Afghan-Pak War: ఆఫ్ఘాన్-పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత.. సాధారణ పౌరులపై పాక్ దాడులు..
- ఆఫ్ఘాన్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత..
- సరిహద్దుల వద్ద భారీగా కాల్పులు..
- 12 మంది ఆఫ్ఘాన్ పౌరులు మృతి..
- పాక్ పోస్టుల్ని స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు..
Afghan-Pak War: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కుమ్ముకున్నాయి. కుర్రం జిల్లాలో పాకిస్తాన్ దళాలు, ఆఫ్ఘాన్ తాలిబాన్ల మధ్య మంగళవారం రాత్రి మరోసారి దాడులు ప్రతి దాడులు జరిగాయి. పాకిస్తాన్ ఆర్మీ తమ 23 మంది సైనికులు మరణించినట్లు, 200 మందికి పైగా తాలిబాన్లను చంపినట్లు చెప్పింది. ఇదిలా ఉంటే కాందహార్ ప్రావిన్సులోని స్పిల్ బోల్డాక్ జిల్లాలో పాకిస్తాన్ దళాలు దాడులకు తెగబడ్డాయి. ఈ దాడుల్లో 12 మంది ఆఫ్ఘాన్ సాధారణ పౌరులు మరణించారు. 100 మందికి పైగా గాయాలపాలయ్యారని తాలిబాన్ అధికారులు చెప్పారు. దీంతో ప్రతీకార దాడులు చేసి, పాకిస్తాన్ సైనిక స్థావరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆఫ్ఘన్ దళాలు ప్రకటించాయి.
Read Also: Tamil Nadu: హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. ఎన్నికల ముందు డీఎంకే “భాషా” సెంటిమెంట్
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- Putin - Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా 'ఫుల్' సపోర్ట్..!
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ఈ దాడులపై తాలిబాన్ అధికార ప్రతినిధి జబిబుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. పాక్ దళాలు సాధారణ పైరులపై దాడులు చేశాయని, ఆఫ్ఘాన్ దళాల ప్రతీకార చర్యలో అనేక మంది పాక్ సైనికులు మరణించినట్లు చెప్పారు. 12 మంది చనిపోయినట్లు ఆయన ట్వీట్ చేశారు. ప్రతీకార దాడిలో అనేక పాకిస్తాన్ పోస్టుల్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఈ వారంలో ఇరు వర్గాలు సరిహద్దు వెంబడి కాల్పులు జరుపుతుండటంతో డ్యూరాండ్ లైన్ వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనలో ఉన్న సమయంలోనే, పాకిస్తాన్ ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్పై వైమానిక దాడులు చేసింది. పాక్ తాలిబాన్ లీడర్ టార్గెట్గా దాడులు చేసినట్లు చెప్పింది. ఈ సంఘటన తర్వాత తాలిబాన్ దళాలు పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంటున్నాయి.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!