Myanmar: కాలేజ్ విద్యార్థులకు ఉరిశిక్ష.. సైనికపాలకుల దురాగతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
College Students Sentenced To Death By Myanmar Junta: మయన్మార్ లో ప్రజాపాలనను గద్దె దించి అక్కడ సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అప్పటి నుంచి అక్కడి ప్రజలు నిరసనలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యం కోసం ఉద్యమం చేశారు. అయితే ఈ ఉద్యమాన్ని అక్కడి జుంటా ప్రభుత్వం అత్యంత క్రూరంగా అణచివేసింది. ఉద్యమంలో పాల్గొన్న వారిని కాల్చేస్తూ చాలా మందిని చంపేశారు. ఇదిలా ఉంటే సైనికపాలనకు వ్యతిరేకంగా ఉన్నవారిని అనేక ఆరోపణలతో వరసగా ఉరి తీస్తోంది సైనిక ప్రభుత్వం. ఇప్పటి వరకు 139 మందిని మరణశిక్ష పేరుతో చంపేసింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ వారం ఏడుగురికి ఉరిశిక్ష విధించింది. ఏడుగురు యూనివర్సిటీ విద్యార్థులను బుధవారం తలుపులు మూసేసి ఉరితీసినట్లు యూఎన్ మానవ హక్కుల హై కమిషనర్ వోల్కర్ టర్క్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఈ మరణశిక్షలపై అక్కడి జుంటా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. నిరసనలను అణచివేసేందుకు మరణశిక్షలను మయన్మార్ సాధనంగా ఉపయోగిస్తోందని ఐక్యరాజ్యసమితి ఆరోపించింది.
Also Read
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
- Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
- Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
- Crude Oil Prices: ఇరాన్కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
Read Also: Apple: చైనాకు షాక్ ఇవ్వనున్న ఆపిల్.. భారత్కు మంచి అవకాశం
ఆగ్నేయాసియా దేశం అయిన మయన్మార్ లో ఫిబ్రవరి 2021లో ఆంగ్ సాన్ సూకీ పౌరప్రభుత్వాన్ని కూల్చేసి సైనికపాలన తీసుకువచ్చారు. సూకీతో పాటు పలువురు రాజకీయ నాయకులను అరెస్ట్ చేసి జైళ్లలో వేశారు. తాజాగా జరిగిన విద్యార్థుల ఉరిశిక్షలపై యూఎన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. యాంగోన్ విశ్వవిద్యాలయ విద్యార్థులను బ్యాంకు కాల్పుల్లో పాల్గొన్నారనే ఆరోపణలపై ఏప్రిల్ లో అరెస్ట్ చేశారు. తాజాగా వీరిని ఉరి తీశారు. విద్యార్థులపై మరణశిక్ష అమలు చేయడం మిలిటరీ ప్రతీకారం తీర్చుకునే చర్యగా అక్కడి విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోంది. మరో నలుగురు యువ కార్యకర్తలకు కూడా గురువారం అక్కడి ప్రభుత్వం మరణశిక్ష విధించింది.
ప్రభుత్వాన్ని కూలదోసిన తర్వాత జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వరకు 2280 మంది పౌరులు మరణించారు. అసమ్మతిని తొలగించే పేరుతో సైనిక ప్రభుత్వం 11,637 మంది ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. నిరసనలను అణచివేసేందుకు 30 ఏళ్ల తరువాత మరణశిక్షలను ప్రయోగిస్తోంది.
తాజావార్తలు
-
USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
-
Hero – Director : హిట్స్ కోసం కొత్త రూట్ వెతుకుతున్న హీరోలు, దర్శకులు
-
Vaibhav Sooryavanshi: మైదానంలోనే కాదు మార్కెట్లోనూ వైభవ్ జోరు.. 15 ఏళ్లకే కోట్లలో సంపాదన!
-
Prakash Raj: “నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు”.. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
-
AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?