Arab-Islamic Summit: ఇజ్రాయిల్ అంటే భయమా..? అరబ్- ఇస్లామిక్ నేతల పెద్ద వ్యాఖ్యలు, చర్యలు శూన్యం
- అరబ్-ఇస్లామిక్ సమ్మిట్లో నేతల పెద్ద పెద్ద వ్యాఖ్యలు..
- ఇజ్రాయిల్పై చర్యలు మాత్రం శూన్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arab-Islamic Summit: ఇటీవల హమాస్ అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ ఖతార్ రాజధాని దోహాపై విరుచుకుపడింది. హమాస్ నేతలు సమావేశమైనట్లు భావిస్తున్న భవనంపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ పరిణామాలను అసలు ఖతార్ ఊహించలేదు. ఈ దాడుల్ని పిరికిదాడులుగా అభివర్ణించింది. ఈ దాడులు, గాజాలో ఇజ్రాయిల్ దాడుల తీవ్రత పెంచిన తర్వాత అరబ్-ఇస్లామిక్ నేతల సమాశానికి దోహా వేదికైంది. ప్రపంచం నలుమూల నుంచి వచ్చిన ఇస్లామిక్ దేశాల అధినేతలు ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా పెద్ద పెద్ద కామెంట్స్ చేశారు. టర్కీ, పాకిస్తాన్ వంటి దేశాలు ‘‘అరబ్-ఇస్లామిక్ సైనిక కూటమి’’ని ప్రతిపాదించాయి. ఇది అమెరికన్ నాటో తరహాలో పనిచేయాలని నేతలు కోరారు.
అయితే, పెద్ద పెద్ద మాటలైతే చెప్పారు కానీ ఇజ్రాయిల్పై ఏ ఒక్క దేశం కూడా ఎలాంటి శిక్షాత్మక చర్యలు తీసుకోలేదు. ఇది అనేక ముస్లిం దేశాల్లో నిరాశను రేకెత్తించింది. చివరకు కొన్ని చిన్నపాటి చర్యలు మాత్రమే తీసుకున్నారు. ఇజ్రాయిల్పై అందరూ చర్యలు తీసుకోవాలనే ప్రతిస్పందన వచ్చింది, చివరకు ‘‘పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ తన చర్యల్ని కొనసాగించకుండా నిరోధించడానికి అన్ని చట్టపరమైన , ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాలి’’ అని అన్ని దేశాలు పిలుపునిచ్చాయి.
Also Read
- JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
- Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
- Peacock Mountain: ఇరాన్ పీకాక్స్ మౌంటైన్పై దాడికి ప్లాన్..ఈ అణు కేంద్రంపై అటాక్ జరిగితే అంతే సంగతి!
- Russia Vs Ukraine: 3000కిలోల బరువున్న బాంబును విసిరింది.. యుద్ధంలో గేర్ మార్చిన రష్యా!
Read Also: Wolf Attacks: యూపీలో మళ్లీ మొదలైన తోడేళ్ల దాడి.. ఇద్దరు మృతి, 9 మందికి గాయాలు…
అయితే, ఇజ్రాయిల్పై ఎలాంటి ఆంక్షలు కానీ, చమురు ఆంక్షలు కానీ, దౌత్య సంబంధాలను తగ్గించుకునేందుకు ఏ దేశం కూడా ముందుకు రాలేదు. నిజానికి ‘‘అబ్రహం ఒప్పందం’’ చేసిన దేశాలు ఈ సమావేశంలో మౌనంగా ఉన్నాయి. యూఏఈ, బహ్రెయిన్, మొరాకో వంటి దేశాలు ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా ఎలాంటి ముఖ్యమైన ప్రకటనలు చేయలేదు. గాజాపై ఇజ్రాయిల్ విజృంభిస్తున్న ఈ సమయంలో వీరంతా మౌనంగా ఉండటం గమనార్హం. సోమవారం బహ్రెయిన్, యూఏఈ అబ్రహం ఒప్పందంపై సంతకాలు చేసిన 5 ఏళ్లు పూర్తయయ్యాయి. దీని ద్వారా ఇజ్రాయిల్ను వారు అధికారంగా గుర్తించారు.
అనూహ్యంగా సౌదీ అరేబియా కూడా ఈ వివాదంతో అంటీముట్టనట్లు ఉంది. నిజానికి ఖతార్కు సౌదీకి ముందు నుంచే పడదు. అయినా కూడా ఇజ్రాయిల్ దాడి నేపథ్యంలో సమావేశానికి హాజరైన సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్(ఎంబీఎస్)ఈ సమావేశాన్ని ఉద్దేశించి కనీసం ప్రసంగించలేదు. స్పీకర్ జాబితాలో ఎంబీఎస్ లేకపోవడం సౌదీ అరేబియా జాగ్రత్తకు సంకేతమని, అనవసరంగా మాట్లాడి భౌగోళిక రాజకీయ చిక్కులు తెచ్చుకోవడం ఎందుకు అని భావించవచ్చు.
తాజావార్తలు
-
Sujeeth: సైలెంట్గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
-
Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!