PM Modi: భారత్లోనే డిజిటల్ లావాదేవీలు ఎక్కువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: డిజిటల్ లావాదేవీలు భారత దేశంలోనే ఎక్కువగా జరుగుతున్నాయని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దక్షిణాఫ్రికాలోని బ్రిక్స్ దేశాల సదస్సులో ప్రధాన మంత్రి బుధవారం మాట్లాడారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కెల్లా భారతే అత్యధికంగా డిజిటల్ లావాదేవీలు చేస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. ఇండియాలో జరుగుతున్న యూపీఐ సేవలను ప్రధాని ప్రశంసించారు. భారతదేశం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, సాంకేతిక పురోగతి గురించి దక్షిణఫ్రికా (South Africa)లో నిర్వహించిన ‘బ్రిక్స్’ (BRICS) సదస్సులో దేశ ప్రధాని మోదీ (Narendra Modi) మాట్లాడారు. రానున్న కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక భూమిక పోషించనుందని స్పష్టం చేశారు.
Read Also: Software Job: గంట పనికి కోట్లలో జీతం.. ఇదెలా సాధ్యం?
Also Read
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- US-Iran Tensions: "ఆ ఒప్పందం కేవలం ఊహాగానమే".. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఇరాన్!
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చటమే తమ సంకల్పం అని అన్నారు. 15వ బ్రిక్స్ దేశాల వార్షికోత్సవం సందర్భంగా బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ను అభినందించారు. పదేళ్లుగా ఆర్థిక సహకారాన్ని అందించంటంలో బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ పాత్ర కీలకమైనదని తెలిపారు. అనంతరం యూపీఐ (UPI) సేవల గురించి ప్రధాని తెలిపారు. ‘‘ప్రస్తుతం ‘సింగిల్ క్లిక్’ విధానంతో పెద్ద సంఖ్యలో ప్రజలు డిజిటల్ లావాదేవీల్లో పాలుపంచుకుంటున్నారని తెలిపారు. డిజిటల్ లావాదేవీల్లో పారదర్శకత పెరిగి, మధ్యవర్తిత్వం, అవినీతి తగ్గు ముఖం పట్టిందన్నారు. చిన్న దుకాణం నడిపే వారి దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ నిర్వహించే వారి వరకూ అందరూ యూపీఐ సేవల్ని వినియోగిస్తున్నారని తెలిపారు. ప్రపంచ దేశాలన్నింటిల్లో అత్యధికంగా డిజిటల్ లావాదేవీలు చేస్తోన్న దేశం భారత్ అని చెప్పారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), సింగపుర్ (Singapore), ఫ్రాన్స్ (France) దేశాల్లో కూడా ఈ సేవల్ని అందిపుచ్చుకోనున్నట్టు ప్రధాని తెలిపారు. అయితే బ్రిక్స్లోని దేశాలు కూడా ఈ సేవలు వినియోగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు ప్రధాని తెలిపారు. వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి మరియు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించడానికి వస్తువులు మరియు సేవల పన్ను (GST) వంటి సంస్కరణలను తీసుకురావడంలో తమ ప్రభుత్వ రికార్డు గురించి ఆయన మాట్లాడారు. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ప్రజా-సేవ డెలివరీలో మెరుగుదల మరియు అవినీతి తగ్గింపు గురించి కూడా మోడీ ప్రస్తావించారు. UPIలో బ్రిక్స్ దేశాలతో సాధ్యమైన సహకారాన్ని ప్రధాని మోడీ ప్రతిపాదించారు.
తాజావార్తలు
-
Explained: పార్టీ vs ప్రజాబలం.. సొంతవారే వెన్నుపోటు పొడిచిన వేళ.. ఇందిర గాంధీలా మమత హిస్టారికల్ కమ్బ్యాక్ ఇస్తారా?
-
Jailer 2 : జైలర్ 2లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ స్పెషల్ క్యామియో
-
Vaibhav Sooryavanshi: అర్ధరాత్రి 2 గంటలకు గదిలో లేని వైభవ్.. టెన్షన్ పడిపోయిన బుడ్డోడి తల్లి!
-
FIFA World Cup 2026: 16 ఏళ్ల తర్వాత తొలి విజయం.. చెక్ రిపబ్లిక్ పై ‘దక్షిణ కొరియా’ సంచలన విజయం.!
-
Sing Geetham Review : సింగ్ గీతం రివ్యూ.. సింగీతం ప్రయోగం ఎలా ఉందంటే?
ట్రెండింగ్
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!