Jaishankar: చైనాలో ఎస్.జైశంకర్ పర్యటన.. సానుకూలతను వ్యక్తం చేసిన కేంద్రమంత్రి
- చైనాలో ఎస్.జైశంకర్ పర్యటన
- సానుకూలతను వ్యక్తం చేసిన కేంద్రమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చైనాలో పర్యటిస్తున్నారు. ఐదు సంవత్సరాల తర్వాత తొలిసారిగా చైనా పర్యటనకు వెళ్లిన జైశంకర్.. సోమవారం బీజింగ్లో చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్తో సమావేశం అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాతో బహిరంగ చర్చలకు జైశంకర్ పిలుపునివ్వడం ఆసక్తిరేపుతోంది. ఇప్పటికే రష్యాతో సత్సంబంధాలు ఉన్న దేశాలపై 500 శాతం సుంకాలు విధిస్తామంటూ ట్రంప్ హెచ్చరిస్తు్న్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనాతో భారత్ ప్రత్యక్ష చర్చలు జరపడం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం రష్యాతో చైనా, భారత్ సంబంధాలు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: Stunt Master : షూటింగ్ సమయంలో ప్రమాదం – స్టంట్ మాస్టర్ ఎస్.ఎమ్.రాజు మృతి
Also Read
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
ఇదిలా ఉంటే చైనా పర్యటనపై జైశంకర్ సానుకూలతను వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సంబంధాలు బలపడబోతున్నట్లు తెలిపారు. సానుకూలంగా జరుగుతున్నట్లు జైశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక హాన్ జెంగ్తో జరిగిన సమావేశంలో చైనా షాంఘై సహకార సంస్థ (SCO) అధ్యక్ష పదవికి భారతదేశం మద్దతు వ్యక్తం చేసింది. ఈ మేరకు జైశంకర్ ఎక్స్లో పోస్టు చేశారు. ‘‘ఈరోజు నేను బీజింగ్కు వచ్చిన వెంటనే ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ను కలవడం సంతోషంగా ఉంది. చైనా SCO అధ్యక్ష పదవికి భారతదేశం మద్దతు తెలియజేశాను. ద్వైపాక్షిక సంబంధాలలో మెరుగుదలను గమనించాను. నా పర్యటన సమయంలో జరిగే చర్చలు సానుకూల పథాన్ని కొనసాగిస్తాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశాను.’’ అని పేర్కొన్నారు. గత అక్టోబర్లో కజాన్లో ప్రధాని మోడీ-చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సమావేశం తర్వాత.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు క్రమం క్రమంగా మెరుగుపడుతున్నట్లు కనిపిస్తోంది. ఇక భారతదేశం-చైనా దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయ్యాయని జైశంకర్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: HHVM : హరిహర రైట్స్ వద్దు.. OG రైట్స్ ముద్దు..
ద్వైపాక్షిక సంబంధాలపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిని కూడా జైశంకర్ కలవనున్నారు. జైశంకర్-వాంగ్ యి చివరిసారిగా ఫిబ్రవరిలో జోహన్నెస్బర్గ్లో జరిగిన జీ20 సమావేశంలో కలుసుకున్నారు. ఇక జూలై 15న టియాంజిన్లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) విదేశాంగ మంత్రుల సమావేశానికి కూడా జైశంకర్ హాజరవుతారు.
Pleased to meet Vice President Han Zheng soon after my arrival in Beijing today.
Conveyed India’s support for China’s SCO Presidency.
Noted the improvement in our bilateral ties. And expressed confidence that discussions during my visit will maintain that positive trajectory. pic.twitter.com/F8hXRHVyOE
— Dr. S. Jaishankar (@DrSJaishankar) July 14, 2025
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!