Dalai Lama: చైనాకు తిరిగెళ్లే ప్రసక్తే లేదు.. భారత్లోనే ఉంటా
Dalai Lama Says He Will Not Return To China: తాను చైనాకు తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని, ఇండియాలోనే ఉంటానని బౌద్ధ గురువు దలైలమా సోమవారం స్పష్టం చేశారు. భారత్ను అత్యుత్తమ దేశంగానూ అభివర్ణించిన ఆయన.. హిమాచల్ ప్రదేశ్లోని ‘కాంగ్రా’నే తన శాశ్వత నివాసమని పేర్కొన్నారు. తవాంగ్లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ గురించి ప్రశ్నించగా.. ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. ‘‘యూరప్, ఆఫ్రికా, ఆసియాలతో పాటు చైనాలోనూ పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. అయినప్పటికీ నేను చైనాకు తిరిగి వెళ్లను. భారత్లోనే ఉంటాను, ఇదే ఉత్తమమైన దేశం, కాంగ్రా-పండిట్ నెహ్రూనే నా శాశ్వత నివాసం’’ అంటూ దలైలమా చెప్పుకొచ్చారు.
Taliban Militants: తాలిబన్ల అరాచకం.. పోలీస్ స్టేషన్ని నిర్బంధించి..
Also Read
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
కాగా.. టిబెట్కు చెందిన 14వ దలైలమా 1959 నుంచి హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఉంటున్నారు. 1951లో టిబెట్ను చైనా ఆక్రమించి, అప్పటి నుంచి పాలన కొనసాగించడం మొదలుపెట్టింది. వారి జాతీయ, సాంస్కృతిక గుర్తింపులను, సాంప్రదాయాలను నాశనం చేయడమే లక్ష్యంగా.. చైనా ఈ దురాక్రమణకు దిగింది. అయితే.. చైనా ప్రభుత్వాన్ని తిరిగి వెనక్కు పంపించేందుకు టిబెటన్లు తిరుగుబాటు చేశారు. కానీ.. ఇందులో వాళ్లు విజయం సాధించలేదు. అప్పుడు దలైలమా టిబెట్ని వదిలి, భారత్కి వచ్చేశారు. అలా ఆయన ఇక్కడే సెటిల్ అయిపోయారు.
Kabul Fuel Tanker Blast: ఆఫ్ఘనిస్తాన్లో ఘోరం.. పెట్రోల్ ట్యాంకర్ పేలి, 19 మంది దుర్మరణం
అటు.. లడాఖ్లోని గాల్వాన్లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నాక.. డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ వద్ద ఇరు దేశాల దళాల మధ్య ఘర్షణ జరిగింది. చైనా బలగాలు సరిహద్దు దాటి భారత్లో చొరబడేందుకు ప్రయత్నించగా.. భారత సైనికులు వాళ్లని అడ్డుకొని, తిరిగి వెనక్కు పంపించారు. ఈ నేపథ్యంలోనే ఘర్షణ చోటు చేసుకోవడంతో.. ఇరు వర్గాల వారు గాయాలపాలయ్యారు.
#WATCH | Kangra, Himachal Pradesh: Dalai Lama says, "…There is no point in returning to China. I prefer India. That's the place. Kangra – Pandit Nehru's choice, this place is my permanent residence…" pic.twitter.com/Wr6dGEPIIx
— ANI (@ANI) December 19, 2022
తాజావార్తలు
-
Assembly Elections Exit poll 2026: బెంగాల్లో మమత అడ్రస్ గల్లంతు.. కాషాయానిదే గెలుపు..
-
Ask YouTube: యూట్యూబ్ యూజర్లకు సర్ప్రైజ్.. సెర్చ్ బార్లో ఏఐ ఫీచర్ వచ్చేస్తోంది!
-
EPIC Teaser : ఆసక్తి పెంచేలా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టీజర్
-
Egg Pickle Recipe : నాలుకపై నర్తించే రుచి.. ఇంట్లోనే కోడిగుడ్డు పచ్చడి.. తయారీ విధానం ఇలా..!
-
Toxic Effect: ‘మా ఇంటి బంగారం’ వాయిదా?
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!