జాతీయ వాది చార్లీ కిర్క్ హత్య తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందేనని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. ది కేటీ మిల్లర్ పాడ్కాస్ట్లో మస్క్ మాట్లాడారు. పట్టపగలు చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారని.. అలాంటి తప్పు తాను చేయదల్చుకోలేదన్నారు. అందుకే బహిరంగంగా కనిపించడం లేదని చెప్పుకొచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో సెల్ఫీ ఎందుకు తీసుకోవడం లేదంటే ఇష్టం లేక కాదని.. చార్లీ కిర్క్ హత్య తర్వాత తనలో మార్పు వచ్చిందని.. అలాంటి తప్పు చేయకూడదని చెప్పుకొచ్చారు. అమెరికాను ప్రేమించే సంప్రదాయవాదులు మాత్రమే ఇలా జీవించాల్సి వస్తుందని.. దేశంలో తీవ్రమైన భద్రతా సమస్యలు ఉన్నట్లుగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక నాయకుడు చనిపోతే మళ్లీ పుట్టలేడని.. అందుకే తాను బహిరంగ ప్రదేశాల్లో కనిపించడం మానేసినట్లుగా చెప్పుకొచ్చారు. అప్పటికీ తప్పు చేస్తే మాత్రం కచ్చితంగా చనిపోతారన్నారు. అందుకే తాను అలా చేయడం లేదన్నారు.
సెప్టెంబర్ 10న ఉతా వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. ఈ హత్యను ప్రపంచ దేశాలు ఖండించాయి. ఇక హత్యపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. హత్య వెనుక కుట్ర దాగి ఉందంటూ తాజాగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకోవైపు చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ మాత్రం ఖండిస్తున్నారు.
🔥 WOW. “ITS ONLY REINFORCED
THE SEVERITY OF THE SITUATION. LIFE IS ON HARDCORE MODE. YOU MAKE ONE MISTAKE & YOU’RE DEAD”
– @elonmusk
Elon tells @KatieMiller this regarding why he can’t stop and take a selfie and that it is not because he doesn’t want to…I’m the… pic.twitter.com/wMuTsczye3— Johnny St.Pete (@JohnMcCloy) December 9, 2025
