Myanmar: కాలేజ్ విద్యార్థులకు ఉరిశిక్ష.. సైనికపాలకుల దురాగతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
College Students Sentenced To Death By Myanmar Junta: మయన్మార్ లో ప్రజాపాలనను గద్దె దించి అక్కడ సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అప్పటి నుంచి అక్కడి ప్రజలు నిరసనలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యం కోసం ఉద్యమం చేశారు. అయితే ఈ ఉద్యమాన్ని అక్కడి జుంటా ప్రభుత్వం అత్యంత క్రూరంగా అణచివేసింది. ఉద్యమంలో పాల్గొన్న వారిని కాల్చేస్తూ చాలా మందిని చంపేశారు. ఇదిలా ఉంటే సైనికపాలనకు వ్యతిరేకంగా ఉన్నవారిని అనేక ఆరోపణలతో వరసగా ఉరి తీస్తోంది సైనిక ప్రభుత్వం. ఇప్పటి వరకు 139 మందిని మరణశిక్ష పేరుతో చంపేసింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ వారం ఏడుగురికి ఉరిశిక్ష విధించింది. ఏడుగురు యూనివర్సిటీ విద్యార్థులను బుధవారం తలుపులు మూసేసి ఉరితీసినట్లు యూఎన్ మానవ హక్కుల హై కమిషనర్ వోల్కర్ టర్క్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఈ మరణశిక్షలపై అక్కడి జుంటా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. నిరసనలను అణచివేసేందుకు మరణశిక్షలను మయన్మార్ సాధనంగా ఉపయోగిస్తోందని ఐక్యరాజ్యసమితి ఆరోపించింది.
Also Read
- China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
Read Also: Apple: చైనాకు షాక్ ఇవ్వనున్న ఆపిల్.. భారత్కు మంచి అవకాశం
ఆగ్నేయాసియా దేశం అయిన మయన్మార్ లో ఫిబ్రవరి 2021లో ఆంగ్ సాన్ సూకీ పౌరప్రభుత్వాన్ని కూల్చేసి సైనికపాలన తీసుకువచ్చారు. సూకీతో పాటు పలువురు రాజకీయ నాయకులను అరెస్ట్ చేసి జైళ్లలో వేశారు. తాజాగా జరిగిన విద్యార్థుల ఉరిశిక్షలపై యూఎన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. యాంగోన్ విశ్వవిద్యాలయ విద్యార్థులను బ్యాంకు కాల్పుల్లో పాల్గొన్నారనే ఆరోపణలపై ఏప్రిల్ లో అరెస్ట్ చేశారు. తాజాగా వీరిని ఉరి తీశారు. విద్యార్థులపై మరణశిక్ష అమలు చేయడం మిలిటరీ ప్రతీకారం తీర్చుకునే చర్యగా అక్కడి విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోంది. మరో నలుగురు యువ కార్యకర్తలకు కూడా గురువారం అక్కడి ప్రభుత్వం మరణశిక్ష విధించింది.
ప్రభుత్వాన్ని కూలదోసిన తర్వాత జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వరకు 2280 మంది పౌరులు మరణించారు. అసమ్మతిని తొలగించే పేరుతో సైనిక ప్రభుత్వం 11,637 మంది ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. నిరసనలను అణచివేసేందుకు 30 ఏళ్ల తరువాత మరణశిక్షలను ప్రయోగిస్తోంది.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!