Ecuador: ఈక్వెడార్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. 15 మంది మృతి
15 killed in Ecuador prison violence: లాటిన్ అమెరికా దేశం ఈక్వెడార్ లోని ఓ జైలులో ఖైదీల మధ్య తీవ్రఘర్షణ చెలరేగింది. ఈక్వెడార్ లోని లటాకుంగాలోని ఓ జైలులో ఖైదీల మధ్య ఘర్షణల కారణంగా 15 మంది ఖైదీలు మరణించారు. ఈ ఘర్షణల కారణంగా మరో 21 మంది గాయపడ్డారు. మాదకద్రవ్యాల రవాణా మార్గాలపై ముఠాల మధ్య ఘర్షణకు కారణమయ్యాయని అధ్యక్షుడు గిల్లెర్మో లాస్సో అన్నారు. ప్రస్తుతం అధికారులు మృతదేశాలను గుర్తించే పనిలో ఉన్నారు. ఇతర ప్రావిన్సుల్లో భద్రతను పెంచామని అధికారులు వెల్లడించారు. మరణించిన వారిలో 14 మంది శవాలను ఆస్పత్రికి తరలించారు.
Read Also: Loan app Harassment: లోన్ యాప్ వేధింపులకు ఐటీ ఉద్యోగి బలి.. రుణం చెల్లించినా ఆగని వేధింపులు
Also Read
- Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
- Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
- Russia Ukraine War: ఉక్రెయిన్పై రష్యా 'మెగా' దాడి.. 666 క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ పుతిన్ సైన్యం!
- Funeral Dance: అంత్యక్రియల్లో అశ్లీల డ్యాన్స్లు.. అవాక్కైన నెటిజన్లు
ఈ ఏడాది ఈక్వెడార్ లోని పలు జైళ్లలో జరిగిన ఘర్షణల కారణంగా 316 మంది ఖైదీలు మరణించారు. జూలైలో శాంటా డొమింగోలోని జైలులో ఇలాగే ఖైదీల మధ్య ఘర్షణలు తలెత్తాయి. దీంట్లో 13 మంది ఖైదీలు మరణించారు. మేలో ఇదే జైలులో జరిగిన హింసాత్మక దాడుల్లో 43 మంది మరణించారు. ఈక్వెడార్ జైలు వ్యవస్థను ప్రభుత్వం నిలిపివేయడంతో పాటు సమగ్ర విధానం లేకపోవడంతో ఖైదీలు అధ్వాన్న పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఇంటర్-అమెరికన్ కమీషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది. అధికారిక గణాంకాల ప్రకారం.. ఈక్వెడార్ జైళ్లలో మొత్తం 33,500 మంది ఉన్నారని.. ఇది జైళ్ల గరిష్ట సామర్థ్యం కన్నా 11.3 శాతం అని పేర్కొంది.
లాటిన్ అమెరికాలోని పలు దేశాల మాదకద్రవ్యాల మాఫియా ముఠాలకు కేంద్రంగా ఉన్నాయి. మెక్సికో, ఈక్వెడార్, కొలంబియా, గ్వాటేమాల, ఎల్ సాల్విడార్, పూర్టోరికో, పెరూ వంటి దేశాల్లో డ్రగ్స్ ను ప్రపంచవ్యాప్తంగా సప్లై చేస్తున్నాయి. బ్రెజిల్ లోని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కొకైన్ డ్రగ్స్ ఉత్పత్తికి అడ్డాగా ఉంది. దక్షిణ అమెరికా దేశాల నుంచి యూఎస్ఏకు పెద్ద ఎత్తున మాదకద్రవ్యాల్ని సరఫరా చేస్తుంటారు స్మగ్లర్లు. ఎప్పటికప్పుడు అక్కడి ప్రభుత్వాలు ఈ డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేస్తుంటారు. అయితే జైళ్లలో ఉన్న ఈ ముఠాల మధ్య ఆధిపత్య పోరు కారణంగా తరుచు హింసాత్మక సంఘటనలు జరుగుతుంటాయి. ఈ ఘటనల్లో ఖైదీలు మరణిస్తుంటారు.
తాజావార్తలు
-
Mercedes CLA EV: భారత్ లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ CLA EV.. 792 km రేంజ్, 800V ఫాస్ట్ ఛార్జింగ్ – పూర్తి వివరాలు
-
Karimnagar : కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై ఓవరాక్షన్.. సెలూన్ వర్కర్ పై దాడి
-
Anna Hazare: ‘‘ఆత్మపరిశీలన చేసుకోవాలి’’.. ఆప్పై అన్నాహజారే కీలక వ్యాఖ్యలు..
-
Love Marriage: ప్రేమ, పెళ్లి, వేధింపులు.. చివరకు బిడ్డ మృతి.. బాధితురాలి ఆవేదన వర్ణనాతీతం..
-
Six Sigma Health Care Group: సెల్ హెల్త్ క్లినిక్ కు.. సిక్స్ సిగ్మా హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డ్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!