PM Modi: భారత్లోనే డిజిటల్ లావాదేవీలు ఎక్కువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: డిజిటల్ లావాదేవీలు భారత దేశంలోనే ఎక్కువగా జరుగుతున్నాయని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దక్షిణాఫ్రికాలోని బ్రిక్స్ దేశాల సదస్సులో ప్రధాన మంత్రి బుధవారం మాట్లాడారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కెల్లా భారతే అత్యధికంగా డిజిటల్ లావాదేవీలు చేస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. ఇండియాలో జరుగుతున్న యూపీఐ సేవలను ప్రధాని ప్రశంసించారు. భారతదేశం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, సాంకేతిక పురోగతి గురించి దక్షిణఫ్రికా (South Africa)లో నిర్వహించిన ‘బ్రిక్స్’ (BRICS) సదస్సులో దేశ ప్రధాని మోదీ (Narendra Modi) మాట్లాడారు. రానున్న కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక భూమిక పోషించనుందని స్పష్టం చేశారు.
Read Also: Software Job: గంట పనికి కోట్లలో జీతం.. ఇదెలా సాధ్యం?
Also Read
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చటమే తమ సంకల్పం అని అన్నారు. 15వ బ్రిక్స్ దేశాల వార్షికోత్సవం సందర్భంగా బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ను అభినందించారు. పదేళ్లుగా ఆర్థిక సహకారాన్ని అందించంటంలో బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ పాత్ర కీలకమైనదని తెలిపారు. అనంతరం యూపీఐ (UPI) సేవల గురించి ప్రధాని తెలిపారు. ‘‘ప్రస్తుతం ‘సింగిల్ క్లిక్’ విధానంతో పెద్ద సంఖ్యలో ప్రజలు డిజిటల్ లావాదేవీల్లో పాలుపంచుకుంటున్నారని తెలిపారు. డిజిటల్ లావాదేవీల్లో పారదర్శకత పెరిగి, మధ్యవర్తిత్వం, అవినీతి తగ్గు ముఖం పట్టిందన్నారు. చిన్న దుకాణం నడిపే వారి దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ నిర్వహించే వారి వరకూ అందరూ యూపీఐ సేవల్ని వినియోగిస్తున్నారని తెలిపారు. ప్రపంచ దేశాలన్నింటిల్లో అత్యధికంగా డిజిటల్ లావాదేవీలు చేస్తోన్న దేశం భారత్ అని చెప్పారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), సింగపుర్ (Singapore), ఫ్రాన్స్ (France) దేశాల్లో కూడా ఈ సేవల్ని అందిపుచ్చుకోనున్నట్టు ప్రధాని తెలిపారు. అయితే బ్రిక్స్లోని దేశాలు కూడా ఈ సేవలు వినియోగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు ప్రధాని తెలిపారు. వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి మరియు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించడానికి వస్తువులు మరియు సేవల పన్ను (GST) వంటి సంస్కరణలను తీసుకురావడంలో తమ ప్రభుత్వ రికార్డు గురించి ఆయన మాట్లాడారు. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ప్రజా-సేవ డెలివరీలో మెరుగుదల మరియు అవినీతి తగ్గింపు గురించి కూడా మోడీ ప్రస్తావించారు. UPIలో బ్రిక్స్ దేశాలతో సాధ్యమైన సహకారాన్ని ప్రధాని మోడీ ప్రతిపాదించారు.
తాజావార్తలు
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!