Wolf Attacks: యూపీలో మళ్లీ మొదలైన తోడేళ్ల దాడి.. ఇద్దరు మృతి, 9 మందికి గాయాలు…
- యూపీలో మళ్లీ మొదలైన తోడేళ్ల దాడులు..
- ఇద్దరు మృతి, 9 మందికి గాయాలు..
- వందలాది అధికారుల్ని మోహరించిన ప్రభుత్వం..
- ‘‘ఆపరేషన్ వోల్ఫ్’’ తిరిగి ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wolf Attacks: గతేడాది ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని వరసగా తోడేళ్ల దాడులు వణికించాయి. ముఖ్యంగా బ్రహ్రైచ్ జిల్లాలో పలు గ్రామాల్లో మనుషులే టార్గెట్గా దాడులు చేశాయి. వీటిని పట్టుకునేందుకు యోగి సర్కార్ పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. వందలాది అధికారుల్ని, బలగాలను మోహరించారు. అయితే, మరోసారి తోడేళ్ల దాడులు బహ్రైచ్ని భయపెడుతున్నాయి. తాజాగా, తోడేళ్ల దాడుల్లో ఇద్దరు మరణించగా, 9 మంది గాయపడ్డారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. గత 20 రోజుల్లో మొత్తం 11 దాడులు జరిగాయని అధికారులు గురువారం తెలిపారు.
Read Also: CJI BR Gavai: ‘‘అన్ని మతాలను గౌరవిస్తాను’’.. ‘‘విష్ణువు’’ వ్యాఖ్యలపై సీజేఐ గవాయ్..
Also Read
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- Gen-z Viral Video: మేము "జెన్-జీ" ఏమైనా చేస్తాం అంటే బాగుండదు.. లడఖ్ వైరల్ వీడియోపై సీఎం సెటైర్లు..
తోడేళ్లను ట్రాక్ చేసేందుకు, పట్టుకునేందుకు పోలీస్, అటవీ అధికారులను, ఇతర రాష్ట్రాల నుంచి నిపుణులను రప్పించారు. వీటిని బంధించేందుకు మొత్తం 100 మంది సిబ్బందిని నియమించారు. ఒక కంట్రోల్ రూం ఏర్పాటే చేయడంతో పాటు, సిబ్బందికి థర్మల్ డ్రోన్లు, నైట్ విజన్ కెమెరాలు, కెమెరా ట్రాప్లను అందించారు. గ్రామస్తులు తమను తాము రక్షించుకునేందుకు కర్రలతో పెట్రోలింగ్ చేస్తున్నారు.
సెప్టెంబర్ 09న జ్యోతి అనే నాలుగేళ్ల బాలికను ఒక తోడేలు ఈడ్చుకెళ్లింది. మరుసటి రోజు ఉదయం పాప చనిపోయి కనిపించింది. సెప్టెంబర్ 11న మూడు నెలల బాలిక సంధ్యను ఆమె తల్లి ఒడి నుంచి తోడేలు లాక్కెళ్లింది. ప్రాణాంతక గాయాలతో పసిబిడ్డ చనిపోయింది. అటవీ శాఖ డ్రోన్ల ద్వారా రెండు తోడేళ్లను ట్రాక్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కటి కూడా చిక్కలేదు.
గతేడాది ఇలాగే తోడేళ్ల గుంపు ఈ ప్రాంతంలో 9 మందిని చంపేసింది, చాలా మందిని గాయపరిచాయి. ప్రభుత్వం వీటిని పట్టుకునేందుకు ‘‘ఆపరేషన్ వోల్ఫ్’’ ప్రారంభించింది.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!