5 Years’ Salary As Bonus: ఉద్యోగులకు ఐదేళ్ల జీతం బోనస్గా.. ఇదే కదా బంపరాఫర్ అంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
5 Years’ Salary As Bonus: కొన్ని సంస్థల్లో ఏళ్ల తరబడి బోనస్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంటుంది.. మరి కొన్ని సంస్థలు వారి లాభాలను బట్టి ఉద్యోగులకు ఎప్పటికప్పుడు గుడ్న్యూస్ చెబుతూ.. వారికి తోడుగా ఉంటుంది.. తాజాగా, తైవాన్ షిప్పింగ్ దిగ్గజం ఎవర్గ్రీన్ తన 3100 మంది ఉద్యోగులకు భారీ బోనస్లను అందజేస్తోంది. గత డిసెంబర్లో ఉద్యోగులకు 52 నెలల జీతం వరకు ఇయర్-ఎండ్ బోనస్లతో రివార్డ్ చేసిన తర్వాత, షిప్పింగ్ దిగ్గజం ఇప్పుడు తమ సిబ్బందికి వారి 2022 పనితీరు కోసం మరో 10 నుండి 11 నెలల జీతం విలువైన మిడ్-ఇయర్ బోనస్లను ఇస్తుందని స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది. ఇది 2022కి ఐదు సంవత్సరాల జీతం కంటే బోనస్ ద్వారా వచ్చే మొత్తం ఎక్కువగా కావడం విశేషం.. ఎవర్గ్రీన్ కార్మికుల వ్యక్తిగత పనితీరును బట్టి బోనస్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది.. కంపెనీ భారీ మొత్తంలో $94 మిలియన్లు ఖర్చు చేస్తోంది. ఈ నగదును మిడ్-ఇయర్ బోనస్ల ద్వారా కార్మికులకు అందించనుంది.
Read Also: Beach Corridor Project: బీచ్ కారిడార్ గ్రీన్ బెల్ట్ నిబంధనల్లో మార్పులు.. నోటిఫికేషన్ జారీ
Also Read
- New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
- China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
- Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
కాగా, కరోనా మహమ్మారి సమయంలో సూయిజ్ కెనాల్లో ఎవర్గ్రీన్ సంస్థకు చెందిన భారీ నౌక చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.. దీంతో కొన్ని రోజుల పాటు ఆ మార్గంలో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. అయితే, కరోనా కాలంలో భారీ నష్టాలను ఎదుర్కొన్న సంస్థ ఆ.. తర్వాత మళ్లీ లాభాల బాటపట్టింది.. గత రెండేళ్లుగా 39.92 శాతం మేర లాభాలను ఆర్జిస్తోంది. ఉద్యోగుల కృషిఫలితంగానే ఇంత భారీగా లాభాలు వచ్చాయని భావించని ఆ సంస్థ.. ఉద్యోగుల వ్యక్తిగత పనితీరు ఆధారంగా బోనస్లు ఇస్తుంది.. ఇక, ఎవర్గ్రీన్లో వార్షిక వేతనాలు 29, 545 డాలర్ల నుంచి 114,823 డాలర్ల మధ్య ఉంటాయి. డిసెంబర్ 31, 2022తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఈ వారం రికార్డు స్థాయిలో 14.7 బిలియన్ డాలర్ల నికర లాభాన్ని నమోదు చేసింది . ఇది సంవత్సరానికి 39.82 శాతం పెరుగుదల కావడం విశేషం.. దీంతో.. ఉద్యోగులకు గుడ్న్యూస్ చెబుతూ బంపరాఫర్ ప్రకటించింది.. అయితే, ఐదేళ్ల బోనస్ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఎవర్గ్రీన్ మెరైన్ ఉద్యోగులను చూసి తమ అసూయను వ్యక్తం చేస్తున్నారు.. ఆ సంస్థ ఉదారతపై ప్రశంసలు కురిపిస్తున్నారు..
తాజావార్తలు
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!