపోయాయి.
ఇది కూడా చదవండి: Bihar: బీజేపీ నేత ఖేమ్కా హత్య కేసులో కీలక పరిణామం.. నిందితుడు ఎన్కౌంటర్
Also Read
- UK: తదుపరి బ్రిటన్ ప్రధాని రేసులో బర్న్హామ్! భారత్కు లాభమా? నష్టమా?
- Keir Starmer: యూకే ప్రధానమంత్రి పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా..
- Qatar Gas Plant Explosion: గ్యాస్ ప్లాంట్లో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- Microsoft Teams: మైక్రోసాఫ్ట్ టీమ్స్ కొత్త ఫీచర్.. ఉద్యోగి ఎక్కడ ఉన్నాడో ఆటోమేటిక్గా బాస్కి చెప్పేస్తుంది!
చైనా భూభాగంలో ఊహించని రీతిలో కుండపోత వర్షాలు కురిశాయి. అతి భారీ వర్షాలు కురవడంతో మంగళవారం తెల్లవారుజామున సరిహద్దు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. నేపాల్లోని తైమూర్ ప్రాంతంలో అనేక మౌలిక సదుపాయాలు ధ్వంసం అయ్యాయి.
ఇది కూడా చదవండి: Prasanna vs Prashanthi: పీహెచ్డీ పాలిటిక్స్..! నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కలకలం
భోటేకోషి నది వెంబడి ఉన్న కస్టమ్స్ పోర్టులో నిలిపి ఉన్న 200 వాహనాలు కొట్టుకుపోయాయని రసువా చీఫ్ డిస్ట్రిక్ ఆఫీసర్ అర్జున్ పౌడెల్ తెలిపారు. నేపాల్-చైనాను కలిపే వంతెను కొట్టుకుపోయిందని చెప్పారు. ఇక చాలా మంది వ్యాపారులు గల్లంతైనట్లు చెప్పుకొచ్చారు. ఇక నేపాల్కు చెందిన 12 మంది పోలీసులు కూడా గల్లంతైనట్లు సమాచారం. ప్రస్తుతం వాతావరణం ప్రతికూలంగా ఉందని.. పరిస్థితులు శాంతించగానే నేపాల్ సైన్యం సహాయ చర్యలు చేపడుతుందని వెల్లడించారు. ఎంతమంది గల్లంతయ్యారన్న విషయాన్ని ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ విపత్తు సంభవించినట్లు తెలుస్తోంది. అందరూ గాఢ నిద్రలో ఉండగా ఊహించని రీతిలో వరద దూసుకొచ్చింది. ఎంత మంది చనిపోయారన్న విషయం అధికారికంగా ప్రకటించలేదు. వాహనాలతో పాటు ప్రజలు కొట్టుకుపోయారని అధికారులు చెబుతున్నారు.
వరదలకు గల కారణాలను అధికారులు అంచనా వేస్తున్నారు. టిబెటన్ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతోనే నదలు ఉప్పొంగాయని భావిస్తున్నారు. ఇక త్రిశూలి నది ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదికారులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Allu Arjun : సంధ్య థియేటర్ కేసు విచారణలో ట్విస్ట్.. హాజరైన అల్లు అర్జున్
-
UK: తదుపరి బ్రిటన్ ప్రధాని రేసులో బర్న్హామ్! భారత్కు లాభమా? నష్టమా?
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి సినిమా పేరుతో భారీ మోసం.. నిర్మాతల సంచలన ప్రకటన!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Tollywood : నేటివిటీ వదిలేస్తున్న తెలుగు సినిమాలు?
ట్రెండింగ్
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!