Jaishankar: చైనాలో ఎస్.జైశంకర్ పర్యటన.. సానుకూలతను వ్యక్తం చేసిన కేంద్రమంత్రి
- చైనాలో ఎస్.జైశంకర్ పర్యటన
- సానుకూలతను వ్యక్తం చేసిన కేంద్రమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చైనాలో పర్యటిస్తున్నారు. ఐదు సంవత్సరాల తర్వాత తొలిసారిగా చైనా పర్యటనకు వెళ్లిన జైశంకర్.. సోమవారం బీజింగ్లో చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్తో సమావేశం అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాతో బహిరంగ చర్చలకు జైశంకర్ పిలుపునివ్వడం ఆసక్తిరేపుతోంది. ఇప్పటికే రష్యాతో సత్సంబంధాలు ఉన్న దేశాలపై 500 శాతం సుంకాలు విధిస్తామంటూ ట్రంప్ హెచ్చరిస్తు్న్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనాతో భారత్ ప్రత్యక్ష చర్చలు జరపడం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం రష్యాతో చైనా, భారత్ సంబంధాలు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: Stunt Master : షూటింగ్ సమయంలో ప్రమాదం – స్టంట్ మాస్టర్ ఎస్.ఎమ్.రాజు మృతి
Also Read
- Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
- US-Iran War: 'ట్రంప్ను చంపేస్తాం'.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
- Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
ఇదిలా ఉంటే చైనా పర్యటనపై జైశంకర్ సానుకూలతను వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సంబంధాలు బలపడబోతున్నట్లు తెలిపారు. సానుకూలంగా జరుగుతున్నట్లు జైశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక హాన్ జెంగ్తో జరిగిన సమావేశంలో చైనా షాంఘై సహకార సంస్థ (SCO) అధ్యక్ష పదవికి భారతదేశం మద్దతు వ్యక్తం చేసింది. ఈ మేరకు జైశంకర్ ఎక్స్లో పోస్టు చేశారు. ‘‘ఈరోజు నేను బీజింగ్కు వచ్చిన వెంటనే ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ను కలవడం సంతోషంగా ఉంది. చైనా SCO అధ్యక్ష పదవికి భారతదేశం మద్దతు తెలియజేశాను. ద్వైపాక్షిక సంబంధాలలో మెరుగుదలను గమనించాను. నా పర్యటన సమయంలో జరిగే చర్చలు సానుకూల పథాన్ని కొనసాగిస్తాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశాను.’’ అని పేర్కొన్నారు. గత అక్టోబర్లో కజాన్లో ప్రధాని మోడీ-చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సమావేశం తర్వాత.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు క్రమం క్రమంగా మెరుగుపడుతున్నట్లు కనిపిస్తోంది. ఇక భారతదేశం-చైనా దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయ్యాయని జైశంకర్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: HHVM : హరిహర రైట్స్ వద్దు.. OG రైట్స్ ముద్దు..
ద్వైపాక్షిక సంబంధాలపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిని కూడా జైశంకర్ కలవనున్నారు. జైశంకర్-వాంగ్ యి చివరిసారిగా ఫిబ్రవరిలో జోహన్నెస్బర్గ్లో జరిగిన జీ20 సమావేశంలో కలుసుకున్నారు. ఇక జూలై 15న టియాంజిన్లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) విదేశాంగ మంత్రుల సమావేశానికి కూడా జైశంకర్ హాజరవుతారు.
Pleased to meet Vice President Han Zheng soon after my arrival in Beijing today.
Conveyed India’s support for China’s SCO Presidency.
Noted the improvement in our bilateral ties. And expressed confidence that discussions during my visit will maintain that positive trajectory. pic.twitter.com/F8hXRHVyOE
— Dr. S. Jaishankar (@DrSJaishankar) July 14, 2025
తాజావార్తలు
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
-
Amen : “గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు”.. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!
-
Parliament Monsoon Session: ‘వందే మాతరం’ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
-
Kajal Aggarwal : సమంత, రకుల్కు కాజల్ అగర్వాల్ సంచలన సవాల్!
-
Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!